(1 / 11)
లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం (మే 20) జరుగుతోంది. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వినియోగించుకున్నారు. ఆయన తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ కూడా ఉన్నారు.
(2 / 11)
బాలీవుడ్ స్టార్ దంపతులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణ్ కూడా ముంబైలోనే ఓటేశారు. ఇద్దరూ వైట్ కలర్ ఔట్ఫిట్ ధరించారు. నిండు గర్భంతో ఓటు వేసేందుకు వచ్చారు దీపిక.
(3 / 11)
యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పింక్ అనార్కలీ డ్రెస్లో స్టైలిష్ లుక్తో ఆమె మెరిశారు.
(4 / 11)
ప్రముఖ నిర్మాత బోణీ కపూర్, ఖుషి కపూర్ ముంబైలోని పాలి హిల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
(5 / 11)
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
(6 / 11)
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. తన తండ్రితో కలిసి వచ్చి ముంబైలోని ఓ పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
(7 / 11)
సీనియర్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ముంబైలో ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
(8 / 11)
బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమామాలిని కూడా ముంబైలో సోమవారం ఓటు వేశారు. నవ్వుతూ తన వేలికి ఉన్న ఇంక్ మార్క్ చూపించారు.
(9 / 11)
స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓటు వేసిన తర్వాత తన చూపుడు వేలును చూపించారు.
(10 / 11)
జోయా అక్తర్, పర్హాన్ అక్తర్ తమ తల్లితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
(11 / 11)
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుసేన్.. వీల్ ఛైర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.
ఇతర గ్యాలరీలు