OTT Crime Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి చంపే సైకో- నేరుగా స్ట్రీమింగ్!-highway ott streaming on aha anand deverakonda saiyami kher telugu psycho crime thriller movie highway ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి చంపే సైకో- నేరుగా స్ట్రీమింగ్!

OTT Crime Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి చంపే సైకో- నేరుగా స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

Highway Telugu Movie OTT Streaming: ఓటీటీలో తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైవే స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా హైవే నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. రోడ్ ట్రావెల్, సైకో క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన హైవే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి చంపే సైకో- నేరుగా స్ట్రీమింగ్!

Highway Telugu Movie OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చి అలరిస్తుంటాయి. ఒక్కోటి ఒక్కో రకం జోనర్‌తో వచ్చిన పలు ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇక హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ వంటి జోనర్ మూవీస్‌ను ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

బేబీ కంటే ముందుగా

అలా నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంది. అదే హైవే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ఓటీటీ సినిమానే హైవే. దొరసాని సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ హిట్ కంటే ముందుగా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేశాడు.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సిరీస్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన ఓటీటీ సినిమా హైవే. 2022లో డైరెక్ట్‌గా హైవే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు మిస్టరీ సైకో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో హైవే తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ కథతోపాటు, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అందించారు. వెంకట్ తలాటి నిర్మాతగా వ్యవహరించారు.

బాలీవుడ్ హీరోయిన్

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హైవే ఓటీటీ రిలీజ్ అయింది. హైవే తెలుగు మూవీలో ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తే అతనికి జోడీగా హీరోయిన్ మానస రాధాకృష్ణన్ యాక్ట్ చేసింది. ఇక హిందీ హీరోయిన్ సయామీ ఖేర్, బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అభిషేక్ బెనర్జీ ఇతర కీలక పాత్రలు పోషించారు.

అభిషేక్ బెనర్జీ ఇదివరకు రానా నాయుడు ఓటీటీ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఇలా నలుగురు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీ సజెషన్ కింద ఓ లుక్కేయొచ్చు. తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో హైవే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 2022 ఆగస్ట్ 19న నేరుగా ఆహాలో హైవే ఓటీటీ రిలీజ్ అయింది.

హైవేపై రెస్పాన్స్

అయితే, హైవే సినిమాకు ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు కావాల్సినట్లుగా ఉన్న సీన్స్, టేకింగ్ రొటీన్‌‌గా, పేలవంగా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. కానీ, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాను ఓసారి లుక్కేయొచ్చు.

ఇక హైవే కథ విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్లే హైవే రూట్‌లో రోడ్డుపై కనిపించే అమ్మాయిలను వెంటాడి ఓ సైకో కిల్లర్ డీ పేరుతో కిరాతకంగా చంపుతుంటాడు. యువతులను చంపడంలోనే ఆనందం పొందుతుంటాడు. మరోవైపు ఓ వెడ్డింగ్ ఫొటోషూట్ పనిపైన ఫొటోగ్రాఫర్ విష్ణు ట్రావెల్ చేస్తాడు. ఇంకోవైపు తన బాస్ నుంచి తప్పించుకునేందుకు తులసి అనే యువతి మంగళూర్‌కు వెళ్లాలనుకుంటుంది.

ఆహా ఓటీటీలో

ఈ క్రమంలో సైకో కిల్లర్ చేతికి తులసి చిక్కుతుంది. మరి తులసిని విష్ణు కాపాడాడా?, విష్ణు తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ? పోలీస్ ఆఫీసర్ ఆశా భారత్ పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హైవేను చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం