Romantic Comedy OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - వల్గారిటీ లేకుండా!
Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Romantic Comedy OTT: హెబ్బా పటేల్ హీరోయిన్గా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ధూం ధాం ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్గా ఈ మూవీ శుక్రవారం అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. థియేటర్లలో విడుదలైన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
గోపీమోహన్ కథ, స్క్రీన్ప్లే...
ధూం ధాం మూవీలో చేతన్ కృష్ణ హీరోగా నటించాడు. వెన్నెల కిషోర్, సాయికుమార్, గోపరాజు రమణతో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. గోపిమోహన్ కథ, స్క్రీన్ప్లేను సమకూర్చిన ఈ మూవీకి సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించాడు.
వల్గారిటీ లేకుండా...
నవంబర్ ఫస్ట్ వీక్లో ధూం ధాం మూవీ థియేటర్లలో రిలీజైంది. వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆడియెన్స్ను మెప్పించింది. కానీ కాన్సెప్ట్ పాతది కావడం, టేకింగ్లో కొత్తదనం మిస్సవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మూవీ యావరేజ్గా నిలిచింది.
తండ్రీకొడుకుల కథ...
రామరాజుకు (సాయికుమార్) కొడుకు కార్తీక్ (చేతన్ కృష్ణ)అంటే ప్రాణం. కొడుకు సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. కార్తీక్ కూడా తండ్రే లోకంగా బతుకుంటాడు. అలాంటి కార్తీక్ లైఫ్లోకి సుహానా (హెబ్బా పటేల్) వస్తుంది. గొడవలతో మొదలైన కార్తీక్, సుహానా పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్లోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే నిజం బయటపడుతుంది. ఆ గొడవలకు కారణం ఏమిటి? సుహానా ఫ్యామిలీకి రామరాజు, కార్తీక్ ఎలాంటి ద్రోహం తలపెట్టారు? సుహానా ప్రేమను కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు అన్నదే ధూం ధాం మూవీ కథ.
గ్లామర్ రోల్...
ధూం ధాం మూవీలో హెబ్బా పటేల్ గ్లామర్ రోల్లో కనిపించింది. డైరెక్టర్ మారుతి నిర్మించిన రోజులు మారాయి మూవీతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు చేతన్ కృష్ణ. ఫస్ట్ ర్యాంక్ రాజు, గల్ఫ్, బీచ్ రోడ్ చేతన్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలేవి అతడికి విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి. హెబ్బా పటేల్ కూడా కమర్షియల్ హిట్ అందుకొని చాలా కాలమైంది. ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా అవకాశాల్ని అందుకుంటోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన పలు సినిమాలకు గోపీమోహన్ కథను అందించారు.