Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ - రిపీట్ టెలికాస్ట్‌లో టీఆర్‌పీ అదుర్స్‌-guppedantha manasu serial repeat telecast timing changed by star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ - రిపీట్ టెలికాస్ట్‌లో టీఆర్‌పీ అదుర్స్‌

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ టైమ్ ఛేంజ్ - రిపీట్ టెలికాస్ట్‌లో టీఆర్‌పీ అదుర్స్‌

Nelki Naresh HT Telugu

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు రిపీట్ టెలికాస్ట్ టైమ్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇన్నాళ్లు మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల ముప్పై నిమిషాల‌కు ఈ సీరియ‌ల్‌ ప్ర‌సార‌మ‌వుతూ వ‌చ్చింది. ఇక నుంచి ఈ సీరియ‌ల్ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల ముప్పై నిమిషాల‌కు టెలికాస్ట్ అవుతుంద‌ని స్టార్ మా ప్ర‌క‌టించింది.

గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ స్టార్ మా ఛానెల్‌లో రీ టెలికాస్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రీ టెలికాస్ట్ టైమ్‌ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇన్నాళ్లు మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల ముప్ఫై నిమిషాల‌కు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతూ వ‌చ్చింది. సోమ‌వారం నుంచి ఈ సీరియ‌ల్‌ను మ‌రో మూడు గంట‌లు ముందుకు షిఫ్ట్ చేశారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్ర‌సార‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని స్టార్ మా అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది.

నాలుగేళ్ల త‌ర్వాత‌....

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ 2020 డిసెంబ‌ర్‌లో మొద‌లైంది. నాలుగేళ్ల పాటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ సీరియ‌ల్‌కు గ‌త‌ ఏడాది ఆగ‌స్ట్‌లో మేక‌ర్స్ ఎండ్ కార్డ్ వేశారు. తెలుగులో టాప్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు నిలిచింది. టీఆర్‌పీలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది.

2021 డిసెంబ‌ర్‌లో ఏకంగా 14. 30 టీఆర్‌పీతో రికార్డ్ క్రియేట్ చేసింది. రిషి పాత్ర‌ను చేసి ముఖేష్ గౌడ చాలా కాలం పాటు సీరియ‌ల్‌కు దూరం కావ‌డంతో గుప్పెడంత మ‌న‌సు ఆద‌ర‌ణ త‌గ్గుతూ వ‌చ్చింది. రిషి రీఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కూడా డ్రామా అనుకున్న స్థాయిలో పండ‌క‌పోవ‌డంతో సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభంకార్డు వేశారు.

రీ టెలికాస్ట్ టీఆర్‌పీ...

రిపీట్ టెలికాస్ట్‌లో ఈ సీరియ‌ల్ అద‌ర‌గొడుతోంది. లెటెస్ట్ టీఆర్‌పీలో రిపీట్ టెలికాస్ట్ ఎపిసోడ్స్‌కు 2.39 టీఆర్‌పీ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న రీ టెలికాస్ట్ సీరియ‌ల్స్‌లో హ‌య్యెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న సీరియ‌ల్‌గా గుప్పెడంత మ‌న‌సు నిలిచింది.

సీక్వెల్‌...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ లీడ్ రోల్స్‌లో న‌టించారు. సాయికిర‌ణ్‌, జ్యోతిరాయ్, సంగీత, సురేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు సీక్వెల్ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్‌కు నిండు మ‌న‌సులు అనే టైటిల్ క‌న్ఫామ్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ నిండు మ‌న‌సులు సీరియ‌ల్‌కు, గుప్పెడంత మ‌న‌సుకు సంబంధం లేద‌ని ఇటీవ‌లే మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు.

హీరోగా ఎంట్రీ...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముఖేష్ గౌడ ప్ర‌స్తుతం సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోన్నాడు. గీతాశంక‌రం మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో ప్రియ‌మైన నాన్న‌కు పేరుతో ఓ బైలింగ్వ‌ల్ మూవీ కూడా చేస్తోన్నాడు.

మ‌రోవైపు గుప్పెడంత మ‌న‌సులో కీల‌క పాత్ర‌లో న‌టించిన జ్యోతిరాయ్ ప్ర‌స్తుతం తెలుగులో ఏ మాస్ట‌ర్ పీస్‌, కిల్ల‌ర్ సినిమాలు చేస్తోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం