Guppedantha Manasu May 30th Episode: జ‌గ‌తిని అపార్థం చేసుకున్న మ‌హేంద్ర - రిషి ప్రాణాల‌ను తీయాల‌ని డిసైడ్ అయిన శైలేంద్ర-guppedantha manasu may 30th episode mahendra misjudges jagathi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu May 30th Episode Mahendra Misjudges Jagathi

Guppedantha Manasu May 30th Episode: జ‌గ‌తిని అపార్థం చేసుకున్న మ‌హేంద్ర - రిషి ప్రాణాల‌ను తీయాల‌ని డిసైడ్ అయిన శైలేంద్ర

HT Telugu Desk HT Telugu
May 30, 2023 08:21 AM IST

Guppedantha Manasu May 30th Episode: రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి జ‌గ‌తినే కార‌ణ‌మ‌ని భ్ర‌మ‌ప‌డిన మ‌హేంద్ర ఆమెను నానా మాట‌లు అంటాడు. మ‌రోవైపు రిషిని చంపేయాల‌ని శైలేంద్ర డిసైడ్ అవుతాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే....

గుప్పెడంత మ‌న‌సు
గుప్పెడంత మ‌న‌సు

Guppedantha Manasu May 30th Episode: మెడిక‌ల్ కాలేజీ ప‌నుల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన మ‌హేంద్ర ఆనందంతో ఇంట్లో అడుగుపెడ‌తాడు. తాను వెళ్లిన ప‌ని స‌క్సెస్ కావ‌డంతో ఆ విష‌యాన్ని మొద‌ట రిషితోనే పంచుకోవాల‌ని అత‌డి కోసం ఇళ్లు మొత్తం వెతుకుంటాడు. జ‌గ‌తి క‌నిపించ‌గానే రిషి క‌ల నెర‌వేరింది. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగానే జ‌రిగింద‌ని ఆనందంతో ఆమెకు చెబుతాడు. ఢిల్లీలోని పెద్ద‌లంతా రిషి మేథ‌స్సుకు ఆశ్చ‌ర్య‌పోయార‌ని చెబుతాడు. మ‌హేంద్ర ఎంత మాట్లాడుతున్నా జ‌గ‌తి మాత్రం మౌనంగానే ఉంటుంది.

రోజురోజుకు రిషి పేరుప్ర‌ఖ్యాతులు, ఆద‌ర‌ణ పెరిగిపోతున్నాయ‌ని, రిషి నీతి, నిజాయితీకి మారుపేరు అని సంతోష‌ప‌డ‌తాడు.తండ్రిగా ఇంత‌కంటే ఆనందం ఏముంటుంద‌ని సంబ‌ర‌ప‌డిపోతుంటాడు. రిషి కోసం గిఫ్ట్ తెచ్చాన‌ని అంటాడు. రిషి బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా చేయాల‌ని అంద‌రితో చెబుతాడు. రిషికి తెలియ‌కుండా స‌ర్‌ప్రైజ్ ఇద్దామ‌ని మ‌హేంద్ర సంతోషంగా ఫ‌ణీంద్ర‌, శైలేంద్ర‌ల‌తో అంటాడు. జీవితంలో రిషికి మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇద్దామ‌ని సంతోషంలో మునిగిపోతాడు.

జ‌గ‌తి మౌనం...

ఆ త‌ర్వాత రిషి, వ‌సుధార ఎక్క‌డున్నార‌ని జ‌గ‌తినిఅడుగుతాడు మ‌హేంద్ర‌. అత‌డి ప్ర‌శ్న‌కు జ‌గ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. దేవ‌యానికి క‌ల్పించుకొని రిషి, వ‌సుధార ఎక్క‌డికి వెళ్లారో చెప్పు అని జ‌గ‌తిపై సెటైర్స్ వేస్తుంది. అక్క‌డ చేసిందంతా చేసి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నావు. నా కొడుకు ఎక్క‌డ అని అడుగుతున్న మ‌హేంద్ర‌కు నోరు తెరిచి స‌మాధానం చెప్ప‌మ‌ని వ్యంగ్యంగా అంటుంది. మ‌హేంద్ర కంగారుగా జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగిందా అని అడుగుతాడు. అత‌డితో రిషి మ‌న‌సును జ‌గ‌తి గాయ‌ప‌రిచింద‌ని తాను చేసిన కుట్ర‌ను జ‌గ‌తిపై వేస్తాడు శైలేంద్ర‌.

మ‌హేంద్ర షాక్‌...

మ‌న‌ల్ని, కాలేజీని వ‌దిలిపెట్టి రిషి ఎక్క‌డికి వెళ్లిపోయాడ‌ని దేవ‌యాని చెప్పిన మాట విని మ‌హేంద్ర షాక్ అవుతాడు. కాలేజీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని అత‌డికి దేవ‌యాని చెబుతుంది.

జ‌గ‌తి వ‌ల్లే రిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడ‌ని భావించిన మ‌హేంద్ర కూడా జ‌గ‌తిని అపార్థం చేసుకుంటాడు. ఎవ‌రి మీద అభియోగం మోపావో తెలుసా అంటూ కోపంతో జ‌గ‌తిపైఅరుస్తాడు. నీతి, నిజాయితికి నిలువెత్తు నిద‌ర్శ‌నం రిషి. అలాంటివాడి మీద ఎందుకు నింద మోపావ‌ని జ‌గ‌తిని ప్ర‌శ్నిస్తాడు. జ‌గ‌తి అత‌డిని క‌న్వీన్స్ చేయ‌బోతుంటే ఆమె మాట‌ల‌ను మ‌హేంద్ర విన‌డు.

నేను నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు నా ప్రాణాల‌ను తీసేశావ‌ని బాధ‌ప‌డ‌తాడు. చిన్న‌ప్పుడు రిషిని ఒంట‌రిగా వ‌దిలివేసి ఏవేవో సాకులు చెప్పావు. ఇప్పుడు వాడిని ఈ ఇంటికి శాశ్వ‌తంగా దూరం చేశావ‌ని జ‌గ‌తిపై ఫైర్ అవుతాడు. నువ్వు ఈ ఇంట్లో నుంచి రావ‌డానికి కార‌ణ‌మైన వాడినే బ‌య‌ట‌కు గెంటేశావు. రిషిని పంపించేసి మ‌ళ్లీ న‌న్ను ఒంట‌రివాడిని చేశావ‌ని ఎమోష‌న‌ల్ అవుతాడు.

దేవ‌యాని ఓవ‌ర్‌యాక్టింగ్‌...

ఎందుకు రిషి మీద నీకు అంత కోపం...నీ క‌డుపున పుట్ట‌డ‌మే వాడు చేసిన త‌ప్పా అని కోపంగా అడుగుతాడు. మ‌హేంద్ర ఆవేశంగా అడిగిన ప్ర‌శ్న‌కు జ‌గ‌తి మౌనంగా ఉంటుంది. రిషి త‌ప్ప‌కుండా మ‌న‌కోసం ఇంటికి తిరిగి వ‌స్తాడ‌ని, ఆవేశ‌ప‌డొద్ద‌ని మ‌హేంద్ర‌తో ఫ‌ణీంద్ర అంటాడు.

రిషికి అత్మాభిమానం ఎక్కువ‌. వాడు మ‌న మొహం కూడా చూడ‌డు అన్న‌య్య అంటూ మ‌హేంద్ర అత‌డికి బ‌దులిస్తాడు. దొరికిందే అవ‌కాశంగా అన్నెపున్నెం తెలియ‌ని నా కొడుకుపై క‌ట్టుక‌థ‌లు అల్లి గురుశిష్యురాళ్లు క‌లిసి మా అంద‌రికి దూరం చేశార‌ని దేవ‌యాని ఓవ‌ర్ యాక్టింగ్ చేస్తుంది.

జ‌గ‌తికి శైలేంద్ర వార్నింగ్‌...

రిషి ఏ త‌ప్పు చేయ‌డు. ప్రాణం పోయినా చిన్న మిస్టేక్ చేయ‌డ‌ని మేము చెప్పిన ఎవ‌రూ త‌మ మాట లెక్క‌చేయ‌లేద‌ని శైలేంద్ర కూడా జ‌గ‌తిపై మ‌హేంద్ర‌కు ఉన్న కోపాన్ని మ‌రింత పెంచుతాడు. దీని వెనుక ఏ కార‌ణం ఉంది. ఏం ఆశించి ఈ ప‌ని చేశావ‌ని జ‌గ‌తిని అడుగుతాడు మ‌హేంద్ర‌. వాడికి గొప్ప త‌ల్లిగా నువ్వు, గొప్ప భార్య‌గా వ‌సుధార ఉంటార‌నుకున్నా. కానీ వాడిని మోసం చేసి మీరిద్ద‌రు చిర‌కాలం చ‌రిత్ర‌లో నిలిచిపోయార‌ని అంటాడు.

రిషి బాగు కోస‌మే ఇదంతా చేశాన‌ని జ‌గ‌తి అంటుంది. ఆమె మాట‌ల‌ను హేళ‌న చేస్తాడు మ‌హేంద్ర‌. వాడిని మోసం చేసే బ‌ల‌మైన కార‌ణం ఏమిట‌ని మ‌హేంద్ర అడుగుతాడు. ఆమె నిజం చెప్పాల‌ని అనుకుంటుంది.

కానీ క‌ళ్ల‌తోనే జ‌గ‌తిని బెదిరిస్తాడు శైలేంద్ర‌. రిషిని కాలేజీ నుంచి దూరం చేయ‌మ‌ని ఎవ‌రైనా బెదిరించారా? రిషిని ఏదో చేస్తార‌ని అత‌డిని నేర‌స్తుడిని బాగా లేద‌ని శైలేంద్ర కూడా నాట‌కం ఆడుతాడు. ఎవ‌రు ఎంత మాట‌లు అన్నా జ‌గ‌తి మాత్రం మౌనం వీడ‌దు. కొడుకును చూడాల‌ని సంతోషంగా వ‌చ్చాన‌ని, చివ‌ర‌కు త‌న‌కు క‌న్నీళ్ల‌నే మిగిల్చార‌ని మ‌హేంద్ర అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

మ‌హేంద్ర వెళ్లిపోగానే జ‌గ‌తి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన శైలేంద్ర‌...బాధేస్తుందా, ధైర్యం స‌రిపోవ‌డం లేదా పిన్ని అంటూ మ‌రోసారి బెదిరింపుల‌కు దిగుతాడు. రిషిని నువ్వు కాలేజీ నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డం వెనుక ఏదో కార‌ణం ఉంద‌ని బాబాయ్ అనుకుంటున్నాడు. అత‌డి క‌న్నీళ్ల‌కు క‌రిగిపోయి నిజం చెబితే బాబాయ్‌ని కూడా మ‌ట్టిలో క‌లిపేస్తాన‌ని జ‌గ‌తికి శైలేంద్ర వార్నింగ్ ఇస్తాడు.

అత‌డి మాట‌ల‌కు ఆమె షాక్ అవుతుంది. మేము చెప్పాల్సింది చెప్పాం...ఆ త‌ర్వాత నీ ఇష్టం..కొడుకును ఎలాగూ దూరం చేసుకున్నావు. ఇక నీ ప‌సుపు కుంకుమల‌ను కాపాడుకుంటావో లేదో నువ్వే ఆలోచించుకో అని దేవ‌యాని కూడా జ‌గ‌తిని భ‌య‌పెడుతుంది.

రిషి ప్రాణాల‌కు ప్ర‌మాదం...

రిషి నుంచి కాలేజీతో పాటు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పంపించినా ఎండీ సీట్ ద‌క్క‌క‌పోవ‌డంతో శైలేంద్ర కోపంతో ర‌గిలిపోతుంటాడు. రిషిని ఇంట్లో లేక‌పోవ‌డంతో జ‌గ‌తి తాను చెప్పింది విన‌ద‌ని అనుకుంటాడు. నిజం తెలిసి రిషి తిరిగివ‌స్తే జ‌న్మ‌లో త‌న క‌ల నెర‌వేర‌ద‌ని, . డీబీఎస్‌టీ కాలేజీకి తాను రాజును కాలేన‌ని అత‌డికి అర్థ‌మ‌వుతుంది.

అందుకోసం రిషి ప్రాణాల‌ను తీయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఇంత‌లోనే శైలేంద్ర‌కు కొంద‌రు రౌడీలు ఫోన్ చేసి రిషి త‌మ‌కు క‌నిపించాడ‌ని అంటారు. ఎవ‌రూ చూడ‌కుండా వాడిని చంపేయ‌మ‌ని శైలేంద్ర వారికి చెబుతాడు. జీవితంలో ఊహించ‌నంత డ‌బ్బు ఇస్తాన‌ని అంటాడు. శైలేంద్ర చెప్పిన‌ట్లుగానే చేయాల‌ని రౌడీలు డిసైడ్ అవుతారు. . రిషి ఛాప్ట‌ర్ క్లోజ్ అని శైలేంద్ర త‌న‌లో తానే అనుకుంటాడు.

కొత్త క్యారెక్ట‌ర్ ఎంట్రీ...

ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన రిషి రోడ్‌పై న‌డుచుకుంటూ వెళుతుంటాడు. అత‌డిని రౌడీలు ఫాలో అవుతుంటారు. ఓ యువ‌తి కారు పాడైపోతుంది. రిపేర్ చేయ‌డం రాక ఇబ్బంది ప‌డుతుంది. ఆమెకు రిషి హెల్ప్ చేస్తాన‌ని అంటాడు. రిషి ప్రాణాల‌కు తీసే అవ‌కాశం కోసం ఎదురుచూస్తోన్న రౌడీల‌కు మ‌ధ్య‌లో ఆ అమ్మాయి ఎంట్రీ కావ‌డంతో ఏం చేయాలో అర్థం కాదు.

ఇంత‌లోనే ఆ అమ్మాయి మీరు రిషి క‌దా అని అన‌డంతో అత‌డు ఆశ్చ‌ర్చ‌పోతాడు. అక్క‌డితో నేటి గుప్ప‌డంత మ‌న‌సు ముగిసింది. ఆ అమ్మాయి ఎవ‌రు? రిషి ప్రాణాల‌కు రౌడీలు ఎలాంటి ఆప‌ద త‌ల‌పెట్టార‌న్న‌ది తెలియాలంటే రేప‌టి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ చూడాల్సిందే...

IPL_Entry_Point