Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రోహిణి గురించి బాలుకు ఫోన్ చేసి అడిగితే.. కేపీ పాలెం వెళ్లినట్లు చెబుతున్నారు. డీజిల్ తక్కువ ఉంది. డబ్బులు తీసుకుని రా కలిసి వెళ్దాం అని బాలు అంటాడు. తర్వాత మీనాను కలుస్తారు బాలు, మనోజ్.
మీనా దగ్గర డబ్బులు తీసుకుని మీనాను ఫ్రంట్ సీట్లో కూర్చొబెట్టి.. మనోజ్ను వెనుక సీట్లోకి పంపిస్తాడు బాలు. రోహిణిని ఎలాగైనా తీసుకురుమ్మని మామయ్య మరి మరి చెప్పారు అని మీనా అంటుంది. ఆవిడేమైనా పార్లర్లో దొరికే పౌడరా.. పార్లర్కు ఓనర్. అలిగి వెళ్లిపోయింది. వీడి టైమ్ బాగుంటే దొరుకుతుంది లేకుంటే లేదు అని బాలు అంటాడు. లేదా మలేషియా వెళ్లింటుందా అని మీనా డౌట్ పడుతుంది. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్లి వెతకాలా అని బాలు అంటాడు.
తను కేపీ పాలెం వెళ్లిందన్నారు అని మీనా అడిగితే.. ఆ బస్ ఎక్కిందని చెప్పారు. వెళ్లిందో లేదో తెలియదు. ఏ అమ్మాయి అయినా భర్త అంటే.. పుట్టింటికే వెళ్తారు. నువ్ కూడా పుట్టింటికే కదా. మరి నీ భార్య ఏంటీ ఏ సంబంధం లేని కేపీ పాలెం ఎందుకు వెళ్లింది. అక్కడ ఎవరైన తెలిసినవాళ్లు ఉన్నారా అని బాలు అంటాడు. నాకెం తెలుసు అని మనోజ్ అంటాడు. మరేం తెలుసురా నీకు అని బాలు సైటెర్లు వేస్తాడు. పార్లరమ్మకు పెద్ద పెద్ద లాయర్స్ తెలుసునకుంటాను. వాళ్లతో మాట్లాడటానికి వెళ్లిందేమో. వీడికి డైవర్స్ ఇవ్వడానికి అని బాలు అంటాడు.
ఇద్దరు షాక్ అవుతారు. ఏంటండి ఆ మాటలు అని మీనా అంటుంది. ఏమో ఏమైనా జరగొచ్చు. అరేయ్ నువ్ కూడా ఓ మంచి లాయర్ను మాట్లాడుకో అని బాలు అంటాడు. మాట్లడకుండా ఉండలేరా అని మీనా అంటే.. మాట్లాడను పాడుతాను అని పాటలు పాడుతాడు. అయినా బాలు ఏదోటి అంటూ సెటైర్లు వేస్తూనే ఉంటాడు. ఇంట్లో ఏం తినలేదని కిరాణం షాపు నుంచి చిరుతిళ్లు తెచ్చుకుంటాడు బాలు. మళ్లీ బాలు మాట్లాడుతుంటే మీనా కోపంగా చూస్తుంది.
ఏంటీ ఎవరు మాట్లాడకుండా ఉంటే నడిపేవాడికి నిద్ర వస్తుంది అని అన్న బాలు అరేయ్ మనోజ్ ఈ దగ్గరిలో ఏదైనా మంచి పార్క్ ఉందా పడుకోడానికి. అంటే నీకు బాగా తెలుసు కదా అని బాలు మళ్లీ సెటైర్లు స్టార్ట్ చేస్తాడు. అదేపనిగా మాట్లాడితే నోరు నొప్పి పెట్టదా అని మీనా అంటుంది. ఆ ఊరులోకి వెళ్లాక ఎవరిని అడగాలి అని బాలు అంటే.. చింటు వాళ్ల అమ్మమ్మకు కాల్ చేశాను. కానీ కలవలేదు. ఎవరినో ఒకరిని అడుగుదాం అని మీనా అంటుంది.
ఊరిలో ఒక్కొక్కరిని మీనా, బాలు, మనోజ్ అడుగుతుంటారు. ఈ క్రమంలో మనోజ్ను ఓ అమ్మాయి కొట్టబోతుంది. మరోవైపు తల్లి దగ్గరికి రోహిణి వెళ్తుంది. ఇదికల నిజమా అని తల్లి అంటుంది. దాంతో తల్లిని కౌగిలించుకుని ఏడుస్తుంది రోహిణి. ఏమైందని చెప్పమంటుంది. ఎన్నడులేనిది ఇంత ఏడ్చావ్ అంటే నీకు అంత ఏం కష్టం వచ్చిందో చెప్పమ్మా అని తల్లి అడుగుతుంది. మోసపోయాను అమ్మా. మనోజ్ నన్ను మోసం చేశాడు. ఉద్యోగం ఉందని చెప్పి వెళ్లి పార్క్లో కూర్చుంటున్నాడు అని రోహిణి అంటుంది.
నువ్ బాధపడుతావని అబద్ధం చెప్పి ఉంటాడు అని తల్లి అంటుంది. అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి. నేను అంతగా నమ్మితే నన్ను ఎందుకు మోసం చేయాలి అని రోహిణి అంటుంది. మరి నువ్ చేసిందేంటమ్మా. నువ్ బాధపడతావని ఉద్యోగం ఉందని చెప్పి ఉండొచ్చు. మరి నువ్వేం చేశావ్. ఉన్న తల్లిని లేదని చెప్పావ్. లేని తండ్రిని ఉందని చెప్పావ్. కన్న కొడుకును కొడుకే కాదని చెప్పావ్. ఇంతకుముందు పెళ్లి కాదని చెప్పావ్. నువ్ చెప్పిన దాంతో పోలిస్తే అల్లుడు చేసింది తప్పే కాదు అని తల్లి అంటుంది.
అంటే నువ్ నేను చేసిందే తప్పంటున్నావ్. మనోజ్నే ఇంకా సమర్ధిస్తున్నావా అని రోహిణి అంటుంది. నువ్ పెళ్లికోసం అబద్ధాలు చెప్పి ఉంటావ్. ఆ కుటుంబం కోసం నిజాలు దాచి ఉంటావ్. అది నీ పరిస్థితి. అలాగే, అల్లుడు కూడా ఉద్యోగం లేదని చెబితే అర్థం చేసుకుంటావో లేదో అని అనుకుంటాడు కదా. అది అతని పరిస్థితి. దానికి నువ్ గొడవ పడి రావడం మంచిది కాదమ్మా. నీకోసం అత్తగారి వాళ్లు ఎంత కంగారుపడి ఉండుంటారు అని తల్లి అంటుంది.
ఇంకా నాదే తప్పా అంటున్నావా. నాకు పెళ్లి చేసింది ఎవరు. వాడు పోతే అలాగే ఉండాలా. ఇన్ని రోజులు నేను, మనోజ్ మేము జాబ్ చేస్తున్నామని అందరితో చెప్పాం. ఇప్పుడు అందరిముందు పరువు పోయింది. ఆ బాలు ఎంత ఎగతాళిగా మాట్లాడారో తెలుసా అని రోహిణి అంటుంది. బాలు, మీనా అలా చేయరమ్మా. చాలా మంచివారు. కుటుంబం అన్నాక అందరు ఒకేలా ఉండరు. సర్దుకుపోవాలి అని తల్లి అంటుంది. కట్టుకున్నోడో మోసం చేశాక ఏం చేయను అని రోహిణి అంటుంది.
అలా అనుకుంటే నువ్ చేసింది కూడా తప్పే. నీ మనసాక్షినే అడుగు అని తల్లి చెబుతుంది. ఇన్నిరోజులు ఆ ఇంట్లో గొప్పగా బతికాను. ఏ మొహం పెట్టుకుని ఆ ఇంట్లో ఉండను. ఒంటరిదాన్ని అయిపోయాను అమ్మా. నాకు ఎవరు లేనట్లు అనిపిస్తుంది అని రోహిణి అంటుంటే.. అత్తా అంటూ చింటు ఎంట్రీ ఇస్తాడు. నీ దగ్గరికి వద్దామంటే అమ్మమ్మ వద్దని చెబుతుంది. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు ఏమైంది అత్త. కళ్లు ఎర్రగా ఉన్నాయి. కంట్లో ఏమైనా పడిందా. నేను ఊదనా అని చింటు అంటాడు.
దాంతో చింటును హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది రోహిణి. నేను ఆడుకుని వస్తాను. నువ్ ఎక్కడికి వెళ్లకు అత్త అని వెళ్లిపోతాడు చింటు. వీడి భవిష్యత్ నాకు అర్థం కావట్లేదు. వీడి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకో అని తల్లి అంటుంది. నా జీవితమే సరిగ్గా లేదు. నేను ఆ ఇంటికి వెళ్లను అని రోహిణి చెబుతుంది. మరోవైపు తలపై ముసుగు వేసుకున్నట్లు చీర కొంగు వేసుకుని ప్రభావతి దిగాలుగా కూర్చుంటుంది.
ఇంతలో కామాక్షి వస్తుంది. కోడలు పోయిందిగా. ఇంకా రాలేదా. నేను నీకు ఎంత మంచి కోడలిని తీసుకొచ్చాను అని కామాక్షి అంటుంది. ఏ పాపం చేసుకున్నానో ఈ బాలు గాడు నాకు పుట్టాడు అని ప్రభావతి అంటుంది. బాలు గాడు ఏం చేశాడు మధ్యలో. మనోజ్ గాడి బండారం బయటపెట్టాడు. మనోజ్ గాడి పద్ధతే బాగోలేదు. పెళ్లి అయ్యాక ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగితే ఏ పెళ్లాం ఊరుకుంటుందా. చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే ఉద్యోగం దొరుకుతుందా అని కామాక్షి అంటుంది.
ఈ బాలు గాడు షార్ట్ ఫిల్మ్ తీసి అందరిని సమావేశపరిచి చూపించాలా. నాన్నకు పక్కకు తీసుకెళ్లి చెబితే అయిపోయేది కదా అని ప్రభావతి అంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి బాలుగాడి మీద పడతావేంటీ వదినా. ఈ మనోజ్ గాడు ఎప్పుడైనా కుదురుగా ఉన్నాడా. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయాడా. లక్షలకు లక్షలకు ఎత్తుకెళ్లిపోయాడా. ఎవరికో దారిపోసి వచ్చాడా. బాలు గాడికి ఏంటీ కట్టుకున్న పెళ్లామే తన్నిపోయింది అని కామాక్షి అంటుంది.
నువ్వేంటీ బాలు గాడికి జిరాక్స్ కాపీలా ఉన్నావే అని ప్రభావతి అంటుంది. నువ్వింకా మనోజ్ గాడిని వెనుకేసుకొస్తే ఎవరేం చేయాలేం. మీ కోడలు వెళ్లి మలేషియాలో కేసు పెడితే మీరు వాదించుకోడానికి ఇల్లు తాకట్టు పెట్టాలి. డబ్బున్నోడి కూతురు కదా. అయితే కేసు పెడుతుంది. లేదా ఏదైనా చేసుకోవచ్చు. రోహిణి తండ్రి ఊరుకుంటాడా. నోట్ల కట్టలు వెదజల్లి జైలుకు పంపిస్తాడు అని కామాక్షి అంటుంది. నువ్ నన్ను ఓదార్చడానికి వచ్చావా భయపెట్టడానికి వచ్చావా అని ప్రభావతి అంటుంది.
ముందే చెప్పలేదని అనొద్దు. బాగా వెతకమని, గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలో కూడా వెతకమను అని కామాక్షి అంటుంది. అంతదూరం ఏం వెళ్లదు అని ప్రభావతి అంటుంది. అయ్యో ఇంతకాలం ఏమన్నా పడే మీనా దొరికింది కాబట్టి ఆ సత్యకాలపు పిల్ల పడి ఉంటుంది. కానీ, రోహిణి అలా కాదు. ఎందుకైనా మంచిది రైలు పట్టాల దగ్గర చూడమను అని కామాక్షి అంటుంది. నువ్ ఇంకా భయపెడుతున్నావ్. ఆ చావు గోల వదిలేయ్ అని ప్రభావతి అంటుంది.
దీనంతటికి కారణం ఆ బాలు గాడు. ఆ ఇద్దరిని పంపించేద్దాం అంటే మా ఆయన పితలాటకం పెట్టాడు. బాలు గాడేమో పూల కొట్టు పెట్టాడు. రోహిణి పార్లర్ పెట్టింది. ఇది పూలకొట్టు పెట్టింది. పార్లర్ ఎక్కడ పూలకొట్టు ఎక్కడ అని ప్రభావతి అంటుంది. సరే. ఎందుకైనా మంచిది ఏమైనా జరిగితే పారిపో మీడియా వాళ్లు వచ్చి కెమెరాలు పెడితే ముసుగు వేసుకుని తిరగాలి అని వెళ్లిపోతుంది కామాక్షి. అన్నీ అశుభాలే మాట్లాడింది ఛీ అని ప్రభావతి అనుకుంటుంది.
మరోవైపు పార్లరమ్మా ఎక్కడ దరొకలేదు. ఎక్కడికి వెళ్లిందో. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అని బాలు అంటాడు. ఇంకెవరినైనా అడుగుదామని మీనా అంటే.. మళ్లీ సెటైర్లు వేస్తాడు బాలు. కారు ఆపి నేను దిగిపోతాను. ఎక్కనప్పటి నుంచి చావ గొడుతున్నావ్ అని మనోజ్ అంటాడు. మరోవైపు జరిగిందంతా గుర్తు వస్తుంటే భగభగ మండిపోతుంది. కానీ, అబద్ధం చెప్పి మోసం చేసినవాడితో నేను సర్దుకుపోలేనమ్మా అని రోహిణి అంటుంది.
తల్లి నచ్చజెప్పాలని చూస్తుంది. ఇంతలో చింటు మీనా వాళ్లకు కనిపిస్తాడు. అమ్మమ్మ ఎక్క ఉందని మీనా అడిగితే ఇంటికి తీసుకెళ్తాడు చింటు. దాంతో రోహిణి పుట్టింటికి మీనా వాళ్లు వెళ్తారు. మీనా వాళ్లు రావడం చూసి రోహిణి షాక్ అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం