Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బ్యూటి పార్లర్లో నుంచి మాణిక్యంను వెళ్లమని రోహిణి చెబుతుంది. మరీ మటన్. డబ్బు ఆన్లైన్లో పే చేస్తారా అని మాణిక్యం అంటే.. నేను ఇస్తాను రోహిణి ఫ్రెండ్ చెబుతుంది. దాంతో మాణిక్యం వెళ్లిపోతాడు.
డబ్బుల కోసం రిసెప్షన్ దగ్గర బాలు ఎదురుచూస్తూ ఉంటాడు. నాలాంటి బిగ్ ఆర్టిస్ట్ ఫేస్ ముందే రివీల్ కాకూడదని రెండు చేతులను మొహానికి అడ్డుపెట్టుకుని వెళ్లిపోతాడు మాణిక్యం. బాలుకు పేపర్ కూడా తీసి ఇస్తాడు. కానీ, బాలు చూడడు. అలా మాణిక్యం తనకు తెలియకుండానే తప్పించుకుని వెళ్లిపోతాడు. బాలుకు రిసెప్షన్ ఆవిడ డబ్బు ఇస్తుంది. ఆవిడ వచ్చి మిమ్మల్ని డబ్బు ఇవ్వమంటుందేంటీ అని బాలు అడుగుతాడు.
ఆవిడే కదా ఓనర్ అని ఆమె చెబుతుంది. దాంతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మళ్లీ చెప్పమంటాడు. ఆవిడే పార్లర్ ఓనర్ అని ఆమె చెబుతుంది. ఈ పార్లర్కి ఓనర్ రోహిణి కదా. ప్రభావతి పేరు మీద ఉంటుంది కదా అని బాలు అంటే.. ఇది ఇప్పుడు క్వీన్స్ పార్లర్. బోర్డ్ చూడలేదా అని ఆమె చెబుతుంది. మళ్లీ అన్ని బాలు గుచ్చి గుచ్చి అడిగితే.. రోహిణి మేడమ్ ఫ్రాంఛైజీకి ఇచ్చారు. ఇప్పుడు రోహిణి మేడమ్ కేవలం బ్యూటిషియన్ అంతే. రోహిణి తెలుసా మీకు అని ఆమె అడుగుతుంది.
తెలుసు.. తెలియదు అని పదే పదే అంటాడు బాలు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని బాలు అంటాడు. సరే వెళ్లండి. జెన్స్ లోపలికి రాకూడదు అని రిసెప్షన్ ఆమె చెబుతుంది. సరే అన్న బాలు పార్లర్ నేమ్ బోర్డ్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటాడు. తర్వాత బయటకు వచ్చిన బాలు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎవరికి దొరకకూడదో వాళ్లకే దొరికింది పార్లరమ్మా. అమ్మో అమ్మో ప్రభావతమ్మకు ఈ విషయం తెలిస్తే గుండె పట్టుకుని గుబెలుమంటుందేమో అని బాలు అనుకుంటాడు.
మొగుడేమే జాబ్ చేస్తున్నట్లు పార్కుల్లో తిరుగుతాడు. పెళ్లామేమో పార్లర్ మానేసి ఇక్కడ పనిచేస్తుంది. మా అమ్మ ఏమో నా పెద్ద కోడలు రిచ్గా నా పేరు పెట్టుకుందని మురిసిపోతుంది. ఈ పార్లరమ్మ ఇంత పెద్ద ఫ్రాడా. ఏదో మతలబు ఉంది. ముందు నాకు ఈ కడుపు ఉబ్బరం తగ్గాలంటే నాన్నకు ఈ విషయం చెప్పాల్సిందే అని సత్యం దగ్గరికి వెళ్తాడు బాలు. నీతో ఓ విషయం చెప్పాలని ఎలా చెప్పాలి అని అంటాడు. నటించింది చాలా గానీ చెప్పురా అని సత్యం అంటాడు.
నటిస్తున్నట్లు ఎలా తెలిసిపోయింది నాన్నా అని బాలు అంటాడు. బాలు లాంటి కొడుకు ఒక్కడే ఉంటాడు. అదేదో అంటారుగా. సింగిల్ పీస్. నీకు నటించడం రాదు. నటించాలకున్నా దొరికిపోతావ్. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావ్ అని సత్యం అంటాడు. అదే నాన్న మనోజ్ గాడి భార్య ఉందిగా పార్లరమ్మా అని బాలు అంటే.. రేయ్ వదినా అనొచ్చుగా అని సత్యం అంటాడు. వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు గానీ, ఫ్రాంచైజీ అంటే తెలుసుగా. షాపులను బ్రాంచెస్లో కలుపుతారు అని బాలు అంటాడు.
ఐడియా ఉందిలే చెప్పు అని సత్యం అంటాడు. ఈ పార్లరమ్మా ఏం చేసిందో తెలుసా.. అని పార్లర్ ఓనర్ను క్యాబ్లో ఎక్కించుకుని రిసెప్షనిస్ట్ చెప్పింది అంతా జరిగింది చెబుతాడు బాలు. మళ్లీ ఇంకో ఫిర్యాదా అని సత్యం అంటే.. నిజం నాన్నా. తాత మీద ఒట్టు అని అక్కడ దిగిన సెల్ఫీలు చూపిస్తాడు. అమ్మ పేరు కూడా లేదు అని బాలు అంటాడు. అంటే ఇప్పుడు ఆ పార్లర్ మనదికాదా. మరి రోహిణి అని సత్యం అడిగితే.. చెప్పిందిగా రిసెప్షనిస్ట్. పార్లరమ్మా అందరిలా అక్కడ పనిచేస్తుందట అని బాలు అంటాడు.
ఇంత జరిగినా కూడా రోహిణి మనకు ఎందుకు చెప్పలేదు అని సత్యం అంటాడు. ఆ మాయలోడి మనోజ్ గాడి పెళ్లామేగా. ఇద్దరు కూడబలుక్కుని బిల్డప్ ఇస్తున్నారు. పద ఇంట్లో అమ్మకు చెబుదామని బాలు అంటాడు. వద్దు. ఎవరికి చెప్పొద్దు. మనోజ్ విషయం తెలిసినట్లే మీ అమ్మకు తెలిసే ఉంటుంది అని సత్యం అంటాడు. లేదు నాన్న పక్కోళ్లకు అన్యాయం జరిగితే సైలెంట్గా ఉంటుంది కానీ, తనకు జరిగితే ఉపేక్షించదు. ఇల్లు తాకట్టు పెట్టి మరి పార్లర్ పెట్టించింది. అలాంటిది అమ్మ పేరు పార్లర్ లేదంటే ఎందుకు ఊరుకుంటుంది అని బాలు అంటాడు.
పద నాన్నా అమ్మకు చెబుతాం. అమ్మకు జరిగిన ఈ మోసం, ద్రోహం, కుట్రలో అమ్మ కూడా ఎక్కడికి వెళ్లిన తనవెంటే ఉంటాను. అమ్మకు న్యాయం జరిగే వరకు ఉంటాను అని బాలు అంటాడు. మనోజ్ విషయంలో రోహిణి రెండు రోజులు ఎటో వెళ్లిపోయింది. మనం చెప్పే నిజం మంచికి ఉండాలి. కలహాలు జరిగేలా కాదు. అమ్మకు ఇది చెప్పడం వల్ల లాభం ఏముంది. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయ్ అని సత్యం అంటాడు.
కానీ, వాళ్లు ఇంట్లో ఎంత బిల్డప్ ఇస్తారు. అది చూసి అమ్మ నన్ను, మీనాను ఎన్ని మాటలు అంటుంది అని బాలు అంటాడు. అసలు విషయం మనకు తెలుసు. విని సైలెంట్గా ఉందాం. కొన్నిసార్లు మౌనం కూడా మంచిని గెలిపిస్తుంది అని సత్యం అంటాడు. నా నుంచి నిజం చెప్పకుండా కంట్రోల్ చేసుకోలేను అని బాలు అంటాడు. అది నేను కంట్రోల్ చేస్తానులే అని సత్యం అంటాడు. నాకు తెలియకుండా వస్తే ఏం చేయలేను అని బాలు అంటాడు. తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు.
బాగా అలిసిపోయినట్లున్నావ్. పని ఎక్కువైందా అని ప్రభావతి అడుగుతుంది. అవును, ఈరోజు ఎక్కువైంది అని రోహిణి చెబుతుంది. ఈరోజేనా రోజు కూడానా అని బాలు అంటాడు. దాంతో సత్యం వారిస్తే బాలు సైలెంట్ అవుతాడు. ముక్కు మీద వేలు వేసుకుంటాడు. ఈ పోజు బాగుందిరా అని ప్రభావతి అంటుంది. పని ఎక్కువైతే ఇంకో పని అమ్మాయిని పెట్టుకోమ్మా. కావాలంటే కౌంటర్ దగ్గర నేను కూర్చుంటాను. పార్లర్ నా పేరు మీదే ఉంది కదా. ఆ హుందాతనం, ఆ హోదానే వేరు అని ప్రభావతి అంటుంది.
దాంతో బాలు దగ్గుతాడు. ఓనర్కి కూడా అంత పని ఉంటుందా రోహిణి అని కామాక్షి అడుగుతుంది. వీళ్ల పార్లర్లో ఓనర్స్ పని చేస్తారు. పనోళ్లు టైమ్ పాస్ చేస్తారు అని బాలు అంటాడు. ఏదో డైరెక్ట్గా చూసినట్లు చెబుతున్నావ్. రోహిణి కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. మీనాలా చీప్గా వచ్చే పోయే వాళ్లకు పూలమ్మా.. పూలమ్మా అని అమ్ముకుంటుందా అని ప్రభావతి అంటుంది. నాన్న నిజం తెరవనా అని బాలు అంటాడు. పూల కొట్టు కూడా నీ పేరు మీదే ఉందిగా అని సత్యం అంటాడు.
దాంతో ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పార్లర్ పెట్టారు అని కామాక్షి అంటే.. గతం తవ్వకు అని ప్రభావతి అంటుంది. అమ్మలా పార్లర్ పెట్టించి ఓపెన్ చేశారు. అదెప్పుడు నాకు స్పెషలే అని రోహిణి అంటుంది. ఎవరి పేరు మీద ఉంటే వాళ్లదే పార్లర్ అని బాలు అంటాడు. ప్రభావతి మీనాను జ్యూస్ అడిగితే.. బాలు కూడా అడుగుతాడు. నాకు పోటీనా అని ప్రభావతి అంటే.. నా భార్యా మీ క్వీన్ ప్యాలేస్ అని బాలు అంటాడు.
ఎందుకు ఇతను పదే పదే మై క్వీన్ ప్యాలెస్ అంటున్నాడు అని డౌట్ పడతుంది రోహిణి. ఎంత అలసిపోయావ్. ఓనర్వే కదా కాస్తా ముందు వస్తే అయిపోతుందిగా అని ప్రభావతి అంటుంది. పనోళ్లు ముందు రారు అని బాలు అంటాడు. దాంతో సత్యం కోపంగా చేసేసరికి బాలు సైలెంట్ అవుతాడు. నా కోడలు ఓనర్. పని చేసే అమ్మాయి కాదు అని ప్రభావతి ఫైర్ అవుతుంది. నిజాలు చెబితే నమ్మరేంటో అని మనసులో అనుకుంటాడు బాలు.
తర్వాత కామాక్షి వెళ్లిపోతుంది. త్వరగా జ్యూస్ చేసి రోహిణికి ఇవ్వు అని మీనాకు ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. తర్వాత చూశావా నాన్న నేను అంటుంటే పార్లరమ్మా మొహం ఎలా వాడిపోతుందో అని బాలు అంటాడు. అది సరేగాని నిజం బయటపెట్టకురా అని సత్యం అంటాడు. ప్రభావతి భ్రమలో బతకాల్సిందేనా అని బాలు అంటాడు. మనోజ్ గురించి చెబితే రోహిణి వెళ్లిపోయింది. అదే రోహిణి గురించి చెబితే మనోజ్.. అని సత్యం అంటే.. దేశం వదిలి పెట్టి వెళ్లిపోతాడా. అలాగైన కాళ్ల మీద బతుకుతాడు అని బాలు అంటాడు.
వాడికి అంత ధైర్యం లేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయని సత్యం అంటాడు. సరేనని బాలు వెళ్లిపోతాడు. తర్వాత కిచెన్లో ఉన్న మీనా దగ్గరికి వెళ్లి దోశ వేసియమంటాడు. దాంతో మీనా దోశలు వేసి ఇస్తుంది. వ్యాపారం, వంటల గురించి మాట్లాడుకుంటారు. పని ఎక్కువైతో పనోళ్లను పెట్టుకో అని బాలు అంటాడు. వచ్చే కాస్తా లాభం పనోళ్లకి ఇస్తే ఎలా. చిన్న చిన్నవాటికి ఓనర్సే పనోళ్లలా చేయాలి. అదే రోహిణి పార్లర్ అయితే అసిస్టెంట్ను పెట్టుకున్నా ఏం కాదు అని మీనా అంటుంది.
ఆ మాటలు సత్యం వింటాడు. కొన్నిచోట్ల పనోళ్లు కూడా ఓనర్స్లా చెబుతారు అని బాలు అంటాడు. ఏ విషయంలో అని మీనా అంటే.. అది అని బాలు చెప్పబోతుంటే సత్యం ఆపుతాడు. ఈ టైమ్లో తింటున్నావేంటీ అని అడుగుతాడు. ఆకలేసి తింటున్నాను అని బాలు అంటాడు. ఏం చెప్పకు అని సత్యం సైగ చేస్తే.. నేను ఏం చెప్పలేదు అని కంగారుపడతాడు బాలు. దోశకు మీదకు తోసేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లేదు అని మీనా అంటుంది.
చెబుతాను అని బాలు అంటే.. సత్యం వద్దంటాడు. అటు సత్యం ఇటు మీనా మధ్యలో నిజం చెప్పాలో వద్దో నలిగిపోతుంటాడు బాలు. మరుసటి రోజు మీనా మెడలో పుస్తెలు తాడు ఏమైంది. పసుపు తాడు ఎందుకు వేసుకున్నావ్ అని పరిచయం ఉన్నావిడ అడిగింది అని ప్రభావతితో సత్యం అంటాడు. అదేగా బంగారం అంతా వలిచి నా మొహానా కొట్టింది అని ప్రభావతి చెబుతుంది. వెళ్లి ఆ పుస్తెలతాడు తీసుకొచ్చి మీనాకు ఇవ్వు అని సత్యం గొడవ చేస్తాడు.
ఆయన ఎప్పుడు కొనిస్తే అప్పుడే వేసుకుంటాను అని మీనా అంటుంది. చూశారా ఎంత పొగురుగా మాట్లాడుతుందో అని ప్రభావతి అంటుంది. మీరు పెట్టిన బంగారం చచ్చినా వేసుకోను. కట్టుకున్న భార్యకు కనీసం పుస్తెల తాడు కూడా చేయించలేరా అని మీనా అంటుంది. వాన్ని నమ్ముకుంటే ముసలిదానివి అయ్యేదాకా పుస్తెలుతాడుతోనే ఉండాలి అని ప్రభావతి అవమానిస్తుంది. నా భర్తను నేను పూర్తిగా నమ్ముతాను అని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం