Gopichand Malineni Plans Thriller: బాలయ్యతో థ్రిల్లర్ చేయాల్సింది.. ఫ్యాక్షన్ తీసిన దర్శకుడు.. అసలేమైంది?-gopichand malineni was planned a thriller with balakrishna first instead of mass story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gopichand Malineni Was Planned A Thriller With Balakrishna First Instead Of Mass Story

Gopichand Malineni Plans Thriller: బాలయ్యతో థ్రిల్లర్ చేయాల్సింది.. ఫ్యాక్షన్ తీసిన దర్శకుడు.. అసలేమైంది?

Maragani Govardhan HT Telugu
Jan 21, 2023 09:08 AM IST

Gopichand Malineni Plans Thriller: నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ మలినేని తొలుత బాలయ్యకు ఈ సినిమా కథకు బదులు ఓ థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట.

బాలయ్యతో గోపీచంద్ మలినేని చిత్రం
బాలయ్యతో గోపీచంద్ మలినేని చిత్రం

Gopichand Malineni Plans Thriller: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఆకట్టుకునేలా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా గోపీచంద్ మలినేని గత చిత్రం క్రాక్‌తో పోలిస్తే ఈ సినిమా ఆకట్టుకోలేదనేది వాస్తవం. క్రాక్‌లో ఉండే మలుపులు, స్క్రీన్ ప్లే లాంటివి ఇందులో ఉండవు. తాజాగా వీరసింహారెడ్డి చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఫిల్మ్ వర్గాల సమచారం ప్రకారం గోపీచంద్ మలినేని తొలుత బాలయ్యతో వీరసింహారెడ్డి కథతో వెళ్లలేదంట. ఆయనతో ఓ మంచి థ్రిల్లర్ సినిమా తీయాలనుకున్నాడట. 24 గంటల వ్యవధిలో జరిగే థ్రిల్లర్ కథాంశాన్ని గోపీచంద్ మలినేని బాలయ్యకు వివరించగా.. ఆయన మాత్రం మాస్ కథ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు గోపీచంద్ కూడా అంగీకరించి వీరసింహారెడ్డి కథతో వచ్చాడట. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదు. చెన్నకేశవరెడ్డికి అటు ఇటుగా ఉన్న ఈ కథతో విమర్శకులను మెప్పించలేకపోయింది.

ఏదిఏమైనప్పటికీ బాలకృష్ణకు ముందు గోపీచంద్ మలినేని చెప్పిన కథ వీరసింహారెడ్డి కాదని మాత్రం తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ గోపీచంద్ మలినేని ఇప్పటికే తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టారు. బాలయ్యకు మొదట చెప్పిన థ్రిల్లర్ కథతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమాను ఓ యువ హీరోతో చేస్తాడని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం