తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ జెంటిల్వుమన్ తెలుగులోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీలో లిజోమోల్ జోస్, లోస్లియా మరియనేసన్, హరికృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జోష్వా సేతురామన్ దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్తో పాటు టెంట్కోట, ఆహా ఓటీటీలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 14నే ఓటీటీలోకి రాగా...తెలుగు, మలయాళం భాషల్లో మాత్రం రెండు వారాలు ఆలస్యంగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . .
వివేహేతర సంబంధాల నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు జెంటిల్ వుమన్ తెరకెక్కించాడు. మార్చి ఫస్ట్ వీక్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్నది. ఐఎమ్డీబీలో ఈ మూవీ 6.1 రేటింగ్ను సొంతం చేసుకున్నది.
అరవింద్, పూర్తిలకు కొత్తగా పెళ్లవుతుంది. పెళ్లియిన మూడు నెలల్లోనే అరవింద్కు అన్న అనే అమ్మాయితో ఎఫైర్ ఉందనే నిజం తెలుస్తుంది. ఆ తర్వాత అరవింద్ కనిపించకుండాపోతాడు.
అరవింద్ మిస్సింగ్పై పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అసలు అరవింద్ ఏమయ్యాడు? అతడు కనిపించకుండాపోవడానికి పూర్ణికి ఎలాంటి సంబంధం ఉంది? అరవింద్ గురించి అన్నకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? అన్నను ప్రేమించిన అరవింద్ పూర్ణిని ఎందుకు పెళ్లిచేసుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
జెంటిల్వుమన్ మూవీకి 96 ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందించాడు. దాదాపు రెండున్నర కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
స్వతహాగా మలయాళ నటి అయినా లిజోమోల్ జోస్ సూర్య జై భీమ్ మూవీతో తమిళ ప్రేక్షకులకు చేరువైంది. మహేషింతే ప్రతీకారం మూవీతో లిజోమోల్ జోస్ హీరోయిన్గా మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. స్ట్రీట్లైట్స్, పులిమడ, పొన్మాన్, దావీద్తో పాటు పలు మలయాళ సినిమాల్లో హీరోయిన్గా కనిపించింది. తమిళంలో జై భీమ్తో పాటు కాదల్ ఎన్బదు పోదు ఉడమైతో పాటు నాలుగు సినిమాలు చేసింది.
సంబంధిత కథనం