గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీపై సందిగ్ధత కంటిన్యూ అవుతూనే ఉంది. క్రిస్మస్కే ఈ మూవీ వస్తుందని నిర్మాత దిల్రాజు కొన్ని సందర్భాల్లో చెప్పారు. కానీ ఇటీవల వచ్చిన రెండో పాటలోనూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఈ మూవీపై ఆసక్తితో ఉన్నాయి. కాగా, ఈ మూవీ క్రిస్మస్ నుంచి వాయిదా పడడం ఖాయమని, కొత్త రిలీజ్ డేట్ కూడా ఖరారైనట్టు సమాచారం.
గేమ్ ఛేంజర్ సినిమాను వచ్చే ఏడాది 2025 జనవరి 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయారని తెలుస్తోంది. ఈ తేదీనికి ఖరారు చేశారని సమాచారం. దీంతో సంక్రాంతి రేసులోకి రామ్చరణ్ మూవీ వచ్చేయనుంది. అతిత్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా 2025 జనవరి 10వ తేదీని చాలా నెలల కిందటే ఖరారు చేసుకుంది. అయితే, ఆ మూవీ వాయిదా పడి ఆ ప్లేస్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. విశ్వంభరను వాయిదా వేసుకోవాలని చిరంజీవిని నిర్మాత దిల్రాజు అడిగారని ఇండస్ట్రీ వర్గాల టాక్. తనయుడి చిత్రం కోసం తన సినిమాను వాయిదా వేసుకునేందుకు చిరూ ఓకే చెప్పారట. దీంతో జనవరి 10వ తేదీని గేమ్ ఛేంజర్ మూవీ కోసం టీమ్ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని క్రిస్మస్కు ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తామని దిల్రాజు చెప్పడంతో డిసెంబర్ 20న వస్తుందనే అంచనాలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఈ డేట్ను పోస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 25 కూడా వినిపించింది. అయితే, సంక్రాంతికి బరిలో జనవరి 10నే గేమ్ ఛేంజర్ తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. మరి, రిలీజ్ డేట్పై ఎప్పుడు అధికారికంగా వెల్లడిస్తారో చూడాలి.
గేమ్ ఛేంజర్ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ నుంచి ఇటీవలే ‘రా మచ్చా మచ్చా’ అంటూ రెండో పాట వచ్చింది. ఈ సినిమా టీజర్ దసరాకు వస్తుందని ముందుగా చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఆ తర్వాత రాదంటూ చరణ్ అభిమానులను నిరాశపరిచారు. అయితే, నేడు (అక్టోబర్ 12) దసరా రోజున ఏదైనా అప్డేట్ వస్తుందా అనేది చూడాలి.
గేమ్ ఛేంజర్ మూవీని పొలిటికల్ యాక్షన్ మూవీగా శంకర్ రూపొందించారు. ఈ మూవీలో రామ్ చరణ్కు జోడీగా కియారా అడ్వానీ హీరోయిన్గా చేశారు. ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్ కీరోల్స్ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని రూపొందించినట్టు అంచనా. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
టాపిక్