Pushpa Song Viral: ‘ఊ అంటావా’ అంటూ ఊగిపోయారు.. పాటకు ఇంకా తగ్గని క్రేజ్-fans dance to pushpa oo antava song at india and west indies t20i match ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Fans Dance To Pushpa Oo Antava Song At India And West Indies T20i Match

Pushpa Song Viral: ‘ఊ అంటావా’ అంటూ ఊగిపోయారు.. పాటకు ఇంకా తగ్గని క్రేజ్

Maragani Govardhan HT Telugu
Aug 10, 2022 08:18 AM IST

పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట మరోసారి వైరల్‌గా మారింది. భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన చివరి టీ20లో కొంతమంది భారత అభిమానులు ఊ అంటావా సాంగ్‌కు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.

పుష్ప పాట వైరల్
పుష్ప పాట వైరల్ (HT)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇందులో ఉండే పాటలు పాన్ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయ్యాయి. అందులోనూ ఊ అంటావా.. ఊ ఊ అంటావా సాంగ్ అయితే భాషతో సంబంధం లేకుండా చాలా మందిని అలరించింది. కాలు కదిపేలా చేసింది. అయితే ఈ సినిమా విడుదలై 8 నెలలు కావస్తున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. సమంతా స్టెప్పులు, అభినయానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతోమందిని ఆకట్టుుకంటోందీ సాంగ్. పార్టీల్లో, వేడుకల్లో, వివాహాల్లో అంతెందకు చివరకు క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా పాటకు స్టెప్పులేస్తున్నారు అభిమానులు. ఇటీవలే భారత్-విండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ ఊ అంటావా సాంగ్‌కు కాలు కదిపారు మైదానంలోని ప్రేక్షకులు.

ఫ్లోరీడా వేదికగా వెస్టిండీస్‌-టీమిండియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో అభిమానులు ఊ అంటావా అంటూ ఊగిపోయారు. స్టేడియంలో పాటకు స్టెప్పులెస్తూ విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మ్యాచ్ అమెరికా ఫ్లోరిడాలో జరగడం, అక్కడ ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండటంతో పుష్ప పాటకు ఫిదా అయిపోవడమే కాకుండా..స్టెప్పులతో అదరగొట్టారు.

ఇక్కడ విశేషమేమంటే టీమిండియా జెర్సీని ధరించిన అభిమానులు.. పుష్ప ఒరిజినల్ వెర్షన్ తెలుగు సాంగ్‌కు డ్యాన్స్ వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఎన్నో పాటలు వచ్చినప్పటికీ ఈ సాంగ్ పాపులారిటీ ఇంకా తగ్గలేదని ఓ యూజర్ రాయగా.. దాదాపు పాట వచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంకా నంబర్ వన్ సాంగ్‌గా ట్రెండ్ అవుతోందని మరో యూజర్ స్పందించారు.

ఊ అంటావా సాంగ్‌ను ఇంద్రావతీ చౌహాన్ ఆలపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకు సాహిత్యాన్ని చంద్రబోస్ అందించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి ఐటెమ్ సాంగ్‌లో దర్శనమిచ్చి తన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల హృదయాన్ని కొల్లగొట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. తన దైన శైలి నటన, మేనరిజంతో ప్రేక్షకులను అలరించారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేసింది. దేశవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైచిలుకు వసూళ్లను సాధించింది. కేవలం ఒక్క హిందీ డబ్ వెర్షన్‌కే రూ.100 కోట్లు వసూలు కావడం గమనార్హం.

IPL_Entry_Point

సంబంధిత కథనం