Manchu Lakshmi: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముందుగా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ఆ తర్వాత నటి అయ్యారు. ఝుమ్మంది నాదం సినిమాలో అతిథి పాత్రతో టాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగెటివ్ రోల్లో మెప్పించారు. ఆ తర్వాత వరుసగా సినిమా చేస్తూ వస్తున్నారు. అయితే, మంచు లక్ష్మికి సంబంధించి కొన్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ట్రోల్స్ కూడా వస్తుంటాయి. తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఆదిపర్వం అనే సోషియో ఫ్యాంటసీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అయితే, ఈ ఈవెంట్లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా.. సడెన్గా స్టేజీపైకి వచ్చిన అభిమాని.. ఆమె పాదాలకు నమస్కరించారు. ఎమోషనల్గా వచ్చిన ఆ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు.
ఓ వ్యక్తి సడెన్గా కాళ్లు మొక్కేందుకు రావడంతో మంచు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెనక్కి జరిగారు. అభిమాని నమస్కరించడంతో ఆమె కూడా నమస్కారం చేశారు. ఓకే నాన్న.. తర్వాత మాట్లాడదాం అని తన అభిమానికి చెప్పారు. అనంతరం ఈవెంట్ అయిపోయాక.. అతడితో ఆమె ఫొటో దిగారు. మంచు లక్ష్మి రావడంతో అతడు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. ఎర్రగుడి గ్రామంలోని ఓ దేవాలయం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. మంచు లక్ష్మి యాక్షన్ అదిరిపోయింది. కత్తితో యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఇందులో ఓ జంట లవ్ స్టోరీగా కూడా ఉంటుంది. ఈ చిత్రంలో శివ కంఠమనేని, జెమినీ సురేశ్, ఆదిత్య ఓం, ఎస్తర్, వెంకట్ కిరణ్ కీలకపాత్రలు పోషించారు.
ఆదిపర్వం మూవీకి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. అన్విక ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎంఎస్కే ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని టీమ్ వెల్లడించలేదు. త్వరలోనే విడుదల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.