Angry Rantman: పాపులర్ యూట్యూబర్, సోషల్ మీడియా సెన్సేషన్ అభ్రదీప్ సాహా (27) కన్నుమూశారు. యాంగ్రీ ర్యాంట్మ్యాన్గా ఆయన ఫేమస్ అయ్యారు. గత నెలలో ఆయన ఓ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించింది. కొన్ని అవయవాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే కోలుకోలేక 27 ఏళ్ల అభ్రదీప్ నేడు (ఏప్రిల్ 17) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
యాంగ్రీ ర్యాంట్మ్యాన్ యూట్యూబ్ ఛానెల్లో సినిమాలతో పాటు క్రికెట్, ఫుట్బాల్పై రివ్యూలు చెబుతుంటారు అభ్రదీప్ సాహా. కోపంగా అరుస్తూ ఆయన తన అభిప్రాయాలపై మాట్లాడతారు. దీంతో ఆయన చాలా పాపులర్ అయ్యారు. ఎంటర్టైనింగ్గా ఉండటంతో ఆ ఛానల్ బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఆయన చాలా ఫ్యాన్ బేస్ ఉంది.
అభ్రదీప్ సాహా అలియాజ్ యాంగ్రీ ర్యాంట్మ్యాన్ నేటి ఉదయం 10 గంటల 18 నిమిషాలకు మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. “తన నిజాయితీ, చమత్కారంతో లక్షలాది మంది హృదయలను ఆయన తాకారు. ఆయనను మనంమందరం మిస్ అవుతాం” అని అభ్రదీప్ ఫ్యామిలీ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
గత నెలలో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో అభ్రదీప్ సాహా చేరారు. ఆ ముఖ్యమైన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా పరిస్థితి విషమించింది. కొన్ని రోజులుగా ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. కోలుకోలేక నేడు (ఏప్రిల్ 17) అభ్రదీప్ కన్నుమూశారు.
అభ్రదీప్ సాహా మృతిపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాక్కు గురయ్యామని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.