ఇద్దరు హీరోలు స్క్రీన్ మీదకు వచ్చి కొంత గ్యాప్ వచ్చింది, అందుకే తీసుకున్నాం.. భైరవం మూవీ డైరెక్టర్ కామెంట్స్-director vijay kanakamedala comments on manchu manoj nara rohith acting in bellamkonda sai sreenivas bhairavam movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇద్దరు హీరోలు స్క్రీన్ మీదకు వచ్చి కొంత గ్యాప్ వచ్చింది, అందుకే తీసుకున్నాం.. భైరవం మూవీ డైరెక్టర్ కామెంట్స్

ఇద్దరు హీరోలు స్క్రీన్ మీదకు వచ్చి కొంత గ్యాప్ వచ్చింది, అందుకే తీసుకున్నాం.. భైరవం మూవీ డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన మొదటి సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భైరవం సినీ విశేషాలు చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల.

ఇద్దరు హీరోలు స్క్రీన్ మీదకు వచ్చి కొంత గ్యాప్ వచ్చింది, అందుకే తీసుకున్నాం.. భైరవం మూవీ డైరెక్టర్ కామెంట్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.

బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా

భైరవం చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై నటించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌‌‌గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం? ఒరిజినల్ కథకి తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేశారు?

-కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ నా స్టైల్‌లో ఉంటుంది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి.

-ఒరిజినల్ చూసిన వారు కూడా డెఫినెట్‌గా కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. ఒరిజినల్ కంటే ఇది బావుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు ఈ ముగ్గురితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

-ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు సాయి గారిని ఫైనల్ చేసుకున్నాం. తర్వాత రోహిత్ గారిని మనోజ్ గారిని కలిసాం. ఇద్దరు ఓకే చెప్పారు. మనోజ్ గారు రోహిత్ గారు చాలా మంచి పర్ఫార్మర్స్. అలాగే వాళ్లు (హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్) స్క్రీన్ మీదకి వచ్చి కూడా కొంత గ్యాప్ వచ్చింది.

-ఒక మంచి యాక్టర్స్ నుంచి మంచి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని నమ్మకం ఉంది. ఒరిజినల్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే తెలుగు ఆడియన్స్‌కి కావలసిన ఎమోషన్స్ ఉంటాయి.

శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి?

-శ్రీ చరణ్‌తో నాకు ఇది రెండో సినిమా. తన పర్‌ఫెక్ట్‌గా మ్యూజిక్ చేశాడు. చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మూడు పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. మరో సాంగ్ 21న రిలీజ్ చేస్తున్నాం. చాలా కమర్షియల్‌గా ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేసాడు. రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్తగా ట్రై చేసాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం