కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ లవ్, యాక్షన్, కామెండీ చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో మూవీలో సూర్యకు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా చేసింది. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రెట్రో సినిమా నిర్మించారు.
రెట్రో మూవీ మే 1న వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రెట్రో సినిమాను రిలీజ్ చేస్తోంది. ఇక రీసెంట్గా అంటే ఏప్రిల్ 26న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కు లక్కీ భాస్కర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి అతిథిగా పాల్గొన్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ఇక్కడ చాలామంది సూర్య గారి అభిమానులున్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. నా కాలేజ్ లైఫ్లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే" అని అన్నారు.
"ఇక 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్ట్స్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. ఇప్పుడు రెట్రోతో వస్తున్నారు" అని వెంకీ అట్లూరి తెలిపారు.
"కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి ట్రైలర్ కట్ నేనెప్పుడూ చూడలేదు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. సూర్య గారు, విజయ్ దేవరకొండ గారు బ్రదర్స్లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మే 1న విడుదలవుతున్న రెట్రో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని వెంకీ అట్లూరి తన స్పీచ్ ముగించారు.
సంబంధిత కథనం