నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ వంటి అగ్ర తారలు తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో గ్రాండ్గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
- కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్తో క్యారెక్టర్కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.
-నిజానికి నా మీద ఒక మార్క్ పడింది. కానీ, నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.
-లీడర్ సినిమా చాలా హానెస్ట్గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి, మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే అలాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది.
-అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్లో క్లియర్గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం. ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.
సంబంధిత కథనం