నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన తండేల్ మూవీ కథతో తెలుగులో ఓ వెబ్సిరీస్ రూపుదిద్దుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చింతకింది శ్రీనివాసరావు అనే రచయిత రాసిన మున్నీటి గీతలునవల ఆధారంగా తండేల్ మూవీ తెరకెక్కినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. సినిమా యూనిట్ కూడా ఈ నవలను సినిమాను తెరకెక్కించేందుకు అవసరమైన హక్కులను కొనుగోలు చేసినట్లు అప్పట్లో ప్రమోషన్స్లో వెల్లడించారు.
తాజాగా మున్నీటి గీతలు నవల ఆధారంగా ఓ వెబ్సిరీస్ను తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ వెబ్సిరీస్కు అరేబియన్ కడలి అనే టైటిల్ను కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ వెబ్సిరీస్కు క్రిష్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. అరెబియన్ కడలి వెబ్సిరీస్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. ఈ వెబ్సిరీస్లో నటీనటులు ఎవరన్నది మాత్రం రివీల్ కాలేదు. అడ్వెంచరస్ థ్రిల్లర్ అంశాలతో పాటు ఓ లవ్స్టోరీతో ఈ వెబ్సిరీస్ తెరకెక్కుతోంది.
మత్స్సవేనం గ్రామానికి చెందిన బెస్తలు చేపల వేట కోసం గుజరాత్లోని అరేబియా సముద్రానికి వలస వెళతారు. చేపల వేట కోసం ఏడాదిలో ఎనిమిది నెలలుపైనే సముద్రంపైనే జీవిస్తుంటారు. ఓ సారి జీపీఎస్ సరిగ్గా పనిచేయకపోవడంతో పోలారావు బోటు పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశిస్తుంది. 27 మంది మత్స్సకారులను పాకిస్థాన్ కోస్టు గార్డులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. పాకిస్థాన్ జైలులో జాలర్లు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? మంచితనంతో పోలారావు పాకిస్థాన్ జైలు అధికారుల మన్ననల్ని ఎలా పోందాడు?
చివరకు జైలు నుంచి ఏ విధంగా విడుదలయ్యారు? అన్నదే ఈ నవల కథ. . ఈ నవలలో మత్య్సకారుల జీవితంతో పాటు పోలారావు, ఎర్రమ్మల ప్రేమను ఉన్నతంగా చూపించారు రైటర్. పోలారావును ప్రాణంగా ఇష్టపడ్డ ఎర్రమ్మ అతడిని కాదని మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటం లాంటి అంశాలను ఈ నవలలో టచ్ చేశారు. మున్నీటి గీతలు నవలలోని చాలా అంశాలు తండేల్ మూవీలో కనిపిస్తాయి. నవలలోని పోలారావు, ఎర్రమ్మ పాత్రల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి క్యారెక్టర్స్ డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగింది.
ప్రస్తుతం అనుష్క హీరోయిన్గా ఘాటి అనే సినిమాను తెరకెక్కిస్తోన్నాడు క్రిష్. ఈ యాక్షన్ మూవీలో తమిళ హీరో విక్రమ్ ప్రభు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 18న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదాపడింది.
సంబంధిత కథనం