ప్రైవేట్ ఐలాండ్ ఉన్న ఈ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? దీపిక, ఐశ్వర్య, అలియా కాదు.. మీరు గెస్ చేయలేని పేరు!-did you know the bollywood actress who owns the private island know about the jacqueline fernandez assets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ప్రైవేట్ ఐలాండ్ ఉన్న ఈ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? దీపిక, ఐశ్వర్య, అలియా కాదు.. మీరు గెస్ చేయలేని పేరు!

ప్రైవేట్ ఐలాండ్ ఉన్న ఈ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? దీపిక, ఐశ్వర్య, అలియా కాదు.. మీరు గెస్ చేయలేని పేరు!

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తారల ఆస్తులకు లెక్కలేదు. భారీ ఆదాయంతో దూసుకెళ్తున్నారు. అయితే 15 ఏళ్లుగా బాలీవుడ్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ కు ఓ ప్రైవేట్ ఐలాండ్ ఉందనే విషయం తెలుసా? 2012లో కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ ఐలాండ్ ను సొంతం చేసుకున్న ఏకైక నటిగా ఆమె కొనసాగుతున్నారు.

ప్రైవేట్ ఐలాండ్ కలిగి ఉన్న బాలీవుడ్ హీరోయిన్

దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సెలబ్రిటీల్లో బాలీవుడ్ స్టార్లు ఉంటారు. టాప్ స్టార్స్ సాధారణంగా ప్రతి పబ్లిక్ అప్పియరెన్స్ కోసం, షోలు, మూవీస్ కోసం రూ.కోట్లు తీసుకుంటారు. ఇండియన్ సినిమాలోని టాప్ స్టార్స్ చాలా మంది లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. చాలా మందికి ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఓ ప్రైవేట్ ఐలాండ్ కలిగి ఉన్నది మాత్రం కేవలం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రమే.

రూ.3 కోట్లకు

శ్రీలంక కు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెండు దశాబ్దాలుగా పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకోణ్, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం లేని విధంగా జాక్వెలిన్ ఓ ప్రైవేట్ ద్వీపం సొంతం చేసుకున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కలిగి ఉన్న ఏకైక బాలీవుడ్ నటి. దీని కోసం 2012లో ఈ హీరోయిన్ సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఎక్కడ ఉందంటే?

శ్రీలంక దక్షిణ తీరంలో జాక్వెలిన్ కు నాలుగు ఎకరాల ప్రైవేట్ ఐలాండ్ ఉంది. 2012లో ఈ భూమిని కొనుగోలు చేశారు జాక్వెలిన్. అక్కడ లగ్జరీ విల్లాను ఆమె నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ లేదు. మరోవైపు ఈ ప్రైవేట్ ఐలాండ్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకూ జాక్వెలిన్ ఏం చేశారన్నదానిపైనా స్పష్టత లేదు.

2009లో డెబ్యూ

శ్రీలంక బ్యూటీ క్వీన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో తెరంగేట్రం చేశారు. అంతకుముందు మోడల్ గా కెరీర్ కొనసాగించారు. 2009లో 'అల్లాదిన్' చిత్రంతో తెరంగేట్రం చేశారు జాక్వెలిన్. కానీ 2011లో వచ్చిన మర్డర్ 2 సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఐదేళ్లలో కొన్ని హిట్లు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ తరువాత ఆమె వరుస ఫ్లాప్ లను చూసింది. ఈ హాట్ బ్యూటీ చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో సోనూసూద్ యాక్షన్ చిత్రం ఫతేలో కనిపించారు. ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన హౌస్ ఫుల్ 5, వెల్ కమ్ టు ది జంగిల్ అనే రెండు సినిమాలు 2025లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం