ఓటీటీలోకి ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ.. ఇడ్లీ కొట్టు స్ట్రీమింగ్ ఈ ప్లాట్ ఫామ్ లోనే.. ఎప్పుడంటే?-dhanushs latest heart touching movie idli kadai ott release date idli kottu ott rights rate on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ.. ఇడ్లీ కొట్టు స్ట్రీమింగ్ ఈ ప్లాట్ ఫామ్ లోనే.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి ధనుష్ లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ.. ఇడ్లీ కొట్టు స్ట్రీమింగ్ ఈ ప్లాట్ ఫామ్ లోనే.. ఎప్పుడంటే?

తమిళ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘ఇడ్లీ కడై’. తెలుగులో ఇడ్లీ కొట్టుగా రిలీజైంది ఈ మూవీ. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ప్లాట్ ఫామ్ లో అన్నది చూసేద్దాం.

ఇడ్లీ కొట్టు పోస్టర్ లో ధనుష్ (X/@dhanushkraja)

తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస హిట్లతో అదరగొడుతున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’. ఈ తమిళ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ హార్ట్ టచింగ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఇడ్లీ కొట్టు రిలీజ్

ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ధనుష్ ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు. వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్ కింద చిత్రానికి రచన, దర్శకత్వం, సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

ఇడ్లీ కడై ఓటీటీ

థియేటర్లలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో సాగిపోతున్న ఇడ్లీ కడై ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ నివేదికల ప్రకారం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను దక్కించుకుందని తెలిసింది.

డిజిటల్ రైట్స్

ఇడ్లీ కొట్టు సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ హక్కులను అది రూ. 45 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అభిమానులు దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలి. ఇప్పటికైతే థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీ, మన మూలాలను చాటి చెప్పే సినిమా అంటూ కామెంట్లు వస్తున్నాయి.

కథ ఏమిటంటే?

హీరోగా ధనుష్ కు 52వ సినిమా ఇడ్లీ కొట్టు. డైరెక్టర్ గా నాలుగో మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. ఈ కథ మురుగన్ (ధనుష్) చుట్టూ తిరుగుతుంది. అతను తన తండ్రి సాంప్రదాయ ఇడ్లీ దుకాణాన్ని నడపడానికి సహాయం చేస్తాడు. తన కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడం, ఆధునిక ఆశయాలను కొనసాగించడం మధ్య చిక్కుకున్న మురుగన్ ఒక కార్పొరేట్ ఉద్యోగం చేస్తాడు.

కానీ మోసానికి గురై చివరికి తన మూలాలకు తిరిగి వస్తాడు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్, పార్తిబన్ వంటి బలమైన తారాగణం ఉన్నారు. తిరుచిత్రంబలంలో విజయవంతమైన సహకారం తర్వాత, ధనుష్, నిత్యా మీనన్ కలయిక ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం