బాలీవుడ్లో రణ్బీర్ కపూర్కు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. అతడి రిలేషన్లపై చాలా రూమర్లు వచ్చేవి. ఆలియా భట్ను వివాహం చేసుకోక ముందు స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణ్, కత్రినా కైఫ్తో రణ్బీర్ డేటింగ్ చేశారు. కత్రినాతో ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. కాగా, తాజాగా నిఖిల్ కామత్ టాక్షో పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్లో రణ్బీర్ కపూర్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. గతంలో తన రిలేషన్ల గురించి రణ్బీర్ కపూర్ చెప్పిన విషయాలు ఇందులో ఉన్నాయి.
తాను ఇద్దరు విజయవంతమైన నటీమణులతో డేటింగ్ చేశానని రణ్బీర్ కపూర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. “ఇద్దరు సక్సెస్ఫుల్ నటీమణులతో నేను డేటింగ్ చేశా. దీంతో నాకు తిరుగుబోతు అనే ముద్ర పడింది. నా జీవితంలో ఎక్కువ భాగం నాపై చీటర్ అనే ముద్ర వేసేశారు. ఇప్పుడు కూడా ఇది ఉంది” అని రణ్బీర్ కపూర్ అన్నారు.
రణ్బీర్ కపూర్ ముందుగా దీపికా పదుకొణ్తో 2008లో డేటింగ్ మొదలుపెట్టారు. బచ్చా యే హసీనో చిత్రం సమయంలో కలిసిన రణ్బీర్, దీపికా ఏడాది డేటింగ్ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత 2009 నుంచి రణ్బీర్ కపూర్, కత్రినా కైఫ్ డేటింగ్లో మునిగితేలారు. అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ మూవీ సమయంలో పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్ల డేటింగ్ తర్వాత 2016లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దీపికా, కత్రినాతో విడిపోవటంతో రణ్బీర్ కపూర్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. వారిని మోసం చేశాడంటూ కొందరు అభిప్రాయపడ్డారు.
తన తండ్రి, దిగ్గజ నటుడు రిషి కపూర్తో ఎలా ఉండేవారనే ప్రశ్నకు రణ్బీర్ కపూర్ ఈ ఇంటర్వూలో స్పందించారు. తండ్రి ముందు ఎప్పుడూ తల దించుకొనే మాట్లాడేవాడనని, ఎప్పుడు ఆయన కళ్లలోకి చూడలేదని అన్నారు. “మా నాన్నకు ఊరికే కోపం వస్తుంది. కానీ చాలా మంచి మనిషి. నేను ఎప్పుడూ ఆయన కళ్లలోకి చూడలేదు. ఎప్పుడూ తల దించుకొనే ఉండేవాడిని. ఎప్పుడు అవును అంటుండేవాడిని. ఎప్పుడూ కాదు అని అనలేదు” అని రణ్బీర్ కపూర్ తెలిపారు.
2022లో ఆలియా భట్ను రణ్బీర్ కపూర్ వివాహం చేసుకున్నారు. వీరికి రహా అనే కూతురు కూడా జన్మించారు. ఇప్పుడు రణ్బీర్, ఆలియా సంతోషంగా జీవితం గడుపుతున్నారు. దీపికా పదుకొణ్ 2018లోనే హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లాడారు. వారిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారు. 2021లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం కూడా జరిగింది.
గతేడాది డిసెంబర్లో యానిమల్ చిత్రంతో రణ్బీర్ కపూర్ భారీ బ్లాక్బస్టర్ సాధించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ చిత్రం రూ.900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం చిత్రంలో రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీరాముడిగా చేస్తున్నారు. సీతాదేవిగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో రణ్బీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.