Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే
Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే…
Telugu Movies Releasing This Week: ఉగాది సందర్భంగా ఈ వారం రెండు రోజుల ముందుగానే అభిమానులకు వినోదాన్ని అందించేందుకు సినిమాలు రెడీ అవుతోన్నాయి బుధవారం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఇవే
దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki)
విశ్వక్సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ధాస్ కా ధమ్కీ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో విశ్వక్సేన్ డ్యూయల్ రోల్లో నటిస్తోన్నాడు.
నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఉగాది రోజున ఈ సినిమా రిలీజ్ కానుంది. ధమ్కీ సినిమాకు విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు నిర్మాతగా వ్యవహరిస్తోన్నాడు.
కాజల్ కోస్టి
దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత ఈ ఈగాదికి కోస్టి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది కాజల్ అగర్వాల్(kajal aggarwal). హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఇందులో సినిమా హీరోయిన్గా, పోలీస్ ఆఫీసర్గా డ్యూయల్ రోల్లో కాజల్ నటిస్తోంది. తమిళంలో మార్చి 17న రిలీనైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ను తెచ్చుకున్నది. తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
కృష్ణవంశీ రంగమార్తండ(Rangamarthanda)
సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తండ మూవీ మార్చి 22న విడుదలకానుంది. ఓ రంగస్థల కళాకారుడి జీవితం నేపథ్యంలో రూపుదిద్దుకోన్న ఈ సినిమాలో ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మరాఠీలో విజయవంతమైన నటసామ్రాట్ ఆధారంగా రంగమార్తండ సినిమా రూపొందుతోంది. రంగస్థలంపై ఎన్నో పాత్రల్ని అద్భుతంగా పోషించిన ఓ కళాకారుడి నిజజీవితంలో నటించడం రాక ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నదే ఈ సినిమా కథ.
గీత సాక్షిగా
ఆదర్శ్, చిత్రాశుక్లా జంటగా నటిస్తోన్న గీతసాక్షిగా సినిమా ఉగాది సందర్భంగా బుధవారం రిలీజ్ కానుంది. మహిళలపై జరుగుతోన్న హింసాత్మక సంఘటనలను చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆంథోనీ మట్లిపల్లి దర్శకత్వం వహించాడు.
కథ వెనుక కథ -మార్చి 24
విశ్వాంత్ దుద్దుంపూడి, శ్రీజీత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న కథ వెనుక కథ సినిమా మార్చి 24న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్నాడు.
టాపిక్