డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు చాలా స్టార్డమ్ వచ్చింది. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితో ఆయన పని చేశారు. ఎన్నో సూపర్ హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నారు. ఈ మంగళవారం (జూలై 2) జానీ మాస్టర్ పుట్టిన రోజు జరుపకున్నారు. తన పుట్టిన రోజున మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే తాను అడిగిన ఓ సాయాన్ని రామ్చరణ్ చేశారంటూ నేడు (జూలై 3) సోషల్ మీడియా ద్వారా జానీ మాస్టర్ వెల్లడించారు.
సరైన్ సమయంలో సాయం చేసే వాడు దేవుడు అని జానీ మాస్టర్ నేడు ట్వీట్ చేశారు. డ్యాన్సర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సాయం చేసిన రామ్చరణ్ను దేవుడితో పోల్చారు. తమ మనసుల్లో రామ్చరణ్, ఉపాసన పట్ల కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని రాసుకొచ్చారు.
డ్యాన్సర్స్ యూనియన్ టీఎఫ్టీటీడీఏలోని 500 మందికిపైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా సాయం చేస్తామని రామ్చరణ్, ఉపాసన చెప్పారని జానీ మాస్టర్ పేర్కొన్నారు. “సరైన సమయంలో సహాయం చేసే వాడు దేవుడు. నా పుట్టిన రోజు సందర్భంగా రామ్చరణ్ అన్న ఇంటికి పిలిచినప్పుడు వారికి నా మీద ఉన్న ప్రేమకు చాలా సంతోషించా. అక్కడి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, కొణిదెల ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకు నా సంతోషం వంద రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మా డ్యాన్స్ యూనియన్ టీఎఫ్టీటీడీఏలో 500లకుపైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామని అన్నారు” అని జానీ మాస్టర్ వెల్లడించారు.
అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని, ఇచ్చిన మాటకు విలువనిచ్చారని రామ్చరణ్ను ప్రశంసించారు జానీ మాస్టర్. అన్ని కుటుంబాలకు సాయం చేయడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. తమ మనసుల్లో కృతజ్ఞతాభావం ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. డ్యాన్సర్లందరి తరఫు నుంచి రామ్చరణ్, ఉపాసనకు ధన్యవాదాలు తెలుకుంటున్నామని జానీ మాస్టర్ ట్వీట్లో రాసుకొచ్చారు. వారి లాంటి వారితో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ షూటింగ్ ఆలస్యమవుతూనే వస్తోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెర్రీ అభిమానులు వేచిచూస్తుండగా.. వాయిదాలు పడుతూనే ఉంది. ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు గేమ్ ఛేంజర్ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్గా చేస్తుండగా.. అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.