Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?-crime thriller movie rautu ka raaz to stream in zee5 ott from 28th june ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

Hari Prasad S HT Telugu

Crime Thriller: ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడీ జానర్ లోని ఓ సినిమా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన రౌతు కా రాజ్ (Rautu Ka Raaz) అనే సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా జీ5 (ZEE5) ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా స్ట్రీమింగ్ డేట్ వెల్లడిస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

రౌతు కా రాజ్ స్ట్రీమింగ్ డేట్

బాలీవుడ్ విలక్షణ నటుడు, సైంధవ్ మూవీలో విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన మూవీ ఈ రౌతు కా రాజ్. ఓ ఊళ్లో జరిగే హత్య చుట్టూ తిరిగే స్టోరీతో రాబోతోంది. కొన్ని రోజుల కిందటే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మర్డర్ మిస్టరీని పరిష్కరించే ఓ తెలివైన పోలీస్ ఆఫీసర్ గా నవాజుద్దీన్ కనిపించనున్నాడు.

తాజాగా ఈ మూవీని జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ జీ5 ఓటీటీ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఉత్తరాఖండ్ లోని రౌతు అనే గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. అయితే స్థానిక పోలీసులు దీనిని తేలిగ్గా తీసుకుంటారు. అసలు తమ గ్రామంలో సాధారణ చావులే తప్ప హత్యలు లేవని వాదిస్తారు.

కానీ ఆ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్‌హెచ్‌వో దీపక్ నేగి (నవాజుద్దీన్) మాత్రం ఈ మర్డర్ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. సీరియస్ గా ఆ కేసును పరిష్కరించడం మొదలుపెడతాడు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఆ హత్య వెనుక ఉన్న వాళ్ల గుట్టు బయటపడుతూ వస్తుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? దానికి కారణం ఏంటి? అన్నది ఈ మూవీలో చూడాలి.

ఈ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ.. "ప్రతిసారి ఏది చూపిస్తున్నారో అది చూడొద్దు. ఏది దాస్తున్నారో అది చూడాలి" అనే క్యాప్షన్ ఉంచింది జీ5 ఓటీటీ. మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తోపాటు అందులోనే కామెడీని జోడించి సరదాగా ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ తోపాటు రాజేష్, అతుల్ తివారీ, నారయణి శాస్త్రిలాంటి వాళ్లు నటించారు.