Crime Thriller Movie: యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ (Jewel Thief) నెట్ఫ్లిక్స్ లోకి వస్తోంది. నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం (ఏప్రిల్ 16) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో డైమండ్ దొంగగా కనిపించనున్నాడు.
నెట్ఫ్లిక్స్ తీసుకొస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా రూ.500 కోట్ల డైమండ్ చోరీ చుట్టూ తిరుగుతుంది. రెడ్ సన్ అనే ఈ డైమండ్ ఆఫ్రికాలోనే అత్యంత ఖరీదైన డైమండ్ గా పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ముంబైకి వచ్చే ఈ డైమండ్ ను దొంగిలించడానికి ప్రపంచంలోనే పేరుగాంచిన జువెల్ థీఫ్ రేహాన్ రాయ్ ను స్థానిక డాన్ నియమిస్తాడు. ఆ జువెల్ థీఫే సైఫ్ అలీ ఖాన్. ఇందులో రాజన్ ఔలాఖ్ అనే పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించాడు. అతనిదో మాఫియా బాస్ పాత్ర. ఇక ఈ డైమండ్ దొంగలను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ పాత్రలో కునాల్ కపూర్ నటించాడు.
రెడ్ సన్ అనే ఓ భారీ డైమండ్ చోరీ కథే ఈ జువెల్ థీఫ్ మూవీ స్టోరీ. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉండబోతోంది ఈ 2 నిమిషాల 13 సెకన్ల ట్రైలర్ కళ్లకు కట్టింది. కుకీ గులాటీ, రాబీ గ్రేవాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మార్ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మించింది.
పఠాన్, ఫైటర్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో అతని మూవీస్ లోని హైఓల్టేజ్ యాక్షన్ సీన్లన్నీ ఈ జువెల్ థీఫ్ లోనూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే ఈ మూవీ గురించి నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి చూడొచ్చు.
సంబంధిత కథనం