హీరో శ్రీ విష్ణు, కమెడియన్ వెన్నెల కిశోర్ తమదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టిన సినిమా సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించిన సింగిల్ మే 9న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది.
థియేటర్లలో విడుదలైన సింగిల్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాంతో తొలి రోజున వరల్డ్ వైడ్గా 4 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది సింగిల్ మూవీ. సక్సెస్ఫుల్గా సింగిల్ మూవీ దూసుకుపోతున్న నేపథ్యంలో విలేకరుల సమావేశంలో కమెడియన్ వెన్నెల కిశోర్ సినీ విశేషాలు పంచుకున్నాడు.
-మనం చికెన్ బిర్యానీ తిన్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ వస్తుంది. అది బిర్యానీకి ఒక టేస్ట్ని తీసుకొచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే (నవ్వుతూ).
-డైరెక్టర్ రాజ్ గారు చాలా మంచి పర్సన్. శ్రీ విష్ణు గారు చాలా స్పాంటీనియస్గా డైలాగ్స్ని ఇంప్రవైజ్ చేసేస్తారు. దానికి పక్కన అంతే స్పాంటేనియస్గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. అలాంటి స్పాంటేనియస్ క్యారెక్టర్కి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ గారు భావించారు. అందుకే శ్రీ విష్ణు గారు ఉండే ఫ్రేమ్లో వెన్నెల కిశోర్ ఉండాలని ఆయన ముందే ఫిక్స్ అయ్యారు.
-ఈ సినిమా కథ విన్నప్పుడే చాలా హిలేరియస్గా అనిపించింది. భాను నందు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అదే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీదకు వచ్చింది.
- సినిమాని థియేటర్స్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నా సినిమా నేను స్క్రీన్ మీద చూసుకోలేను. కానీ, ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్తో కలిసి చూసినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-నిజానికి కామెడీ పాత్రలని ఎంచుకునే అంత వెర్సటాలిటీ ఇప్పుడు లేదు. ముందు రైటర్స్ని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. రైటర్స్ కొత్త కొత్త ఆలోచనలతో వస్తేనే కామెడీ పాత్రలు కూడా కొత్తగా వస్తాయి. చాలా సార్లు మనకి రెగ్యులర్ పాత్రలే వస్తుంటాయి. కానీ, దాన్ని మనం ఓన్ చేసుకొని అందులోనే ఏదో ఒక యూనిక్నెస్ని ప్రజెంట్ చేసేలా ప్రయత్నం చేస్తుంటాను. నావల్ల ఒక సీన్ ముందుకెళ్లడం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
సంబంధిత కథనం