మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి తాన మూత్రాన్ని తానే తాగినట్లు సినీ ప్రముఖ నటుడు, పాపులర్ కమెడియన్ పరేష్ రావల్ వెల్లడించారు. దీంతో పరేష్ రావల్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాకుండా ఆ వీడియో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
రాజ్ కుమార్ సంతోషి 'ఘటక్' సినిమా షూటింగ్ సమయంలో తన మోకాలికి గాయమైనట్లు పరేష్ రావల్ వెల్లడించారు. టిన్ను ఆనంద్, డానీ డెంజోంగ్పా ఆయన్ను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. అప్పుడు పరేష్ రావల్ తన కెరీర్ ముగిసిపోతుందని భావించారు.
అయితే, అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ ఆసుపత్రిలో పరేష్ రావల్ను సందర్శించారు. సందర్శించిన అనంతరం మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి తన మూత్రం తాగమని సలహా ఇచ్చారట. దాంతో ఆయన అలాగే చేసినట్లు రీసెంట్గా పరేష్ రావల్ వెల్లడించారు.
ది లల్లాంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేష్ రావల్ మాట్లాడుతూ.. "నేను నానావతి (ఆసుపత్రి)లో ఉన్నప్పుడు వీరు దేవగన్ నన్ను చూడటానికి వచ్చారు. నేను అక్కడ ఉన్నానని తెలుసుకుని ఆయన నా దగ్గరకు వచ్చారు. ఏమైందని అడిగారు. నా మోకాలి గాయం గురించి నేను ఆయనకు చెప్పాను" అని తెలిపారు.
"దాంతో ఆయన ఉదయం లేవగానే నా మూత్రం తాగమని నాకు చెప్పారు. యోధులందరూ ఇలాగే ఇలాగే చేస్తారు. మీకు ఎప్పటికీ ఎటువంటి సమస్య ఉండదు. ఉదయం లేవగానే ముందుగా మూత్రం తాగమని చెప్పారు. అయితే, దాంతోపాటు మద్యం, మటన్, పొగాకు మానేయమను కూడా చెప్పారు. ఎప్పటిలాగే క్రమం తప్పకుండా ఆహారం తినమని, ఉదయం మాత్రం యూరిన్ తాగమని ఆయన (వీరు దేవగన్) నాకు చెప్పారు" అని పరేష్ రావల్ గుర్తు చేసుకున్నారు.
అనంతరం పరేష్ రావల్ తను మూత్రం తాగిన అనుభం గొప్పగా ఉందని చెప్పారు. "నేను దానిని మ బీరులా తాగుతాను ఎందుకంటే నేను దానిని రోజు తాగాలి కాబట్టి. అది సరిగ్గా తాగాలంటే అలాగే ఫీల్ అవుతాను. అలా నేను 15 రోజులు బీరులా నా మూత్రాన్ని తాగాను. అది పనిచేసింది. ఎక్స్-రే రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ ఆశ్చర్యపోయారు" అని పరేష్ రావల్ చెప్పుకొచ్చారు.
అయితే, మోకాలి గాయం నయం కావడానికి సాధారణంగా 2 నుండి రెండున్నర నెలలు పట్టేదని, కానీ, యూరిన్ తాగడం వల్ల నెలన్నరలోనే పూర్తిగా కోలుకున్నట్లు కమెడియన్ పరేష్ రావల్ వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో పరేష్ రావల్ కామెంట్స్, వీడియో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే పరేష్ రావల్ చిరంజీవితో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ (డాక్టర్ లింగం పాత్ర) వంటి సినిమాల్లో నటించారు. ఇక ప్రియదర్శన్ దర్శకత్వంలో హర్రర్ కామెడీ చిత్రం భూత్ బంగ్లాలో నటించనున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టబు నటించారు. అలాగే, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో కలిసి హేరా ఫేరి 3 మూవీలో పరేష్ రావల్ నటిస్తున్నారు.
సంబంధిత కథనం