చియాన్ విక్రమ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర శూర: పార్ట్ 2’ ఇండియాలో డిజిటల్ డెబ్యూ చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్.. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాడు. అయితే థియేటర్లలో ఆశించిన కలెక్షన్లు రాకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ గానే మిగిలింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ వివరాలను అనౌన్స్ చేశారు.
తమిళ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘వీర ధీర శూర: పార్ట్ 2’ ఓటీటీ రిలీజ్ కన్ఫార్మ్ అయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేసింది. ‘వీర ధీర శూర: పార్ట్ 2’ మూవీ ఏప్రిల్ 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో స్ట్రీమ్ కాబోతుందని తెలిపింది. తమిళంలో వచ్చిన ఈ మూవీ.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ తో ఓటీటీ స్ట్రీమ్ కానుంది.
భారీ చిత్రాలు ముందుగా పార్ట్ 1 రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత సీక్వెల్ థియేటర్లకు వస్తుంది. కానీ విక్రమ్ హీరోగా యాక్ట్ చేసిన ‘వీర ధీర శూర’ మూవీ మాత్రం ముందుగా పార్ట్ 2 రిలీజైంది. దీని ప్రీక్వెల్ ను తర్వాత రెడీ చేయబోతున్నారు. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఎస్జే సూర్య, సురాజ్ వెంజారమూడు, దుషార విజయన్, పృథ్వీ రాజ్ వంటి నటీనటులు కూడా ఈ మూవీలో ఉన్నారు. మార్చి 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.
ఎస్. యు. అరుణ్ కుమార్ రాసి, దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘వీర ధీర శూర: పార్ట్ 2’ రిలీజ్ కు ముందు పెద్ద కాంట్రవర్సీ చెలరేగింది. దీంతో రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ రోజు కూడా డ్రామా నెలకొంది. ఒప్పందం ప్రకారం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇవ్వకుండానే సినిమా రిలీజ్ చేస్తున్నారని, విడుదలపై స్టే విధించాలని బీ4యూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
దీంతో మూవీ రిలీజ్ పై తాత్కాలికంగా స్టే విధించడంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లోనూ మార్నింగ్, మ్యాట్నీ షోలు రద్దు చేశారు. చివరగా సెటిల్ మెంట్ చేసుకోవడంతో మార్చి 27న సాయంత్రం ఫస్ట్ షోతో ఈ మూవీ రిలీజైంది. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ ఫిల్మ్ రూ.2 కోట్ల నష్టాన్ని చవిచూసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన వీర ధీర శూర చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రమాదకరమైన క్రైమ్ నెట్ వర్క్ లో చిక్కుకుని, ఓ మిస్టీరియస్ మిషన్ కోసం పనిచేసే కిరాణా షాప్ ఓనర్ కాళి కథే ఈ సినిమా. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. ఫిల్మ్ లో విక్రమ్ యాక్షన్ అదరహో అనిపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూ కొదవలేదు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం మూవీ ఆడలేకపోయింది.
సంబంధిత కథనం