Vikram Dhruva Natchathiram: 2016లో షూటింగ్ మొదలు - 2023లో రిలీజ్ - విక్రమ్ ధృవనక్షత్రం నిరీక్షణకు తెరపడనుందా?
Vikram Dhruva Natchathiram: విక్రమ్ ధృవనక్షత్రం సినిమా షూటింగ్ మొదలైన ఏడేళ్ల తర్వాత రిలీజ్ కాబోతుండటం కోలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందంటే...
Vikram Dhruva Natchathiram: కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందిన ధృవనక్షత్రం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మే 19న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకుడు గౌతమ్ మీనన్ సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం.
షూటింగ్ ప్రారంభమైన ఏడేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కాబోతుండటం గమనార్హం. 2016లో భారీ అంచనాల మధ్య ధృవనక్షత్రం షూటింగ్ మొదలైంది. తొలుత ఈ సినిమాను సూర్యతో తెరకెక్కించాలని అనుకున్నారు గౌతమ్ మీనన్. కానీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో విక్రమ్తో ఈ భారీ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేశారు. 2018లో షూటింగ్ను పూర్తిచేశారు.
కానీ అనివార్య కారణాల వల్ల గత ఐదేళ్లుగా సినిమా రిలీజ్ వాయిదాపడుతూనే వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ విషయంలో నెలకొన్న సమస్యలను క్లియర్ చేసే పనిలో గౌతమ్ మీనన్ ఉన్నట్లు సమాచారం. ధృవనక్షత్రం సినిమాలో జాన్ అనే అండర్ కవర్ ఏజెంట్గా విక్రమ్ కనిపించబోతున్నాడు.
రీతూవర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటిస్తోంది. పెళ్లిచూపులు సక్సెస్ తర్వాత రీతూవర్మ అంగీకరించిన సినిమా ఇది. అమెరికా, స్లొవెనియా, బల్గేరియాతో పాటు ఏడు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఈ సినిమాకు హరీస్ జైరాజ్ సంగీతాన్ని అందించారు.
టాపిక్