Chiranjeevi and Pawan Fan War: పవర్స్టార్ ఫ్యాన్గా మెగాస్టార్? చిరు అభిమానుల అసంతృప్తి..!
Chiranjeevi and Pawan Fan War: టాలీవుడ్లో చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు కామెంట్లు విసుకుంటున్నారు. బోళా శంకర్ సినిమాలో చిరు.. పవన్కు ఫ్యాన్గా నటిస్తున్నారనే వార్త రావడంతో ఈ విధంగా ఘర్షణ మొదలైంది.
Chiranjeevi and Pawan Fan War: టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ సహజమే. ఇరు పక్షాలు మా హీరో గొప్ప వాడని, మా హీరో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని తరచూ గొడవలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా అప్పుడు కూడా రామ్ చరణ్, తారక్ ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి ఘర్షణలు, కామెంట్లు జరిగినట్లు సోషల్ మీడియాలో చూశాం. తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలోనే ఫ్యాన్ వార్ జరుగుతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన పవర్ స్టార్ అభిమాని పాత్రలో కనిపించనున్నారట. ఈ కారణంగా మెగా, పవర్ స్టార్ అభిమానుల మధ్య వార్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బోళా శంకర్ సినిమాలో చిరంజీవి.. పవన్ కల్యాణ్ అభిమానిగా నటిస్తున్నారా? లేదా అనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఇరు వర్గాల అభిమానులు మాత్రం మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తారని సమాచారం. చిరంజీవి-పవన్ కల్యాణ్ కలిసి ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా వేస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్త అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తుందనుకుటే ఫ్యాన్ వార్కు దారితీసేలా ఉంది.
ఫ్యాన్స్ ఈ వార్త విని కలత చెందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని, పవన్ కల్యాణ్ అభిమానిగా చూపించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఆఖరు చిరంజీవి కూడా తన సినిమా కోసం పవన్ కల్యాణ్ బ్రాండ్ను ఉపయోగించాల్సి వచ్చిందంటూ పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు.
సోదరుల బంధం తెరపై చూసి ఆనందించాల్సి పోయి.. అనవసర వాగ్వాదం సమస్యను తీవ్రతరం చేస్తోంది. ఇదిలా ఉంటే కొంతమంది మెగా అభిమానులు మాత్రం ఈ విషయంలో క్లారిటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ తన తమ్ముడు అభిమానిగా నటించట్లేదని, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్గా తెరకెక్కుతోంది.