ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్- మనుషుల ఆయుష్షు చెప్పే హీరో- యమ ధర్మరాజుకు పూజ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?-chiranjeeva ott streaming on aha from november 7th tarun kushitha kallapu chiranjeeva ott trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్- మనుషుల ఆయుష్షు చెప్పే హీరో- యమ ధర్మరాజుకు పూజ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్- మనుషుల ఆయుష్షు చెప్పే హీరో- యమ ధర్మరాజుకు పూజ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా చిరంజీవ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్‌గా సోషల్ మీడియా బ్యూటీ కుషిత కల్లపు నటించారు. ఇందులో మనుషుల ఆయుష్షు చెప్పే పవర్ హీరోకు వస్తుంది. యమ ధర్మరాజుకు పూజ చేసే చిరంజీవి ఓటీటీ రిలీజ్ ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి సరికొత్త తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్- మనుషుల ఆయుష్షు చెప్పే హీరో- యమ ధర్మరాజుకు పూజ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో ఎప్పటికప్పుడు తెలుగులో కూడా సరికొత్త కంటెంట్స్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అన్ని భాషలతో పోటీ పడుతూ తెలుగులో కూడా విభిన్నమైన కంటెంట్ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతుంటాయి.

మైథలాజికల్ కామెడీ థ్రిల్లర్

అలా సరికొత్తగా తెలుగులో ఓటీటీలోకి రానున్న మైథలాజికల్ కామెడీ థ్రిల్లర్ సినిమా చిరంజీవ. ఈ సినిమా గురించి ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. తాజాగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోకు ఎదుటి మనుషుల ఆయుష్షు చూసే పవర్ లభిస్తుంది. దాంతో ఎదుటి వాళ్లు ఎన్నేళ్లు బతుకుతారో చెప్పగలడు.

యమ ధర్మరాజుకు పూజ

అయితే, ఈ పవర్ ధన త్రయోదశి నాడు యమ ధర్మరాజుకు పూజ చేయడంతో లభించినట్లు హీరో తల్లి మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. చిరంజీవ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ చేయగా.. హీరోయిన్‌గా సోషల్ మీడియా బ్యూటీ కుషిత కల్లపు చేసింది. తొలిసారిగా రాజ్ తరుణ్, కుషిత జోడీ కట్టిన సినిమా చిరంజీవి.

చిరంజీవ టీజర్ రిలీజ్

స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీ సినిమా చిరంజీవకు అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విజయదశమి పర్వదినం సందర్భంగా చిరంజీవ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అంబులెన్స్ డ్రైవర్‌గా

చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, యాక్షన్‌తో ఆకట్టుకుంది. శివ (రాజ్ తరుణ్)కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్‌ను కూడా జెట్ స్పీడ్‌తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్‌గా చేరమని సలహా ఇస్తారు.

సత్తు పైల్వాన్‌‌ను లేపేస్తా

అలా అంబులెన్స్ డ్రైవర్‌గా హీరో రాజ్ తరుణ్ చేస్తాడు. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్‌ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ.

యమ ధర్మరాజు వాహనం అడ్డురావడం

శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్‌లో ఆసక్తి కలిగించింది. అలాగే, శివన తల్లి యమ ధర్మరాజుకు పూజ చేయమనడం, శివ అంబులెన్స్ నడుపుతుండగా యమ ధర్మరాజు వాహనం దున్నపోతు అడ్డం రావడం, శివకు ఎదుటి వారి ఆయుష్షు చెప్పే పవర్ రావడం అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా చిరంజీవ టీజర్ సాగింది.

ఆహా ఓటీటీలో చిరంజీవ

మరి ఈ పవర్‌తో శివ ఏం చేస్తాడు అనే అంశంతో చిరంజీవి మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే, ఆహా ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్‌గా చిరంజీవ తెరకెక్కింది. అంటే, ఆహాలోనే చిరంజీవ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 7న ఆహాలో చిరంజీవ ఓటీటీ రిలీజ్ అవనుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం