తెలుగులో నిన్న (అక్టోబర్ 10) థియేటర్లలో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అరి. అరిషడ్వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరెక్కిన ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ జయశంకర్ ఇదివరకు పేపర్ బాయ్ వంటి సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించారు. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు జయశంకర్.
పేపర్ బాయ్ సినిమా తర్వాత దాదాపుగా ఏడేళ్లకు డైరెక్టర్ జయశంకర్ తెరకెక్కించిన సినిమానే అరి. అరిషడ్వర్గాలులోని మొదటి రెండు పదాలైన అరి అనే టైటిల్తో వచ్చిన ఈ సినిమాకు మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. అరి అంటే శత్రువు అనే అర్థం వస్తుంది. మనిషిలోని అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కొవాలో చెప్పే ప్రయత్నంగా వచ్చింది అరి.
థియేటర్లలో విడుదలైన అరి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూన్న అరి మూవీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఆడియెన్స్ నుంచి మౌత్ టాక్ ఇలా అన్నీ కూడా అరిపై పాజిటివ్గానే ఉన్నాయి.
ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా అరి సినిమాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు.
‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అరి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇక అరి చిత్రంలోని కథ, కథనం, ఇచ్చిన సందేశం ఆడియెన్స్ను మెప్పిస్తోంది. అలాగే, ‘అరి’ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ పరంగానూ మంచి పేరు వచ్చింది.
మొత్తానికి అరితో దర్శకుడు జయశంకర్ ద్వితీయ విఘ్నం దాటినట్టుగా చెప్పుకోవచ్చు. అరి సినిమాలోని మాటలు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఓ ట్రాన్స్లో డైరెక్టర్ జయశంకర్ సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్లిపోయారని చూసిన ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, అరి సినిమాలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, సూర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం