Brahmamudi Promo: రాజ్ కారులో జీపీఎస్ ట్రాకర్- ఒకేలా ఆలోచించిన యామిని, కావ్య- రామ్‌గా సొంత ఆఫీస్‌కు- అయోమయంలో రుద్రాణి!-brahmamudi today episode promo yamini gps in raj car go to kavya office star maa serial brahma mudi disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Promo: రాజ్ కారులో జీపీఎస్ ట్రాకర్- ఒకేలా ఆలోచించిన యామిని, కావ్య- రామ్‌గా సొంత ఆఫీస్‌కు- అయోమయంలో రుద్రాణి!

Brahmamudi Promo: రాజ్ కారులో జీపీఎస్ ట్రాకర్- ఒకేలా ఆలోచించిన యామిని, కావ్య- రామ్‌గా సొంత ఆఫీస్‌కు- అయోమయంలో రుద్రాణి!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో రాజ్ కారులో యామిని జీపీఎస్ ట్రాకర్ పెడుతుంది. కావ్య ఆఫీస్‌కు రాజ్ వెళ్లినట్లు చూసి తెగ భయపడిపోతుంది యామిని. కావ్య కూడా భయపడుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో టీనాల మాట్లాడి భర్త రాహుల్‌ను స్వప్న వెధవని చేస్తుంది. టీనా కోసం రాహుల్ పడిన పాట్లు చూసి చీపురు కట్టతో ఉతికి ఆరేస్తుంది. స్వప్న కొట్టిన దెబ్బలకు రాహుల్ మూలుగుతూ నడుస్తుంటే.. రుద్రాణి చూస్తుంది.

వేడి వేడి కాపుడం

ఊరంతా తిరిగి వస్తున్నావా అని రుద్రాణి అంటే.. ఒళ్లు హూనం అయిందని రాహుల్ అంటాడు. వెళ్లి నీ పెళ్లాంతో వేడి వేడి కాపుడం పెట్టించుకో, నొప్పులు తగ్గుతాయి అని రుద్రాణి చెబితే.. అది కొడితేనే ఈ దెబ్బలు వచ్చాయని రాహుల్ అంటాడు. అలా జరిగిందా అని రుద్రాణి అంటుంది. అది నన్ను తన్నిన చోట తన్నకుండా ఫుట్‌బాల్ ఆడుకుందని చెబితే అలా జరిగిందా అని సింపుల్‌గా అంటావేంటీ అని రాహుల్ అంటాడు.

టిష్యూ పేపర్స్‌లా జీవితం

నాకేం చెప్పకురా, ఇంట్లో నాకు అంతా కొత్తకొత్తగా ఉంది. అసలు ఏమైంది నాకు. లోపల నన్ను వాళ్లు పిచ్చిదానిలా చూస్తున్నారు. కావ్యను పిచ్చిదానిలా చూడాల్సిందిపోయి నన్ను చూస్తున్నారు. నాకు అదే అర్థం కావడంలేదు అని రుద్రాణి అంటుంది. రాహుల్, రుద్రాణి ఇద్దరు మెట్లపై కూర్చుంటారు. మనిద్దరి జీవితాలు వాడి పడేసిన టిష్యూ పేపర్స్‌లా తయారయ్యాయేంటీ మామ్ అని రాహుల్ అంటాడు. ఇద్దరు తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు.

అయోమయంలో రుద్రాణి

కానీ, స్వప్న, అప్పు ఇచ్చిన షాక్ నుంచి రుద్రాణి తేరుకోలేకపోతుంది. అయోమయంగా ఉందని రుద్రాణి చెబుతుంది. మరోవైపు కావ్యను మళ్లీ రాజ్ కలవాలని అనుకుంటాడు. బయటకు వెళ్తున్నాను అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని కూడా తనతోపాటే వస్తానని, నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెబుతుంది. కానీ, రాజ్ మాత్రం తనకు అర్జంట్ వర్క్ ఉందని, ఒకడినే వెళ్తానని చెబుతాడు. కొద్దిసేపు వస్తానని యామిని వాదిస్తుంది.

ఆశ్చర్యపోయిన యామిని తల్లిదండ్రులు

కానీ, రాజ్ మాత్రం వినడు. దాంతో రాజ్ చెప్పినట్లు విన్నట్లు నటిస్తూ సరే రానని చెబుతుంది యామిని. పక్కనే డైనింగ్ టేబుల్‌పై యామిని తండ్రికి తల్లి వైధేహి టిఫిన్ వడ్డిస్తుంటుంది. రామ్ ఎక్కడికో వెళ్తున్నాడు అని అడుగుతారు. తెలీదు. కానీ, ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం నాకు తెలుస్తుందని యామిని చెబుతుంది. అదేలా అని ఇద్దరు ఆశ్చర్యంగా అడుగుతారు.

ప్రతిదీ తెలుస్తుంది

ఇదివరకు రాజ్‌కు యామిని కారు గిఫ్ట్‌గా ఇస్తుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒంటరిగా వెళ్లొచ్చని చెబుతుంది. కానీ, అదే కారులో జీపీఎస్ ట్రాకర్ పెట్టినట్లు, రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంత సేపు స్పెండ్ చేస్తున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఈ ఫోన్‌లో తెలుస్తుంది అని యామిని తల్లిదండ్రులకు చెబుతుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. అలా చేయడం కరెక్ట్ కాదని తండ్రి అంటాడు. కానీ, యామిని వినదు.

భయపడిపోయిన యామిని

ఇక రాజ్ వెళ్లే లొకేషన్‌ను ఫోన్‌లో చూస్తుంది యామిని. కారు సరిగ్గా కావ్య ఆఫీస్ దగ్గరే ఆగిందేంటీ, అక్కడికి వెళ్తే.. తన స్టాఫ్ అందరూ గుర్తు పట్టేస్తారు అని తెగ భయపడిపోతుంది యామిని. మరోవైపు రాజ్ పూల బొకే పట్టుకుని కావ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. సీసీ కెమెరాలో నుంచి రాజ్‌ను చూసి కావ్య షాక్ అయిపోతుంది. శ్రుతి వాళ్లు, స్టాఫ్ అంతా ఆయన్ను చూస్తే నిజమంతా భయటపడిపోతుంది, ఆయనకు ప్రమాదం ఏర్పడుతుంది అని కావ్య భయపడిపోతుంది.

ఇద్దరి ప్రయత్నం

ఆఫీస్‌కు రాజ్ రావడంతో అటు యామిని ఇటు కావ్య ఇద్దరికీ ఒకేసారి షాక్ తగిలి భయపడిపోతుంటారు. ఎలాగైనా అడ్డుకోవాలని . ఆఫీస్‌లోకి ఒకేలా ఆలోచిస్తారు. ళ్లకుండా రాజ్‌ను అడ్డుకోడానికి యామిని, కావ్య ప్రయత్నిస్తారు. అయితే, ఆఫీస్‌ నుంచి శ్రుతి వాళ్లు బయటకు వెళ్తుంటారు. డోర్ నుంచి ఆఫీస్ లోపలికి వచ్చేందుకు డోర్ దగ్గరే ఉంటాడు రాజ్. అటు రాజ్, ఇటు శ్రుతి వాళ్లను చూసి కావ్య షాక్ అవుతుంది.

మరి రాజ్‌ను శ్రుతి వాళ్లు చూడకుండా కావ్య అడ్డుకుంటుందా అనేది చూడాలి. అక్కడితే బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం