Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సామంత్కు వార్నింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్లారు. చంపాలన్న ఉద్దేశంతో కాదు అని కావ్య అంటుంది. వార్నింగ్ ఏమైనా ఇచ్చారా అని అనామిక లాయర్ అంటాడు. ఇంకోసారి ఇలా చేస్తే.. అని తటాపటాయించిన కావ్యతో చంపేస్తామన్నారు అంతేనా అని లాయర్ అంటాడు.
అవును అని కావ్య అనేసరికి అంతా షాక్ అవుతారు. కోపంలో ఏదో అన్నారు అంతే గానీ అని కావ్య అంటే.. అంతేగానీ ఇక మీరు వెళ్లొచ్చు. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని పీపీ అంటాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. ఈ కేసులో ఈ పాయింట్ చాలా ముఖ్యం. ముద్దాయికి సామంత్ను చంపాలన్న కోపం ఉంది. కానీ, అక్కడ చాలా మంది ఉండటంతో పక్కా ప్లాన్ చేసి చంపాడు. తర్వాత శవాన్ని కారు డిక్కీలో పెట్టుకుని మాయం చేసేందుకు తీసుకెళ్తాడు. అంతే యువరానర్ అని పీపీ చెబుతాడు.
డిఫెన్స్ లాయర్ లేచి అది పూర్తిగా ఆధారితం కాదు. దీనిపై క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్సైని విచారించాలని కోరుతాడు రాజ్ లాయర్. దాంతో అపూర్వ బోనులోకి వస్తుంది. రాజ్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు అని లాయర్ అడుగుతాడు. అనామిక మిస్సింగ్ కేసు ఇచ్చి రాజ్పై అనుమానం ఉందనడంతో సెర్చ్ వారెంట్కు వెళ్లాం అని అప్పు అంటుంది. రాజ్ చంపడం గానీ, కారు డిక్కీలో శవం పెట్టడంకానీ చూశారా అని లాయర్ అడుగుతాడు.
లేదు. కేవలం కారులో శవాన్ని ఐడెంటీఫై మాత్రమే చేశాం అని అప్పు అంటాడు. కారులో శవం కనపడగానే అరెస్ట్ చేస్తారా. కేవలం అనామిక కంప్లైంట్ ఇచ్చిందనే అరెస్ట్ చేశారు అంతేనా అని లాయర్ అంటే.. అవును అని అప్పు అంటుంది. లాయర్ వెళ్లమంటాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువరానర్. నా క్లైంట్ సామంత్ను చంపడానికి చూసిన ప్రత్యక్ష సాక్షి లేదు. ఆయుధం కూడా లేదు. కేవలం అనామిక కంప్లైంట్ మూలంగానే అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు అని లాయర్ అంటాడు.
అన్ని సాక్ష్యాలు చూపిస్తాం. సమయం ఇవ్వాల్సిందిగా కోరుతాడు అనామిక లాయర్. సమయం ఇస్తే కొత్త సాక్ష్యులను, సాక్ష్యాధారాలను సృష్టించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విచారించాల్సిందిగా కోరుతున్నాను అని లాయర్ అంటాడు. హతుడు తాలుకూ సాక్ష్యాలు సృష్టిస్తే అవి అబద్ధం అని మీరు రుజువు చేయండి. అవతల ఒక మనిషి ప్రాణం పోయింది. వాళ్లకు న్యాయం జరగాలి కదా అని జడ్జ్ అంటాడు.
సారీ అని చెప్పిన రాజ్ లాయర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతాడు. ముద్దాయి ఆస్తి అంతస్తు బలం బలగం అన్నీ ఉన్నవాడు బెయిల్ మీద బయటకు వెళ్తే సాక్ష్యులను తారుమారు చేసే అవకాశం ఉంది అని. బెయిల్ మంజూరు చేయకూడదని అనామిక లాయర్ అంటాడు. వాళ్లు కొత్త సాక్ష్యాలు పుట్టిస్తే వాటిని తప్పుడు సాక్ష్యాలు రుజువు చేసే అవకాశం ఉంది. కానీ, ముద్దాయి సాక్ష్యులను లేకుండా చేస్తే ఆ రిస్క్ కోర్టు తీసుకోడానికి సిద్ధంగా లేదు. కాబట్టి, బెయిల్ రెజెక్ట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా మర్డర్ వెపన్, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ప్రజంట్ చేయలేదు అని జడ్జ్ అంటాడు.
పూర్తి సాక్ష్యాధారాలతో రేపు కోర్టుకు ముద్దాయిని హాజరుపరచండి అని జడ్జ్ అదేశిస్తాడు. రాజ్ను చూసి అపర్ణ బాధపడుతుంది. మహారాజులా ఉండేవాడివి ఇలా అయిపోయావేంట్రా. నువ్వే పాపం చేశావని నిన్ను దేవుడు ఇలా శిక్షిస్తున్నాడురా. నీకోసం గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామురా. నిన్ను పట్టుకుని ఈ పోలీసులు లాయర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అపర్ణ అంటుంది. చట్టం ఉందిగా అమ్మ అని రాజ్ అంటాడు.
నాకు తాతయ్య ఓనమాలతో పాటు చిన్నప్పుడు తప్పు చేయకుండా, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించారు. న్యాయం కోసం నిజాయితీగా పోరాడుతాను. నిర్దోషిగా బయటకు వస్తాను అని రాజ్ అంటాడు. శభాష్.. అని అనామిక ఎంట్రీ ఇస్తే అంతా కోప్పడుతారు. నేరస్థుడికి గుండెనిండా ధైర్యం నింపుతున్నారా అంటూ ఏదో ఒకటి అనామిక అంటుంది. రేపు రాజ్కు శిక్ష వేస్తే మీరు కూడా అనుభవించేలా ఉన్నారే అని అనామిక అంటుంది.
తప్పుడు సమాచారంతో నేరారోపణ చేస్తే శిక్ష పడదు. దేనికైనా జడ్జ్మెంట్ ఉంటుంది అని కావ్య అంటుంది. అది త్వరగానే వస్తుందిగా. రాజ్ బయటకు రాడని నాకు ఫుల్లుగా నమ్మకం ఉంది. నేను ప్రేమించినవాడితో సంతోషంగా ఉంటే రాజ్ అది చూడలేక నా సామంత్ను చంపేశాడు. దాని ఫలితమే ఇది. కచ్చితంగా అనుభవించి తీరుతాడు అని అనామిక అంటుంది. నువ్ ఎంత నాటకం ఆడిన నిజమే గెలుస్తుంది అని రాజ్ అంటాడు.
నేను కూడా నువ్ శిక్ష అనుభవిస్తావనే చెబుతున్నాను. దుగ్గిరాల కుటుంబంలో ప్రతి ఒక్కరు జీవితాంతం కన్నీళ్లు పెడుతుంటారు ఇది ఫిక్స్ అని అనామిక అంటుంది. నాకేం కాదు నేను వస్తాను అని తల్లికి ధైర్యం చెప్పి వెళ్తాడు రాజ్. ఏడవండి.. బాగా ఏడవంటి నాకు కావాల్సింది ఇదే అని అనామిక అనేసి వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో ఏంటీ కావ్య ఇది భార్యవి అయిండి భర్తపై వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా. ఈరోజు నువ్ చెప్పిన సాక్ష్యం వల్ల వాడి జీవితమే ప్రశ్నగా మారింది అని అపర్ణ అంటుంది.
ఇన్నిరోజులు నువ్ ఆలోచించే నిర్ణయం తీసుకున్నావ్. ఈరోజు నా కొడుకు విషయంలో తప్పు చేసేశావ్ అని కావ్యను నిందిస్తుంది అపర్ణ. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావ్ వదినా. వీళ్ల కుటుంబమే తేడా. వీళ్ల స్వార్థం కోసం అందరిని బలి పెడతారని. ఇన్నిరోజులు మంచిగా నటించింది. అవకాశం దొరకగానే మొగుడిని ఇరికించింది. ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. ఆ కంపెనీ కూడా నీ సొంతం అయిపోతే మొత్తం రాజ్యం ఏలేయొచ్చనే కదా అని రుద్రాణి అంటుంది.
అలాంటి ఆలోచనలు మీకొస్తాయేమో కానీ మాకు రావు. ఈరోజు అక్క చేసిన పని చాలా కరెక్ట్ అని అప్పు అంటే.. ఏంటీ కరెక్ట్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. భర్తకు సపోర్ట్ చేయకుండా మా రాజ్ను ఇరికించేసింది. మీ ముగ్గురు మా కుటుంబం పతనకోసమే పుట్టారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎవరు ఎవరి పతనం కోసం పుట్టారు. మా కాపురాన్ని మేమే పతనం చేసుకునేందుకు పుట్టామా. కోర్టులో అబద్ధం చెబితే తప్పుగాని నిజం చెబితే తప్పేంటీ అని కావ్య అంటుంది.
రుద్రాణి సెటైర్లు వేస్తుంది. నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా. ఆస్తులు తాక్టు పెట్టలేదా. ఇవన్ని తప్పులు కాదు అని రుద్రాణి అంటుంది. రుద్రాణి అది తప్పు కాదు. మా బావ ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం అని ఇందిరాదేవి వారిస్తుంది. మనం ఇలా ఉన్నామంటే కారణం కావ్య. ఈరోజు ఇదే ఇంట్లో నిలబడి ఈ చెత్తంతా వాగుతున్నావేంటీ ఇందిరాదేవి అని ఇందిరాదేవి అంటుంది. అది జీవితాంతం నీ మనవడిని జైల్లో కూర్చోబెట్టిందుకు సాక్ష్యం చెప్పిందమ్మా అని రుద్రాణి అంటుంది.
చాల్లే నోర్మూయ్. రాజ్ నిర్దోషి అని నమ్మింది కాబట్టే నిజాన్ని కోర్టులో నిర్భయంగా చెప్పింది అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ కావ్యను నువ్ తప్పు బడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీకో విషయం గుర్తుందా. రాజ్ బిడ్డను తీసుకొచ్చి తనే బిడ్డ అంటే అందరం అవమానించాం. కానీ, కావ్య మాత్రం అలాంటి వాడు కాదని నిజాన్ని బయటపెట్టింది. ఆరోజు నువ్ తల్లిగా ఓడిపోయినా నా మనవరాలు మాత్రం నా మనవడికి అండగా నిలబడింది. అలాంటి మనిషి నా మనవడు జైలుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందంటే ఎలా నమ్ముతున్నావ్. ఎలా ప్రశ్నించగలుగుతున్నావ్ అని ఇందిరాదేవి అపర్ణ కళ్లు తెరిపిస్తుంది.
అక్క నిజం చెప్పి మంచి పని చేసింది. ఇప్పుడు అబద్ధం చెబితే తర్వాత నిజాలు బయటకొస్తాయి. అప్పుడు మనమే కదా ఇరుక్కుంటాం అని అప్పు అంటుంది. రాజ్ జైలుకు వెళ్తే తల్లిగా బాధపడతావ్. ఓదార్చిడానికి నీ భర్త ఉంటాడు. నన్ను ఓదార్చడానికి నా బావ ఉన్నాడు. కానీ, ఒంటరి అయ్యేది ఈ పిచ్చిదే కదే. ఈ ఇంటి పరువు కాపాడటానికి, ఆస్తి కోసం పోరాడింది. ఈరోజు ఇంటి వారసుడుని కాపాడటానికి కూడా ఒంటరిగానే పోరాడుతుంది. దానికి మనందరం ఇస్తుందేంటీ నిందలు అని ఇందిరాదేవి అంటుంది.
భర్తను ఎలా కాపాడాలో తెలియక తన మనసులో ఒక యుద్ధమే జరుగుతున్నా బయటకు మాత్రం మౌనంగా ఉన్నా దీన్ని ఎవరే ఓదార్చేది అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కావ్య అని ప్రేమగా హగ్ చేసుకుంటుంది అపర్ణ. ఇందిరాదేవి మాటలకు అపర్ణ కళ్లు తెరుచుకుని చేసిన తప్పు తెలుసుకుంది. తర్వాత రాజ్కు క్యారియర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో భోజనం తినిపిస్తుంది. తర్వాత కోర్టులో రాజ్ పట్టుకున్న రాడ్ తెప్పించి దానిపై వేలి ముద్రలు మ్యాచ్ అయ్యాయి అని జడ్జ్ చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్