Brahmamudi April 21st Episode: రుద్రాణి కొత్త కుట్ర- రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం గొడవ- సంతోషంలో అపర్ణ- కావ్య చేతికి పవర్!-brahmamudi serial april 21st episode rudrani plans raj death certificate star maa brahma mudi today disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 21st Episode: రుద్రాణి కొత్త కుట్ర- రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం గొడవ- సంతోషంలో అపర్ణ- కావ్య చేతికి పవర్!

Brahmamudi April 21st Episode: రుద్రాణి కొత్త కుట్ర- రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం గొడవ- సంతోషంలో అపర్ణ- కావ్య చేతికి పవర్!

Sanjiv Kumar HT Telugu

Brahmamudi Serial April 21st Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 21 ఎపిసోడ్‌లో గుడి నుంచి వచ్చిన అపర్ణ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి కొత్త కుట్ర చేస్తుంది. కావ్య పేరు మీదకు పవర్ ఆఫ్ అటార్నీ చేయాలని అంటుంది. దాంతో రుద్రాణితో అపర్ణ గొడవ పెట్టుకుంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ ఏప్రిల్ 21వ తేది ఎపిసోడ్

ahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అపర్ణ ఎవరు అని వైధేహి అడిగితే.. బావ కన్నతల్లి. అనుకోకుండా, కొ ఇన్సిడెంటల్‌గా గుడిలో కలిశారు అని యామిని చెబుతుంది. అంటే, నిజంగానే ఆవిడను రామ్ గుర్తుపట్టలేదా అని వైధేహి అడుగుతుంది.

తప్పు చేస్తున్నావ్

గుర్తుపట్టలేదు. కానీ, నేను ఎంత దూరం పెడదామని చూస్తే వాళ్లు ఏదోలా దగ్గరవుతూనే ఉన్నారు అని యామిని అంటుంది. అది 9 నెలలు మోసి కన్న ప్రేమ. ఆ తల్లి పేగు తెంచుకుని పుట్టిన ప్రేమ. పాతికేళ్లు ఆ తల్లి తన కొడుకు పంచిన ప్రేమ. నువ్ మధ్యలో వచ్చి దూరం చేస్తే దూరం అవుతుందా. తప్పు చేస్తున్నావ్ యామిని. తన ఫ్యామిలీను తనకు దూరం చేస్తూ తప్పు చేస్తున్నావ్ అని యామిని తండ్రి అంటాడు.

అది నాకు ఇష్టమా. నేను బావను పెళ్లి చేసుకుంటే వాళ్లు కూడా నావాళ్లు అవుతారు. వాళ్లింట్లోనే కదా ఉండాల్సింది అని యామిని అంటుంది. మరి కావ్య పరిస్థితి ఏంటీ అని యామిని తండ్రి అడిగితే.. నాకు జరిగిన అన్యాయం గురించి ఏంటీ. ఈ ప్రేమను మేమిద్దరం కలిసి మొదలుపెట్టాం. తను మధ్యలో వచ్చిన ఒక ప్యాసింజర్ లాంటిది. నా చావు అయినా బతుకు అయినా రామ్‌తోనే. దానికోసం ఎంతదూరం అయినా వెళ్తాను అని యామిని అంటుంది.

మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఈ ఇంటి మేలు కోరేవారిని శత్రువులా చూస్తారుగా. ఈ ఇంట్లో ఆడపడుచు మాటలకు లెక్కలేకుంటే పోతుంది కదా అని రుద్రాణి అంటుంది. ఏదైనా ఉంటే సూటిగా చెప్పు అని ప్రకాషం అంటాడు. రాజ్ పోయాక.. అదే కనిపంచకుండా పోయాక.. కావ్య పిచ్చి భ్రమలో బతుకుతుందని మనందరికి తెలుసు. మరోవైపు కొడుకు లేదనే బాధతో అపర్ణ వదిన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఒకరి ఆరోగ్యాన్ని, మరొకరి మానసిక పరిస్థితిని పట్టించుకోవాలిగా అని రుద్రాణి అంటుంది.

నీకు వచ్చిన బాధేంటీ

ఏ మాయ మాటలు చెప్పింది. ఏ అబద్ధాలు చూపించిందో అపర్ణ వదినను మాయ చేసింది. ఇంట్లో ఇప్పుడు ఇద్దరు పిచ్చివాళ్లు తయారు అయ్యారు అని రుద్రాణి అంటుంది. అదే మీ దృష్టి లోపం అని అంటున్నాను అని స్వప్న అంటుంది. కావ్య ఏం చెప్పిందో మంచానికే పరిమితం అయినా అపర్ణను గుడికి వెళ్లేలా చేసిందిగా. నీకు వచ్చిన బాధేంటీ అని ఇందిరాదేవి అంటుంది. కొడుకు పోయినవాళ్లు ఇంత త్వరగా కోలుకోలేరు. ఏం ఆశలు కల్పించిందో ఏమో. తర్వాత వదినా మానసిక పరిస్థితిని అంచనా వేయగలరా అని రుద్రాణి అంటుంది.

ఇంతలో అపర్ణ వచ్చి అందరికి ప్రసాదం ఇస్తుంది. సంతోషంగా హడావిడి చేస్తుంది. అన్నదానం చాలా బాగా జరిగింది. ఇన్నేళ్లలో ఎప్పుడు జరగనంతా గొప్పగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని అపర్ణ అంటుంది. నేను చెప్పింది ఇప్పటికైనా నమ్ముతారా అని రుద్రాణి అంటుంది. నేను సంతోషంగా ఉండకూడదా. ఇంతకీ ఏం చెప్పావ్ అని అపర్ణ అడుగుతుంది. ఇన్నిరోజులు కావ్య ఒక్కతే పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఇప్పుడు నువ్ కూడా ఉన్నావ్ అని రుద్రాణి అంటుంది.

నీలాగే నేను కూడా రాజ్ లేడనే అనుకున్నా. కావ్య మాటలు నమ్మకుండా ఇంతకాలం నేను కూడా కావ్య మాటలు నమ్మలేదు. కానీ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాక. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నా రాజ్ తప్పకుండా తిరిగి వస్తాడని. నన్ను నమ్మండి. నాలో వచ్చిన ఈ మార్పే ఈ నమ్మకానికి సాక్ష్యం. నిజమండి మన రాజ్ త్వరలో మనింటికి వస్తున్నాడు. ఆ దేవుడే ఇంటికి పంపిస్తున్నాడు. నన్ను నమ్మండి. ఇక ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని అపర్ణ వెళ్లిపోతుంది.

హరికథ చెబుతున్నట్లు

మీ అత్తయ్య చెప్పేది నిజమా. రాజ్ తిరిగి వస్తాడని అంత నమ్మకంగా చెబుతుంది. ఏం జరిగింది అని కావ్యను అడుగుతాడు సుభాష్. నేను అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. ఆయన బతికే ఉన్నారు. కానీ, ఇంటికి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నకు ఆయన తిరిగి వచ్చిన రోజు సమాధానం దొరుకుతుంది. నన్ను నమ్మి నాతో నడవండి అని కావ్య వెళ్లిపోతుంది. ఏదో హరికథ చెబుతున్నట్లు అలా ఉంటారేంటీ అని రుద్రాణి అంటే.. రాజ్ వస్తాడని చెబుతుంది. కొన్నిరోజులు ఎదురుచూద్దాం అని ప్రకాషం అంటాడు.

కావ్య, వదిన మాటలు విన్నాక రాజ్ వస్తాడని ఆశ పుట్టింది. అది నిజం కావాలని కోరుకుందాం అన్నయ్య అని ప్రకాషం అని వెళ్లిపోతాడు. నువ్ పిచ్చిది పిచ్చిది అని ముద్ర వేయాలనుకున్న కావ్య మాటలే ఈ ఇంట్లో వాళ్లకి కంటితుడుపు అయ్యాయి. నువ్ కొన్నిరోజులు ఈ విషయం వదిలేయడమే మంచిది. లేనిపోని గొడవలు పెట్టి ఇంట్లోవాళ్లకు మనశ్శాంతి దూరం చేయకు అని సుభాష్ అంటాడు. ఇంటి ఆడపడుచు అంటున్నావ్ గా ఇకనైనా శుభం పలుకు అని ఇందిరాదేవి వెళ్లిపోతుంది.

ఉన్న వికెట్ కూడా అవుట్ అని రుద్రాణి అంటే.. నువ్ కూడా క్లీన్ బౌల్డ్ అవుతావ్. ఇంట్లో ఇక అంతా సంతోషంగా ఉంటారు అని స్వప్న వెళ్లిపోతుంది. గుడికి వెళ్లొచ్చిన అత్తయ్యలో ఇంత మార్పు ఏంటీ అని రాహుల్ అడుగుతాడు. నిజంగానే ఆ గుడిలో ఏదో జరిగింది. కొంపదీసి రాజ్ బతికే ఉన్నాడా. మనం సాక్ష్యాలు చూశాం కానీ బాడీ చూడలేదు కదా. అది నిజమో కాదో తెలుసుకోవాలి. అది వదినతోనే మొదలుపెట్టాలి అని రుద్రాణి అంటుంది.

పదునుపెట్టి ఆలోచించు

మీకు నాకు ఉన్న బంధం ఏంటీ అని అడిగితే చెప్పకుండా తప్పించుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇంతమంది ఉన్న నేను కళావతి గారికే ఎందుకు కనెక్ట్ అయ్యాను. తను మాత్రమే నాకు బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది. అయినా నా టాలెంట్ గురించి కళావతి గారికి తెలియదనుకుంటా. నేనే తెలుసుకుంటా. ఒక్కసారి మనసుకు పదునుపెట్టి ఆలోచించు అని రాజ్ ఆలోచిస్తాడు. కళావతి గారు గిఫ్ట్ పంపారు. దానిమీద ఆవిడకు సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది అని రాజ్ చూస్తాడు.

ఇదేంటీ ఫ్రమ్ అడ్రస్ లేదు. ఇలా కూడా కొరియర్స్ వస్తాయా. ఒక్కసారి కొరియర్ వాళ్లను అడిగి తెలుసుకుందాం అని వాళ్లకు కాల్ చేస్తాడు. ఫ్రమ్ అడ్రస్ లేదని రాజ్ అడిగితే.. మీకు పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి కొరియర్ పంపించారు. డిపార్ట్‌మెంట్ కావడం వల్ల ఫ్రమ్ అడ్రస్ గురించి పట్టించుకోలేదు అని అతను చెబుతాడు. గిఫ్ట్ పంపించింది కళావతి గారు. కానీ, కొరియర్ చేసింది పోలీస్ డిపార్ట్‌మెంట్. వీళ్లిద్దరికి ఏదో సంబంధం ఉంది అని రాజ్ అంటాడు.

వాళ్లు పంపించారు కాబట్టి నాకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఏదో సంబంధం ఉంది. అంటే.. నేను పోలీస్ డిపార్ట్‌మెంటా.. ఓహో.. కళావతి గారు కనిపెట్టేస్తా అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు రాజ్ ఫొటో చూస్తూ అపర్ణ సంతోషిస్తుంది. ఇంతలో వచ్చిన కావ్య మా ఆయనతో ఏదో ముచ్చట్లు చెబుతున్నారు అని కావ్య అంటే.. నా కొడుకుకి చెబుతున్నాను. ఈ తల్లీకొడుకులను ఎవరు దూరం చేయలేరు అని అపర్ణ అంటుంది. తర్వాత రాజ్‌ను ఎలా తీసుకొద్దామనుకుంటున్నావ్ అని అపర్ణ అడుగుతుంది.

రేపు కలుస్తారు

దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అని కావ్య చెబుతుంది. అది కాదే. ఆ యామిని పెళ్లి అంటూ నా కాళ్లకు దండం పెట్టి ఆశీర్వదించమంటుంటే నువ్ ఏది పట్టనట్లు ఎలా ఉంటున్నావ్ అని అపర్ణ అంటుంది. మనది అనుకుంది ఎలాగైనా మనకు చేరుతుంది. అదే నా నమ్మకం అని కావ్య అంటుంది. ఆయన గతం మర్చిపోయినా మా బంధం నా గురించి ఆయన్ను ఆలోచించేలా చేస్తుంది. త్వరలోనే ఆయనకు గతం గుర్తుకు వస్తుందనే నమ్మకం ఉంది అని కావ్య అంటుంది.

ఆయనకు గతం గుర్తుకు వచ్చేలా ఆర్ ఉన్న షర్ట్ పంపించాను. దాని గురించి అడగడానికైనా రేపు ఆయన నన్ను కలుస్తారు. దానికి ఏం చెప్పాలో కూడా అనుకున్నాను అని కావ్య చెబుతుంది. తర్వాత అపర్ణను భోజనానికి తీసుకెళ్తుంది కావ్య. ఇంట్లో అందరిని భోజనానికి పిలుస్తారు. చాలా సంతోషంగా ఉందని ప్రకాశం అంటాడు. అంతా భోజనానికి లేస్తుంటే ఒక్క నిమిషం అని రుద్రాణి ఆపుతుంది. రెండు నిమిషాలు ఆగండి అని రుద్రాణి అంటే.. ఈ రెండు నిమిషాల్లో ఏం కుట్ర చేయబోతున్నావ్ అని ఇందిరాదేవి ప్రశ్నిస్తుంది.

రాజ్ గొప్పతనాన్ని స్మరించుకోబోతున్నాం. ఒక్కసారి అలా చూడండి అని రుద్రాణి అంటే.. కొంతమంది వస్తారు. మీరేంటీ ఇలా వచ్చారు. ఏదైనా సమస్య అని కావ్య అంటుంది. సమస్య కాదు స్మరణం. రాజ్ స్మరణం. వీళ్లంతా మన కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. మనమిచ్చిన జీతాలతో సెటిల్ అయ్యారు. దీనంతటికి కారణం రాజ్. కానీ, రాజ్ దూరమైపోయాడుగా. రాజ్‌ను తలుచుకుంటూ మనలాగే వీళ్లు కూడా బాధపడుతున్నారు అని రుద్రాణి అంటుంది.

రాజ్ డెత్ సర్టిఫికేట్

అపర్ణ కోపంగా రుద్రాణిపైకి వస్తే.. కావ్య చేయి పట్టి ఆపుతుంది. దాంతో అపర్ణ ఆగిపోతుంది. అది రుద్రాణి చూస్తుంది. తర్వాత ఇంటికి ఇద్దరు వచ్చి బిల్స్ పెండింగ్ ఉన్నాయి, క్లియర్ చేయాలని అడుగుతారు. అలా చేయాలంటే రాజ్ వచ్చి సంతకం చేయాలి. లేదా రాజ్ చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి కావ్య పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ వచ్చేలా చేయాలి అని రుద్రాణి అంటుంది. కావ్యకు అధికారం ఇస్తే బిల్ క్లియర్ చేయొచ్చని రుద్రాణి అంటంది.

నా కొడుకు బతికే ఉన్నాడని అపర్ణ అంటుంది. నిజంగా బతికే ఉంటే ఇంటికి పిలిపించండి. లేదంటే డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టండి అని రాజ్ డెత్ సర్టిఫికేట్ కోసం రుద్రాణి గొడవ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం