Brahmamudi: రాజ్ బతికి ఉన్నాడా? లేదా? అన్న సీక్రెట్ కావ్య చేత బయటపెట్టించడానికి కొత్త ప్లాన్ వేస్తుంది రుద్రాణి. రా మెటిరియల్ సప్లయ్ చేసే కంపెనీకి కావ్య రెండు కోట్లు బాకీ ఉన్న సంగతి ఆఫీస్లో పనిచేసే వ్యక్తి రాహుల్ తెలుసుకుంటాడు. రాజ్ రాకపోతే కంపెనీ ఆ డీల్ పూర్తికాదని, కంపెనీ మూతపడుతుందనే పరిస్థితిని క్రియేట్ చేస్తారు.
తమ కంపెనీకి బాకీ ఉన్న నవ్య జ్యూవెల్లరీ షాప్ ఓనర్కు ఫోన్ చేస్తుంది రుద్రాణి. తాము నాలుగు కోట్లు బాకీ ఉన్నామని, ఆ డబ్బుల వెంటనే చెల్లించమని కావ్య తొందరపెడుతుందని జ్యువెల్లరీ ఓనర్ అంటాడు.
మీ డీల్ ఫినిష్ కావాలంటే బతికున్న రాజ్ రావాలి....లేదంటే కావ్య పేరున పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలి అని ఓనర్తో రుద్రాణి చెబుతుంది. కానీ కావ్య పేరిట పవర్ ఆఫ్ అటార్నీ లేదనే నిజం జ్యువెల్లరీ ఓనర్కు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రుద్రాణి.
ఆ తర్వాత రా మెటిరియల్ కంపెనీ ఓనర్కు ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో మీకు రెండు కోట్లు చెల్లిస్తానని కావ్య చెప్పిందట...కానీ రాజ్ చనిపోవడంతో కంపెనీకి రావాల్సిన పేమెంట్స్ ఆగిపోయాయి...కావ్యకు పవర్ ఆఫ్ అటార్నీ లేదు కాబట్టి మీకు ఇప్పట్లో డబ్బు ఇచ్చే అవకాశం లేదని రెచ్చగొడుతుంది.
మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, ఇప్పుడే ఇంటికి వచ్చి కావ్యను నిలదీస్తానని రా మెటిరియల్ కంపెనీ ఓనర్ ఆవేశంగా అంటాడు. ఇప్పుడు చూస్తా కావ్య ఎలా తప్పించుకుంటుందోనని రుద్రాణి అనుకుంటుంది.
నేను మీకు బిస్కెట్ వేద్దామని అనుకుంటే మీరే నాకు క్రీమ్ బిస్కెట్ వేశారని కావ్యతో అంటాడు రాజ్. నేను రా ఏజెంట్ ఏంటి? నేను చెప్పిన మాటలు నమ్మినట్లు నటించి నన్ను కామెడీ పీస్ను చేశారు కదా అని రాజ్ చెబుతాడు. హీరో అవ్వాలని జీరో అయ్యానని, నన్ను ఆట పట్టించింది చాలని కావ్యను బతిమిలాడుతాడు రాజ్. రాజ్ మాటలకు కావ్య నవ్వు ఆపుకోలేకపోతుంది.
ఒక్కసారిగా కావ్య సెలైంట్గా ఉండటంతో ఆమెకు ఏమైందోనని రాజ్ కంగారుపడతాడు. నాకు ఏమన్నా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారుగా అని కావ్య బదులిస్తుంది. దగ్గరగా ఉంటే ఏదైనా చేయగలను కానీ దూరంగా ఉన్నారుగా అని రాజ్ బదులిస్తాడు. కావ్య ఇంటి అడ్రెస్ అడుగుతాడు రాజ్. అడ్రెస్ అడుగుతున్నాడేంటి...కొంపదీసి ఇంటికి వచ్చేస్తాడా ఏంటి అని కావ్య కంగారు పడుతుంది. మా ఇంటి అడ్రెస్ మీకు ఎందుకు అని అడుగుతుంది. మీరు నాకు టిఫిన్లు, భోజనాలు, బట్టలు పంపించారు. మీకు ఏదో ఒక గిఫ్ట్ పంపించాలని ఫిక్సయ్యాను.
అడ్రస్ చెప్పండి మేడమ్ అని కావ్యను అడుగుతాడు రాజ్.మేడమ్ అనే పిలుపు బాగాలేదని, తనను కళావతి అనే పిలవమని, అలా పిలవడమే నచ్చుతుందని కావ్య సమాధానమిస్తుంది. మీరు అడ్రస్ చెప్పేవరకు మిమ్మల్ని మేడమ్ అనే పిలుస్తానని రాజ్ అంటాడు. అనడమే చెప్పినట్లే పిలుస్తాడు.
మీరు తెలివైన వారని నాకొక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది అని రాజ్తో అంటుంది కావ్య. కరెక్ట్గా చెప్పారని రాజ్ సమాధానమిస్తాడు. మీ టాలెంట్కు ఓ టెస్ట్ అని, మా ఇంటి అడ్రెస్ నేరుగా చెప్పకుండా పొడుపు కథ ద్వారా చెబుతున్నానని, అది విప్పితే మీరు నేరుగా మా ఇంటికి వస్తారని రాజ్తో అంటుంది కావ్య.
వజ్రాల కొండ నీటి ద్వారా దాటుకొని...మూడో దారి వెంట ముప్పై అడుగులు వేయగానే సూర్యోదయానికి ఆ ముక్కంటి మేనిఛాయ చివరన ఉండేదే మా ఇళ్లు అని కావ్య పొడుపుకథ చెబుతుంది. ఇది చాలా ఈజీ రాజ్ బిల్డప్లు ఇస్తాడు రాజ్. అయితే మా ఇంటి అడ్రెస్ చెప్పమని కావ్య అంటుంది. ఎన్నిసార్లు ఫూల్ అవుతావని తనను తాను తిట్టుకుంటాడు రాజ్. పైకి మాత్రం ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంటి అడ్రెస్ కనిపెడతానని కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు. ఎంత ప్రయత్నించిన పొడుపు కథలోని పదాలు రాజ్కు అంతుపట్టవు.
నవ్య జ్యువెల్లరీ ఓనర్ కావ్యకు ఫోన్ చేస్తాడు. రాజ్ డెత్ సర్టిఫికెట్తో పాటు పవర్ ఆఫ్ అటార్నీ ఉన్న మాకు మెయిల్ చేస్తేనే మీకు వెంటనే బిల్స్ క్లియర్స్ చేస్తామని అంటాడు. లేదంటే డబ్బులు ఇవ్వడం కుదరదని ఫోన్ కట్ చేస్తాడు. బతికున్న రాజ్ పేరు మీద ఎలా డెత్ సర్టిఫికేట్ తేస్తామని కావ్య ఆలోచనలో పడుతుంది.
అప్పటివరకు మీరు బిల్స్ ఇవ్వకపోతే కంపెనీ మూతపడుతుందని కావ్య ఎంత చెప్పిన వినకుండా ఫోన్ కట్ చేస్తాడు. సడెన్గా పవర్ ఆఫ్ అటార్నీ గురించి అడగటం వెనుక ఏతో మతలబు ఉండి ఉంటుందని కావ్య అనుకుంటుంది.
కావ్య ఆఫీస్కు బయలుదేరుతుంది. కాఫీ, టిఫిన్ చేయమని స్వప్న అడుగుతుంది. అర్జెంట్ పని ఉందని కావ్య బయలుదేరబోతుంది. క్యాబినెట్ మినిస్టర్కు అయినా టైమ్ ఉంటుంది...కానీ ఈ హోమ్ మినిస్టర్కు మాత్రం టైమ్ ఉండదని రుద్రాణి సెటైర్లు వేస్తుంది.
రా మెటిరియల్ కంపెనీ ఓనర్లు అప్పుడే ఇంటికి వస్తారు. ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పడం బాగాలేదని, రాజ్ చనిపోయిన తర్వాత బిల్స్ మొత్తం పెండింగ్లో పడ్డాయని అంటారు. ఇప్పుడే డబ్బు ఇవ్వాలని పట్టుపడతారు.
వాళ్ల బిల్స్ ఎందుకు లేటయ్యాయి..డబ్బులు ఎందుకు చెల్లించలేదు అని కావ్యను సీతారామయ్య, అపర్ణ అడుగుతారు. మీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉందని రుద్రాణి అంటుంది. అవసరం లేదు కావ్యనే సమాధానం చెబుతుంది అని ప్రకాశం అంటాడు. కానీ కావ్య సైలెంట్గా ఉంటుంది. కావ్య సమాధానం చెప్పే పరిస్థితి లేదని రుద్రాణి సమాధానమిస్తుంది. అసలు అకౌంట్లో డబ్బులు లేవని అంటుంది.
రాజ్ చనిపోవడంతో రావాల్సిన బిల్స్ చాలా పెండింగ్లో ఉన్నాయని, అది జరగాలంటే రాజ్ రావాలి, సంతకం పెట్టాలని రుద్రాణి అంటుంది. రాజ్ లేడు కాబట్టి అది కుదరదు. అలాగే పవర్ ఆఫ్ అటార్నీ కూడా కావ్యకు లేదు కాబట్టి ఆ డీల్స్ క్లోజ్ చేసే అధికారం కూడా అతడికి లేదు.
దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది. రాజ్ డెత్ సర్టిఫికెట్ సబ్మీట్ చేస్తేనే కావ్య పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ వస్తుంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి డెత్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫామ్ తెచ్చానని అంటుంది. దీనిపై మీరు సంతకాలు చేస్తే డెత్ సర్టిఫికెట్ తాను తెస్తానని రుద్రాణి అంటుంది.
సంతకాలు పెట్టడానికి కావ్య ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకోకపోతే కంపెనీ నష్టాల పాలవుతుంది. మనం రోడ్డున పడతాం అని రుద్రాణి చెబుతుంది. రాజ్ బతికే ఉన్నాడని కావ్య అంటుంది. అవన్నీ పిచ్చి మాటలు అని రుద్రాణి కొట్టిపడేస్తుంది. పిచ్చి మాటలు కాదని, వాస్తవమని అపర్ణ కోపంగా బదులిస్తుంది.
రాజ్ బతికే ఉంటే వెంటనే పిలిపించమని, లేదంటే డెత్ సర్టిఫికెట్పై సంతకాలు పెట్టమని రుద్రాణి బలవంతపెడుతుంది. రుద్రాణి మాటల్లో నిజముందని ధాన్యలక్ష్మి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది. తమకు మరో రోజు అవకాశం ఇవ్వమని రా మెటిరియల్ కంపెనీ ప్రతినిధులను కోరుతుంది కావ్య. వాళ్లు ఒప్పుకుంటారు.
ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతావు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలని కావ్యను నిలదీస్తుంది రుద్రాణి. రాజ్ బతికే ఉన్నాడని, ఇంకోసారి డెత్ సర్టిఫికెట్ అంటే బాగుండదని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య.
ఆ డీల్ క్లోజ్ చేసి కంపెనీని నష్టాల బారి నుంచి కాపాడటానికి రాజ్ చేత దొంగ సంతకాలు పెట్టిస్తుంది కావ్య. ఫోర్జరీ చేయడానికి రాజ్ ఒప్పుకోడు. కావ్య బతిమిలాడటంతో అంగీకరిస్తాడు. అవి పోర్జరీ సంతకాలని బయటపెట్టి కావ్యను ఇరికించాలని చూస్తుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం