అయితే, ఇదంతా సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం. కానీ, తల్లికొడుకులుగా నటించిన వారు నిజంగా భార్యాభర్తలు అవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే, ఇది నిజంగానే జరిగింది. ఓ సీరియల్లో తల్లికొడుకులుగా నటించిన ఇద్దరు రియల్ లైఫ్లో భార్యాభర్తలుగా మారారు. వారే హిందీ టెలివిజన్ యాక్టర్స్, మోడల్స్ అయిన కిష్వర్ మర్చంట్ (44), సుయాష్ రాయ్ (36).
సుయాష్ రాయ్ కంటే కిష్వర్ మర్చంట్ 8 సంవత్సరాలు పెద్దది. కానీ, లవ్, మ్యారేజ్కు అదేం అడ్డు కాదని అనేక సవాళ్లు ఎదుర్కొన్ని నిజ జీవితంలో దంపతులయ్యారు కిష్వర్, సుయాష్ రాయ్. వీరికి నిర్వైర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. బాలీవుడ్ మోడల్ అయిన కిష్వర్ మర్చంట్ పలు టీవీ సీరియల్స్లో నటించింది.
హిందీలో శక్తిమాన్, హిప్ హాప్ హుర్రే, ఏక్ హసీనా థీ, ఇత్నా కరో నా ముఝే ప్యార్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసీ యే యారియాన్, ధడ్కన్, కమ్మల్, క్యా హడ్సా క్యా హకీకత్, పియా కా ఘర్, కసం సే వంటి అనేక బుల్లితెర ధారావాహికల్లో పలు పాత్రలు పోషించిన కిష్వర్ మర్చంట్ బేజా ఫ్రై 2, మార్నే భి దో యారోన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది.
ఇక సుయాష్ రాయ్ డేంజరస్ ఓటీటీ వెబ్ సిరీస్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, క్యా హువా తేరీ వాదా, యే హై ఆషిఖీ, కైసే హై ఇష్క్ హై.. అజబ్ సా రిస్క్ హై, పిర్ బీ నా మానే బత్తమీజ్ దిల్, ఏక్ థా రాజా ఏక్ థీ రాణి, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్తోపాటు పలు టీవీ షోలలో పాల్గొన్నాడు సుయాష్ రాయ్.
2010లో ప్రారంభమైన ప్యార్ కీ యే కహానీ సీరియల్లో కిష్వర్ మర్ంట్ తల్లిగా నటిస్తే.. సుయాష్ రాయ్ ఆమెకు కొడుకుగా యాక్ట్ చేశాడు. తెరపై తల్లిదండ్రులుగా నటించిన వీరిద్దరు 2016లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. పలువురు నెగెటివ్గా కామెంట్స్ చేసిన ఈ జంట మాత్రం పట్టించుకోలేదు.
ఇక 2015లో బిగ్ బాస్ హిందీ సీజన్ 9లో కిష్వర్ మర్చంట్, సుయాష్ రాయ్ జంటగానే కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చారు. అటు సీరియల్స్లో కలిసి నటించండం, ఇటు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో పాల్గొనడంతో ఇరువురిపై ప్రేమ మొదలైంది. ఆ లవ్ స్టోరీ పెళ్లి పీటల వరకు వెళ్లి భార్యాభర్తలుగా మారారు కిష్వర్-సుయాష్.
సంబంధిత కథనం