Anthology OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ - నాలుగు క‌థ‌లు - న‌లుగురు ద‌ర్శ‌కులు-basil joseph malayalam anthology movie madhuram jeevamrutha bindu directly streaming soon on saina play ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anthology Ott: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ - నాలుగు క‌థ‌లు - న‌లుగురు ద‌ర్శ‌కులు

Anthology OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ - నాలుగు క‌థ‌లు - న‌లుగురు ద‌ర్శ‌కులు

Nelki Naresh HT Telugu

OTT: బాసిల్ జోసెఫ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీ మ‌ధురం జీవామృత‌బిందు థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. సైనా ప్లే ఓటీటీలో ఈ కామెడీ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఆంథాల‌జీ మూవీలో లాల్‌, సుహాసిణి మ‌ణిర‌త్నం, సైజు కురుప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న టిస్తున్నారు.

ఆంథాలజీ ఓటీటీ

Anthology OTT: మ‌ల‌యాళంలో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్‌. సూక్ష్మ‌ద‌ర్శిని, పొన్‌మాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఓ ఆంథాలజీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

సైనా ప్లే ఓటీటీలో...

మ‌ధురం జీవామృత‌బిందు టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ ఆంథాలజీ మూవీ టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌కు రెండు రోజుల్లో వ‌న్ మిలియ‌న్‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. కోరిక, ఇష్టం, సంతోషం లాంటి భావాల‌ను ఈ ఆంథాల‌జీ మూవీలో చ‌ర్చించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

టీజ‌ర్‌లో సినిమాల‌పై ఇష్టం ఉన్న ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లో బాసిల్ జోసెఫ్ క‌నిపించాడు. టీజ‌ర్ బీజీఎమ్ మెలోడీయ‌స్‌గా సాగింది. త్వ‌ర‌లోనే ఈ ఆంథాలజీ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సైనా ప్లే ఓటీటీ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ నెల‌లో మధురం జీవామృత‌బిందు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

నాలుగు క‌థ‌లు...

ఈ మూవీలో బాసిల్ జోసెఫ్‌తో పాటు లాల్‌, సుహాసిని మ‌ణిర‌త్నం, సైజు కురుప్‌, విన‌య్ ఫోర్ట్‌, జాఫ‌ర్ ఇడుక్కి, మాలా పార్వ‌తి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. నాలుగు క‌థ‌ల‌తో మ‌ధురం జీవామృత‌బిందు మూవీ తెర‌కెక్కుతోంది.

న‌లుగురు ద‌ర్శ‌కులు...

ఈ మ‌ల‌యాళం ఆంథాలజీ మూవీని న‌లుగురు ద‌ర్శ‌కులు క‌లిసి తెర‌కెక్కించ‌డం గ‌మ‌నార్హం. ప్రిన్స్ జాయ్, జెనిత్ కాచపల్లి, షాము జైబా, అప్పు ఎన్ భ‌ట్టాత్రి ఈ మ‌ల‌యాళం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఒక్కో క‌థ‌ను ఒక్కో ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. ఈ మ‌ల‌యాళం మూవీకి అరుణ్ ముర‌ళీధ‌ర‌న్‌, శ్రీహ‌రి కే నాయ‌ర్‌, సిద్ధార్థ ప్ర‌దీప్ మ్యూజిక్ అందించారు.

సూక్ష్మ‌ద‌ర్శినితో...

బాసిల్ జోసెఫ్ హీరోగా గ‌త ఏడాది రిలీజైన సూక్ష్మ‌ద‌ర్శిని మూవీ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప‌ది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 55 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొందింది. ఇటీవ‌లే పొన్‌మాన్‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు బాసిల్ జోసెఫ్‌. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తోన్న ప‌రాశ‌క్తి సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం