Anupama out from DJ Tillu 2: డీజే టిల్లు సీక్వెల్కు హీరోయిన్ కష్టాలు.. ప్రాజెక్టు నుంచి అనుపమ ఔట్
Anupama out from DJ Tillu 2: డీజే టిల్లు చిత్రానికి హీరోయిన్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సీక్వెల్లో హీరోయిన్గా అనుపమను ఎంపిక చేయగా.. తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
Anupama out from DJ Tillu 2: టాలీవుడ్లో డీజే టిల్లు చిత్రంతో తానేంటో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో దీనికి సీక్వెల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే డీజే టిల్లు 2 చిత్రానికి హీరోయిన్ సమస్యగా మారింది. ఫస్ట్ పార్ట్లో నటించిన నేహా శెట్టిని మొదట్లోనే సైడ్ చేయగా.. అనంతరం పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కూడా పక్కన పెట్టి అనుపమ పరమేశ్వర్ను తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాగా.. ఇంతలో అనుపమ కూడా ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆమె స్థానంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ అయినా సినిమా పూర్తయ్యే వరకు ఉంటుందా? లేక మరొకరిని తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
అనుపమ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోడానికి సిద్ధూనే కారణమైనట్లు తెలుస్తుంది. అనుపమ తను ఇచ్చిన డేట్లు ప్రకారం సరిగ్గా రావట్లేదని, డేట్లను సరిగ్గా సర్దుబాటు చేయదని ఆమెపై ముద్ర పడింది. దీంతో ఈ ముద్దుగుమ్మను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు సమాచారం.కార్తికేయ 2తో మంచి హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం 18 పేజీస్ అనే చిత్రంలో నటిస్తోంది.
డీజే టిల్లు సీక్వెల్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నరుడా డోనరుడా, అద్భుతం లాంటి చిత్రాలను తెరకెక్కించిన ఇతడు ఇప్పుడు డీజే టిల్లు 2తో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత కథనం