Allu arjun - Yash: ఒకే వేదికపై అల్లు అర్జున్,యశ్, విజయ్ దేవరకొండ-allu arjun vijay deverakonda and yash will attend as special guests for siima 2022 day 1 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun, Vijay Deverakonda And Yash Will Attend As Special Guests For Siima 2022 Day 1

Allu arjun - Yash: ఒకే వేదికపై అల్లు అర్జున్,యశ్, విజయ్ దేవరకొండ

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 05:41 PM IST

Allu arjun - Yash: సైమా అవార్డు వేడుకలు నేడు బెంగళూరు వేదికగా ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అవార్డు వేడుకలకు అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. వారితో పాటు ఈ వేడుకలకు హాజరుకానున్న స్టార్స్ ఎవరంటే...

అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Instagram)

Allu arjun - Yash: సైమా పదో ఎడిషన్ అవార్డ్ వేడుకల సందడి నేడు మొదలుకానుంది. బెంగళూరు వేదికగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు ఈ అవార్డ్ వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలో 2021 ఏడాదిలో సత్తా చాటిన దక్షిణాది సినిమాలకు భాషల వారిగా అవార్డులు ఇవ్వబోతున్నారు. కాగా శనివారం జరిగే తొలి రోజు అవార్డ్ వేడుకల కోసం అల్లు అర్జున్ బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులో ల్యాండ్ అయిన అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తొలిరోజు సైమా వేడుకలకు అల్లు అర్జున్ తో పాటు కేజీఎఫ్ ఫేమ్ యశ్, విజయ్ దేవరకొండ, రణ్‌వీర్ సింగ్‌ స్పెషల్ గెస్ట్ లుగా హాజరుకానున్నారు. ఈ యంగ్ హీరోలతో పాటు కమల్ హాసన్ కూడా ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఒకే వేదికపై అల్లు అర్జున్, యశ్, విజయ్ దేవరకొండ, రణ్ వీర్ సింగ్ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

సైమా అవార్డు వేడుకల్లో టాలీవుడ్ నుంచి పుష్ప 12 నామినేషన్స్ తో టాప్ ప్లేస్ లో నిలవగా పది నామినేషన్స్ తో అఖండ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఉప్పెన, జాతిరత్నాలు, పలు సినిమాలు అవార్డు రేసులో నిలిచాయి. తమిళంలో ధనుష్ కర్ణన్ సినిమా పది నామినేషన్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. కన్నడంలో రాబర్ట్, గరుడ గమన వృషభ వాహన, సినిమాలు అవార్డు రేసులో నిలిచాయి.

IPL_Entry_Point