Allu Arjun with Sneha Reddy: భార్యతో రొమాంటిక్ డ్రైవ్‌కు వెళ్లిన స్టైలిష్ స్టార్-allu arjun romantic late night drive with his wife sneha reddy watch video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Romantic Late Night Drive With His Wife Sneha Reddy Watch Video

Allu Arjun with Sneha Reddy: భార్యతో రొమాంటిక్ డ్రైవ్‌కు వెళ్లిన స్టైలిష్ స్టార్

Maragani Govardhan HT Telugu
Nov 09, 2022 11:06 AM IST

Allu Arjun with Sneha Reddy: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి రొమాంటిక్ లేట్ నైట్ డ్రైవ్‌కు వెళ్లారు. ఈ వీడియోను స్నేహా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు స్టైలిష్ స్టార్.

అల్లు అర్జున్-స్నేహా
అల్లు అర్జున్-స్నేహా

Allu Arjun with Sneha Reddy: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- స్నేహా రెడ్డి దంపతులు టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ అనే సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో వీరిని చూసే నేర్చుకోవాలి. వీలు కుదిరినప్పుడల్లా ఒకరికొకరు సమయాన్ని గడపుతుంటారు. అంతేకాకుండా హాలిడేల కోసం విదేశాలకు కూడా వెళ్తూ తమ కోసం సమయాన్ని కేటాయిస్తారు. కేవలం వెకేషన్లే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ కలిసి హైదరాబాద్ రోడ్లపై డ్రైవ్‌కు వెళ్తూ సరదాగా తమ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ కపుల్.. లేట్ నైట్ డ్రైవ్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నవంబరు 7వ తేదీ రాత్రి పొద్దుపోయిన తర్వాత నగరంలో రోడ్లపై రొమాంటిక్ లేట్ నైట్ డ్రైవ్‌కు వెళ్లారు అల్లు అర్జున్-స్నేహా దంపతులు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు. అల్లు అర్జున్ కారు నడుపుతుండగా.. స్నేహా ఆ వీడియోను తీస్తూ భర్తతో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదించారు. ఈ వీడియోలో అల్లు అర్జున్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించగా.. రేర్ వ్యూ కెమెరాలో స్నేహా తెలుపు రంగు దుస్తుల్లో కనిపించారు.

2003లో గంగోత్రి సినిమాతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన అల్లు అర్జున్.. మరికొన్ని నెలల్లో రెండు దశాబ్దాలను పూర్తి చేసుకోనున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకోగా.. వీరికి అల్లు అర్హ, అల్లు అయ్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పుష్ప చిత్రంతో పాన్ఇండియా సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికి పుష్ప-2 చిత్రీకరణ దశలో ఉండగా.. త్వరలోనే ఈ సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం. నవంబరు 13 నుంచి బ్యాంకాక్‌లో మొదటి షెడ్యూల్ జరగనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్