అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని, ఆర్టిస్ట్-వ్యాపారవేత్త జైనాబ్ రవ్జీల పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. శుక్రవారం (జూన్ 6) హైదరాబాద్లో వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. తన చిన్న కొడుకు జీవిత భాగస్వామిని పొందడం ‘కల నిజమైన క్షణం’గా నాగార్జున అభిర్ణించారు. ఈ ఫొటోల్లో నాగ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
“అపారమైన ఆనందంతో, మా ప్రియమైన కుమారుడు తన ప్రియమైన జైనాబ్ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) అందమైన వేడుకలో పెళ్లి చేసుకున్నాడని తెలియజేయడానికి అమల, నేను సంతోషిస్తున్నాము. ప్రేమ, నవ్వులు, మాకు అత్యంత ప్రియమైన వారి మధ్య ఒక కల నిజమవడం చూశాం” అని నాగ్ అన్నాడు.
నాగార్జున ఇంకా ఇలా అన్నాడు. “ఈ కొత్త ప్రయాణాన్ని కలిసి ప్రారంభించే వారికి మీ ఆశీస్సులు కోరుతున్నాము. ప్రేమతో, కృతజ్ఞతలతో. @AkhilAkkineni8 #InfiniteLove #Blessings #NewBeginnings”. వీటిలో ఒక ఫొటోలో అమల.. జైనాబ్, అఖిల్లను గట్టిగా పట్టుకొని ఆనందంగా కనిపించడం చూడొచ్చు. కుటుంబం అంతా ఫోటోలకు పోజులిచ్చారు.
మరొక ఫొటోలో అఖిల్, జైనాబ్ మెడలో మంగళసూత్రం కట్టడం చూడొచ్చు. ఆ వెనుక అతని వదిన శోభిత ధూళిపాళ (నాగ చైతన్య భార్య) ఉంది. అఖిల్, జైనాబ్ ఏడు అడుగులు వేస్తున్న ఫొటోలను, అలాగే నాగార్జున, అమల పూజ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫొటోలను కూడా నాగార్జున పోస్ట్ చేశాడు. అఖిల్, జైనాబ్ ఇద్దరూ లేత తెలుపు రంగు దుస్తులు ధరించి సంప్రదాయ తెలుగు సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.
అఖిల్, జైనాబ్ కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం తర్వాత, అఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఇలా పోస్ట్ చేశాడు.. “నా జీవిత భాగస్వామి దొరికింది. జైనాబ్ తో నా నిశ్చితార్థం జరిగిందని సంతోషంగా తెలియజేస్తున్నాను” అని అఖిల్ అన్నాడు. జైనాబ్ హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలో ఉన్నారు. ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.