అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం ‘రైడ్ 2’ బాక్సాఫీస్ కలెక్షన్లలో అదరగొడుతోంది. మే 1 న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. వాణి కపూర్, రితేష్ దేశ్ ముఖ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రూ.100 కోట్ల మార్కు దాటిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. 2018లో వచ్చిన 'రైడ్' చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది.
ముందస్తు అంచనాల ప్రకారం శుక్రవారం (మే 9) రైడ్ 2 రూ.4.46 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం థియేటర్లలో మొదటి వారం ముగిసేసరికి రూ .95.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు రెండో శుక్రవారం కలెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే రైడ్ 2 రూ.100 కోట్ల మార్కును దాటగలిగింది. 9 రోజుల్లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.100.21 కోట్లుగా ఉన్నాయి.
అజయ్ దేవగణ్ రైడ్ 2 సినిమా తొలిరోజు రూ.19.25 కోట్లు రాబట్టింది. 2022లో విడుదలైన దృశ్యం 2 కంటే రైడ్ 2 మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ .15.38 కోట్లు వసూలు చేసింది. కొత్త చిత్రాలు విడుదలైనప్పటికీ ఈ మూవీ మొదటి వారంలో బాక్సాఫీస్ ఊపును కొనసాగించింది. రైడ్ 2 శుక్రవారం మొత్తం 9.04% హిందీ ఆక్యుపెన్సీని కలిగి ఉందని నివేదిక సూచించింది
2018లో వచ్చిన రైడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వచ్చిన రైడ్ 2 కూడా బ్లాక్ బస్టర్ అయింది. అజయ్ దాదా మనోహర్ భాయ్ (రితేష్ దేశ్ ముఖ్) ఇంటిపై దాడులు నిర్వహించే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ అదరగొట్టారు.
ఈ చిత్రంలో సౌరభ్ శుక్లాతో పాటు వాణి కపూర్ కూడా కీ రోల్స్ ప్లే చేశారు. ఓ వైపు విలన్ గా రితేష్ యాక్టింగ్.. అందుకు దీటుగా అజయ్ నటనతో సినిమా దుమ్ములేపుతోంది. 1990ల నాటి కథతో సినిమా సాగుతోంది. ఫస్ట్ హాఫ్ లో దాదాపు ప్రతి మలుపులో ఒక ట్విస్ట్ తో సాగుతోందీ ఈ ఫిల్మ్.
సంబంధిత కథనం