ఓటీటీలోకి 9 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి-aishwarya rajesh crime thriller movie in telugu garuda 2 streaming now on aha video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి 9 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి 9 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ మూవీ ఏకంగా 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం. మరి ఈ మూవీ ఏంటి? ఎక్కడ చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

ఓటీటీలోకి 9 ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూసేయండి

ఐశ్వర్య రాజేష్ 2016లో తమిళంలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆరత్తు సినమ్. అంటే కోపం చల్లారదు అని అర్థం. ఈ మూవీకి దృశ్యం ఫ్రాంఛైజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కథ అందించడం విశేషం. ఇప్పుడీ మూవీ 9 ఏళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. హనుమాన్ మీడియా ఈ మూవీని తెలుగులో తీసుకువచ్చింది.

గరుడ 2.0 ఓటీటీ స్ట్రీమింగ్

ఐశ్వర్య రాజేష్ నటించిన మూవీ ఆరత్తు సినమ్ సినిమాను తెలుగులో గరుడ 2.0గా తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడీ సినిమాను తీసుకురావడం విశేషం.

గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి సినిమాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత ఇతడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ ఆరత్తు సినమ్ మూవీని తెలుగులో గరుడ 2.0గా ఆహా వీడియోలోకి తీసుకొచ్చారు. అరివళగన్ వెంకటాచలం ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. డిమోంటీ కాలనీ హీరో అరుళ్‌నిధి ఇందులో హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ గా కనిపించింది.

గరుడ 2.0 మూవీ స్టోరీ ఏంటంటే?

గరుడ 2.0 ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి తమన్ మ్యూజిక్ అందించాడు. ఇది మందుకు బానిసైన ఓ పోలీస్ ఆఫీసర్ ఓ కీలకమైన కేసును ఛేదించే కథ. తన భార్య, బిడ్డలు హత్యకు గురైన తర్వాత ఏసీపీ అరవింద్ (అరుళ్‌నిధి) మందుకు బానిసై సస్పెన్షన్ కు గురవుతాడు.

అయితే పలువురు యువకులు కిడ్నాప్ కు గురవడం, ఈ కేసును చూసే టీమ్ అసమర్థత కారణంగా.. దీనిపై దర్యాప్తు చేసే బాధ్యతను ఓ సీనియర్ అధికారి.. అరవింద్ కు అప్పగిస్తాడు. మొదట్లో దీనికి అంగీకరించని అతడు.. తర్వాత కేసును తీసుకుంటాడు.

వెంటనే ఈ కేసులో పురోగతి కూడా సాధిస్తాడు. ఈ కిడ్నాప్, హత్యలకు పాల్పడుతున్నవాడి ఆనవాళ్లు గుర్తిస్తాడు. వాళ్ల భార్యలు చేసిన తప్పులకు ఆ యువకులు బలైనట్లు కనిపెడతాడు. ఆ తర్వాత ఈ కేసును అతడు ఎలా పరిష్కరిస్తాడు? ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటన్నది గరుడ 2.0 మూవీలో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం