ఐశ్వర్య రాజేష్ 2016లో తమిళంలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆరత్తు సినమ్. అంటే కోపం చల్లారదు అని అర్థం. ఈ మూవీకి దృశ్యం ఫ్రాంఛైజీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కథ అందించడం విశేషం. ఇప్పుడీ మూవీ 9 ఏళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చింది. హనుమాన్ మీడియా ఈ మూవీని తెలుగులో తీసుకువచ్చింది.
ఐశ్వర్య రాజేష్ నటించిన మూవీ ఆరత్తు సినమ్ సినిమాను తెలుగులో గరుడ 2.0గా తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడీ సినిమాను తీసుకురావడం విశేషం.
గతంలో సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి సినిమాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత ఇతడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ ఆరత్తు సినమ్ మూవీని తెలుగులో గరుడ 2.0గా ఆహా వీడియోలోకి తీసుకొచ్చారు. అరివళగన్ వెంకటాచలం ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. డిమోంటీ కాలనీ హీరో అరుళ్నిధి ఇందులో హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ గా కనిపించింది.
గరుడ 2.0 ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి తమన్ మ్యూజిక్ అందించాడు. ఇది మందుకు బానిసైన ఓ పోలీస్ ఆఫీసర్ ఓ కీలకమైన కేసును ఛేదించే కథ. తన భార్య, బిడ్డలు హత్యకు గురైన తర్వాత ఏసీపీ అరవింద్ (అరుళ్నిధి) మందుకు బానిసై సస్పెన్షన్ కు గురవుతాడు.
అయితే పలువురు యువకులు కిడ్నాప్ కు గురవడం, ఈ కేసును చూసే టీమ్ అసమర్థత కారణంగా.. దీనిపై దర్యాప్తు చేసే బాధ్యతను ఓ సీనియర్ అధికారి.. అరవింద్ కు అప్పగిస్తాడు. మొదట్లో దీనికి అంగీకరించని అతడు.. తర్వాత కేసును తీసుకుంటాడు.
వెంటనే ఈ కేసులో పురోగతి కూడా సాధిస్తాడు. ఈ కిడ్నాప్, హత్యలకు పాల్పడుతున్నవాడి ఆనవాళ్లు గుర్తిస్తాడు. వాళ్ల భార్యలు చేసిన తప్పులకు ఆ యువకులు బలైనట్లు కనిపెడతాడు. ఆ తర్వాత ఈ కేసును అతడు ఎలా పరిష్కరిస్తాడు? ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటన్నది గరుడ 2.0 మూవీలో చూడొచ్చు.
సంబంధిత కథనం