ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే అమ్మాయి పరిచయం-aha video ott bold web series 3 roses season 2 to stream soon new character introduced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే అమ్మాయి పరిచయం

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే అమ్మాయి పరిచయం

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి గతంలో తెలుగులో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇప్పుడు రాబోతోంది. ఈ కొత్త సీజన్లోకి అడుగుపెట్టబోయే కొత్త పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఈ క్యారెక్టర్ ను బట్టి చూస్తుంటే.. కొత్త సీజన్ మరింత బోల్డ్ గా ఉండేలా కనిపిస్తోంది.

ఓటీటీలోకి తెలుగు బోల్డ్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. వయసు మీద పడిన మగాళ్లపై మనసు పారేసుకునే అమ్మాయి పరిచయం

ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు కొదవే లేదు. ఇక ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు కంటెంట్ అందించే ఆహా వీడియో ఓటీటీ కూడా ఇలాంటి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉంది. గతంలో 3 రోజెస్ పేరుతో ఇలాంటి ఓ బోల్డ్ వెబ్ సిరీస్ అందించింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. ఇందులో నటించిన కొత్త పాత్రను తాజాగా పరిచయం చేశారు.

3 రోజెస్ సీజన్ 2లో కొత్త పాత్ర

3 రోజెస్ రెండో సీజన్ లో కొత్త రోజ్ వచ్చిందంటూ మంగళవారం (ఏప్రిల్ 29) ఆహా వీడియో ఓటీటీ ఓ చిన్న గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసింది. ఈ కొత్త రోజ్ ను పరిచయం చేయనున్నట్లు ఒక రోజు ముందే వెల్లడించారు. ఇప్పుడు 39 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోను రిలీజ్ చేశారు. కొత్త సీజన్ లో ఖుషితా కల్లాపు కొత్తగా ఎంట్రీ ఇస్తోంది. ఈ పాత్ర మరింత బోల్డ్ గా ఉండబోతున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

“కొత్త రోజ్‌ను కలవండి. ఖుషితా కల్లాపు. ఈమె వయసు మీద పడిన మగాళ్లను ప్రేమిస్తుంది. ఈమె జీవితం గందరగోళం. ఈమే మీ స్పిరిట్ యానిమల్ కావచ్చు” అనే క్యాప్షన్ తో ఆ వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఆమె బ్యాక్‌లెస్ గా కనిపించి రచ్చ చేసింది. స్వేచ్ఛగా విహరిస్తూ, పార్టీల్లో మునిగి తేలే పాత్రలా వీడియో చూస్తే కనిపిస్తోంది. త్వరలోనే ఈ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది.

3 రోజెస్ వెబ్ సిరీస్ గురించి..

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మారుతి క్రియేట్ చేసిన షో ఈ 3 రోజెస్. మ్యాగీ డైరెక్ట్ చేయగా.. రవి నంబూరి కథ అందించారు. నవంబర్, 2021లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ప్రముఖ నటీమణులు పాయల్ రాజ్‌పుత్, ఈశా రెబ్బ, పూర్ణ నటించారు. రీతూ, జాన్వీ, ఇందు అనే ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథే ఈ 3 రోజెస్. ఈ ముగ్గురూ మంచి స్నేహితులు. ఎవరి ఆలోచనలు, జీవితం వాళ్లది.

అయితే అందరూ తమకు తాముగా స్వతంత్రంగా జీవించాలనుకునే మనస్తత్వం. వీళ్లకు పెళ్లి చేయాలని ముగ్గురినీ వాళ్ల పేరెంట్స్ హైదరాబాద్ కు పిలిపిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల జీవితాలు కీలక మలుపు తిరుగుతాయి. ప్రేమలో పడతారు. విడిపోతారు. తమను తాము మరింత లోతుగా తెలుసుకుంటారు. తమ మధ్య ఉన్న స్నేహాన్ని కొనసాగిస్తూనే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్ ను తీసుకొస్తున్నారు. అయితే ఈ కొత్త సీజన్లో కొత్త పాత్ర ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా వెల్లడించిన ఆహా వీడియో.. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా ఇవ్వనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం