వారెవా.. అలనాటి తారల అరుదైన కలయిక.. 80ల నాటి స్టార్ల రీయూనియన్.. చిరు, వెంకీ, రాధ, జయసుధ అందరూ ఒక్కచోటే!-1980s stars reunion chiranjeevi venkatesh radha jayasudha ramyakrishnan and others at one place chiranjeevi post viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  వారెవా.. అలనాటి తారల అరుదైన కలయిక.. 80ల నాటి స్టార్ల రీయూనియన్.. చిరు, వెంకీ, రాధ, జయసుధ అందరూ ఒక్కచోటే!

వారెవా.. అలనాటి తారల అరుదైన కలయిక.. 80ల నాటి స్టార్ల రీయూనియన్.. చిరు, వెంకీ, రాధ, జయసుధ అందరూ ఒక్కచోటే!

1980ల్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఉర్రూతలూగించిన స్టార్లు మళ్లీ కలిశారు. రీయూనియన్ లో మెరిశారు. పులి చారల డ్రెస్ కోడ్ తో వీళ్లు మీట్ అయ్యారు. చిరంజీవి, వెంకటేష్, రాధ, జయసుధ తదితరులు ఒక్కచోట చేరారు.

80ల నాటి స్టార్స్

చిరంజీవి, జాకీ ష్రాఫ్, శోభన, రేవతి, రమ్యకృష్ణన్, వెంకటేష్ దగ్గుబాటి వంటి 80ల నాటి సూపర్ స్టార్లు మరోసారి కలిశారు. ప్రతి ఏడాది మీట్ అయ్యే ఈ సెలబ్రిటీలు ఇప్పుడు మూడు సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలోని నటుడు, దర్శకుడు రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ నివాసంలో కలిశారు.

చిరంజీవి పోస్ట్

1980ల నాటి మిత్రులతో చిరంజీవి సందడి చేశారు. గ్రూప్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు మెగాస్టార్.

‘‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఒక జ్ఞాపకాల ప్రయాణం. దశాబ్దాలుగా మేము పంచుకున్న విడదీయరాని బంధం అలాగే ఉంది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు. ప్రతి కలయిక మొదటిసారి కలిసినంత తాజాగా అనిపిస్తుంది" అని చిత్రాలతో పాటు ఒక స్వీట్ నోట్ రాశారు చిరు.

క్లాస్ ఆఫ్ 80

సీనియర్ నటి రేవతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కూడా ఈ ఫోటోలను పంచుకుంది. “క్లాస్ ఆఫ్ 80 స్టిల్ రాక్స్. మేము సాధారణంగా కలవని స్నేహితులను కలిసే సాయంత్రం… మేము కలిసి పనిచేసిన వ్యక్తులు… 12 సంవత్సరాలకు పైగా కలిసే ఏకైక సమూహం… లిస్సీ, హాసిని, పూర్ణిమ, రాజ్‌కుమార్. ఖుష్బులకు ధన్యవాదాలు. కలిసి ఉండటమే ఆనందంగా ఉండే సాయంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. క్లాస్ ఆఫ్ '80s రాక్!!!" అని ఆమె పేర్కొన్నారు.

ఫ్యాన్స్ రియాక్షన్

అభిమానులు కూడా ఈ స్టార్లను ఒక్క చోట కలిసి చూడటంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఒకే ఫ్రేమ్‌లో చాలా మంది పెద్ద స్టార్లు 👏👍ప్రియమైన స్నేహితుల కలయిక ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండటానికి, పూర్తి శక్తితో తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి చాలా మంచిది" అని ఓ ఫ్యాన్ రాసుకొచ్చాడు.

ఈ స్టార్లు

ఈ సంవత్సరం రీయూనియన్ కు హాజరైన వాళ్లలో చిరంజీవి, వెంకటేష్, జాకీ ష్రాఫ్, ప్రభు, నరేష్, సురేష్, జయరామ్, శరత్‌కుమార్, రమ్యకృష్ణ, శోభన, ఖుష్బూ, మీనా సాగర్, రాధ, జయసుధ, సుహాసిని, నదియా తదితరులున్నారు. లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్, ఖుష్బు సుందర్, సుహాసిని మణిరత్నం ఈ ప్లాన్ చేశారు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిందీ చలనచిత్ర పరిశ్రమల నుండి మొత్తం 31 మంది స్టార్లు హాజరయ్యారు. ఈ సంవత్సరం పార్టీకి చిరుతపులి-ప్రింట్ దుస్తులు డ్రెస్ కోడ్‌గా ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం