Chief election commissioner : నూతన సీఈసీ నియామకం- ఎవరు ఈ జ్ఞానేశ్​ కుమార్​?-who is gyanesh kumar the new chief election commissioner ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Chief Election Commissioner : నూతన సీఈసీ నియామకం- ఎవరు ఈ జ్ఞానేశ్​ కుమార్​?

Chief election commissioner : నూతన సీఈసీ నియామకం- ఎవరు ఈ జ్ఞానేశ్​ కుమార్​?

Sharath Chitturi HT Telugu
Published Feb 18, 2025 05:29 AM IST

Gyanesh Kumar CEC : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా జ్ఞానేశ్​ కుమార్​ని నియమించారు. ఈయన పేరును ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది.

Gyanesh Kumar.
Gyanesh Kumar. (ECI/X)

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా జ్ఞానేశ్ కుమార్​ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.

నూతన ఎన్నికల కమిషనర్​..

ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టం ప్రకారం ఈ పదవికి నియమితులైన తొలి సీఈసీగా నిలిచారు జ్ఞానేశ్​ కుమార్​. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేశారు.

సౌత్ బ్లాక్​లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమైంది. సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో ఒకరి పేరును సిఫారసు చేసింది.

మరోవైపు1989 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ డాక్టర్ వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్​గా నియమిస్తున్నట్లు ప్రకటనలో ఉంది.

ఎవరీ జ్ఞానేశ్​ కుమార్?

  • 1988 బ్యాచ్​కు చెందిన కేరళ కేడర్ అధికారి జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
  • నూతన సీఈసీగా నియమితులైన జ్ఞానేశ్​ కుమార్​ 2022 మే నుంచి అమిత్ షా మంత్రివర్గంలో కార్యదర్శిగా పనిచేశారు.
  • జ్ఞానేశ్​ కుమార్ మొదట మే 2016 నుంచి సెప్టెంబర్ 2018 వరకు సంయుక్త కార్యదర్శిగా, తరువాత సెప్టెంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2021 వరకు అదనపు కార్యదర్శిగా హోం శాఖలో ఐదేళ్లు పనిచేశారు.
  • 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అదనపు కార్యదర్శిగా ఆయన జమ్ముకశ్మీర్ డెస్క్​కి నేతృత్వం వహించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అమిత్ షాతో కలిసి ఆయన పార్లమెంటుకు వెళ్లేవారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
  • సుఖ్​బీర్ సింగ్ సంధుతో పాటు జ్ఞానేశ్ కుమార్ గత ఏడాది మార్చ్​లో ఎన్నికల కమిషనర్​గా నియమితులయ్యారు.
  • కాన్పూర్​లోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్​లో బీటెక్ పట్టా పొందారు నూతన సీఈసీ. కుమార్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ చదివారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం