PM Modi nomination : అంగరంగ వైభవంగా.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​-pm modi files nomination for 2024 lok sabha elections in varanasi ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi Nomination : అంగరంగ వైభవంగా.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​

PM Modi nomination : అంగరంగ వైభవంగా.. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​

Sharath Chitturi HT Telugu

PM Modi Varanasi nomination :2024 లోక్​సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ.. తాజాగా తన నామినేషన్​ని దాఖలు చేశారు. ఎన్​డీఏ పక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్నికల నామినేషన్​ని దాఖలు చేసిన మోదీ..

Lok Sabha elections 2024 : 2024 లోక్​సభ ఎన్నికల కోసం వారణాసి నుంచి తన నామినేషన్​ని దాఖలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్​డీఏ కూటమి నేతలు, బీజేపీ కార్యకర్తలు, ప్రజల కోలాహలం మధ్య.. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్​ కార్యాలయంలో తన నామినేషన్​ పత్రాలను సమర్పించారు.

అంగరంగ వైభవంగా ప్రధాని నామినేషన్​ ప్రక్రియ..

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్​ ప్రక్రియ అంగరంగ వైభవంగా జరిగింది. నామినేషన్​ని దాఖలు చేసేందుకు సోమవారం సాయంత్రం వారణాసి వెళ్లిన ఆయన.. ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

మోదీ నామినేషన్​ కోసం వారణాసిలో అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఎటు చూసినా కాషాయ రంగే కనిపిస్తోంది. ఫ్లేక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఇక మోదీని చూసేందుకు ప్రజలు భారీ లైన్లలో నిలబడ్డారు.

మంగళవారం ఉదయం వారణాసిలో ఘాట్​కి వెళ్లి పూజలు చేశారు. అనంతరం.. అక్కడి నుంచి కాలభైరవుడి గుడికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా అక్కడ ఉన్నారు.

Modi nomination in Varanasi : అక్కడి నుంచి.. ఉదయం 11:30 ప్రాంతంలో.. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్​ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11:40- మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తన నామినేషన్​ని దాఖలు చేశారు. ఈ సమయంలో పుష్యమి నక్షత్రం, గంగా సప్తమి ఉండటంతో.. ఇది పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో ఏం కోరుకున్నా, అది కచ్చితంగా నేరవేరుతుందని హిందువుల నమ్మకం. అందుకే మోదీ కూడా ఈ సమయాన్ని ఎంచుకున్నారు.

ఇక.. మోదీ నామినేషన్​ దాఖలు ప్రక్రియలో.. కేంద్ర మంత్రులతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి, మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​తో పాటు మొత్తం మీద 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇటీవలే ఎన్​డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సైతం.. ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు.

PM Modi latest news : ఎన్నికల్లో పోటీ చేసేందుకు, అఫిడవిట్​లో నలుగురి ప్రతిపాదనలతో సంతకాలు కావాలి. మోదీ కోసం.. పండిత్​ గణేశ్వర్​ శాస్త్రి, బైజ్యనాథ్​ పటేల్​, లాల్​చంద్​ కుశ్వాహ, సంజయ్​ సోంకర్​లు ప్రతిపాదన చేశారు.

2014 నుంచి వారణాసి నుంచి సిట్టింగ్​ ఎంపీగా ఉన్నారు మోదీ. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇక 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. మూడోసారి అధికారాన్ని చేపట్టాలని మోదీ, బీజేపీ భావిస్తోంది. 7 దశల పోలింగ్​ ప్రక్రియలో ఇప్పటికి 4 దశలు పూర్తయ్యాయి. చివరి దశ అయిన జూన్​ 1న.. వారణాసిలో పోలింగ్​ జరగనుంది. ఇక జూన్​ 4న లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

సంబంధిత కథనం