Lok Sabha elections : ఓటింగ్​లో భారత్​ ప్రపంచ రికార్డు.. మహిళా ఓటర్లను ఆకాశానికి ఎత్తిన ఈసీ!-india sets world record with 642 million voters in lok sabha elections ec ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections : ఓటింగ్​లో భారత్​ ప్రపంచ రికార్డు.. మహిళా ఓటర్లను ఆకాశానికి ఎత్తిన ఈసీ!

Lok Sabha elections : ఓటింగ్​లో భారత్​ ప్రపంచ రికార్డు.. మహిళా ఓటర్లను ఆకాశానికి ఎత్తిన ఈసీ!

Sharath Chitturi HT Telugu
Jun 03, 2024 02:19 PM IST

Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల్లో భారత్​ ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు సీఈసీ రాజీవ్​ కుమార్​. మహిళా ఓటర్లను మెచ్చుకున్నారు.

ఓటింగ్​లో భారత్​ ప్రపంచ రికార్డు!
ఓటింగ్​లో భారత్​ ప్రపంచ రికార్డు! (PTI)

Lok Sabha elections 2024 : లోక్​సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు.. ప్రెస్​ మీట్​ నిర్వహించారు చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​. ఓటింగ్​లో భారత దేశ ప్రపంచ రికార్డును సృష్టించిందని ప్రకటించారు. 7 విడతల్లో జరిగిన పోలింగ్​ ప్రక్రియలో మొత్తం మీద 642 మిలియన్​ మంది రిజిస్టర్డ్​ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. పోలింగ్​ ప్రక్రియలో 312 మిలియన్​ మంది మహిళలు పాల్గొన్నారని, ఇది కూడా ఒక గొప్ప రికార్డ్​ అని స్పష్టం చేశారు.

yearly horoscope entry point

“642 మిలియన్​ ఓటర్లతో మనం వరల్డ్​ రికార్డు సృష్టించాము. జీ7 దేశాల్లోని ఓటర్లతో పోల్చితే ఇది 1.5 రెట్లు ఎక్కువ. మొత్తం ఈయూలోని 27 దేశాలతో పోల్చుకుంటే.. 2.5 రెట్లు అధిక ఓటర్లు మన దగ్గర ఉన్నారు,” అని సీఈసీ రాజీవ్​ కుమార్​ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో.. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలకు స్టాండింగ్​ ఒవేషన్​ ఇవ్వాలని అన్నారు.

లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియలో 1.5 కోట్ల సిబ్బంది- భద్రతా దళాలను మోహరించినట్టు, 68వేల మానిటరింగ్​ టీమ్స్​ని సైతం రంగంలోకి దింపినట్టు వివరించారు రాజీవ్​ కుమార్​.

Lok Sabha election counting live updates : 'మేము ఇక్కడే ఉన్నాము. ఎప్పుడూ అదృశ్యం అవ్వలేదు' అని సోషల్​ మీడియాలో వైరల్​ అయిన 'లాపతా జెంటిల్​మెన్​ (అదృశ్యమైన ఈసీ అధికారులు)'పై కామెంట్​ చేశారు రాజీవ్​ కుమార్​.

2024 లోక్​సభ ఎన్నికల కోసం 4లక్షల వాహనాలు, 135 స్పెషల్​ ట్రైన్లు, 1692 విమాన సదుపాయాలను ఉపయోగించుకున్నట్టు తెలిపారు సీఈసీ.

2019లో 540సార్లు రీ-పోలింగ్​ జరగ్గా.. 2024లో అది కేవలం 39గా ఉందని వివరించారు రాజీవ్​ కుమార్​. జమ్ముకశ్మీర్​లో.. 4 దశాబ్దాల్లోనే అత్యధిక ఓటింగ్​ శాతం (58.58) నమోదైందని వివరించారు.

2024 Lok Sabha elections EC : ఇక ఎన్నికల నేపథ్యంలో 10వేల కోట్లు విలువ చేసే నగదు, డ్రగ్స్​, మద్యాన్ని సీజ్​ చేసినట్టు సీఈసీ తెలిపారు. 2019లో ఇది రూ. 3,500 కోట్లుగా ఉండేదని వివరించారు.

ఇక 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం చేసినట్టు తెలిపారు సీఈసీ రాజీవ్​ కుమార్​. తొలుత పోస్టల్​ బ్యాలెట్​లోని ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారని వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం