Telangana Loksabha Election Results 2024 : తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కించనున్నారు.
తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి ఫలితం నిజామాబాద్ లోక్సభ నియోజక వర్గంలో వెలువడనుంది.
కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ నియోజకవర్గాల ఫలితాలు చివరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నియోజక వర్గాల్లో 24 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది.
తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా మొత్తం 525 మంది పోటీలో ఉన్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు.