Assembly Elections Exit Poll 2023: ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొచ్చా? 2018 ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాాయా?-assembly elections exit poll 2023 how accurate were numbers in 2018 elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Assembly Elections Exit Poll 2023: ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొచ్చా? 2018 ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాాయా?

Assembly Elections Exit Poll 2023: ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొచ్చా? 2018 ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాాయా?

HT Telugu Desk HT Telugu

Assembly Elections Exit Poll 2023: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా ముగిసింది. దాంతో మీడియా సంస్థలు నవంబర్ 30 సాయంత్రం 5.30 గంటల నుంచి పోటాపోటీగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నాయి. అయితే, ఆ అంచనాల్లో నిజమయ్యేవి ఎన్ని? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

ప్రతీకాత్మక చిత్రం

గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన పార్టీ… ఆ అంచనాలను స్వాగతించడం.. ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన పార్టీ… ఆ అంచనాలను వ్యతిరేకించడం సహజం. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే, గత ఎన్నికల్లో ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరైనవిగా తేలాయో ఇక్కడ చూద్దాం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో..

Telangana: తెలంగాణ

మొత్తం స్థానాలు: 119; మెజారిటీ మార్క్ 60

ఎగ్జిట్ పోల్స్

టైమ్స్ నౌ-CNX: బీఆర్ఎస్( అప్పుడు టీఆర్ఎస్) 66, కాంగ్రెస్‌ 37, బీజేపీ 7 సీట్లు.

2. యాక్సిస్ మై ఇండియా-ఇండియా టుడే: బీఆర్‌ఎస్‌ 79-91, కాంగ్రెస్-టీడీపీ కూటమి 21-33.

3. సీ వోటర్: బీఆర్‌ఎస్‌ 58, కాంగ్రెస్‌ 45.

4. NewsX-Neta: బీఆర్‌ఎస్‌ 57, కాంగ్రెస్‌ 46.

వాస్తవ ఫలితాలు

ఈ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీఆర్ఎస్ (BRS) 88 సీట్లు గెలుచుకుని, ఘన విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 19 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.

రాజస్తాన్

మొత్తం స్థానాలు: 200; మెజారిటీ మార్క్ 101

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..

  1. సీవోటర్-రిపబ్లిక్ టీవీ: బీజేపీ 60 సీట్లు, కాంగ్రెస్‌ 137.

2. సీఎన్‌ఎక్స్ టైమ్స్: బీజేపీ 85, కాంగ్రెస్‌ 105 .

3. ఇండియా టీవీ - బీజేపీ 80-90, కాంగ్రెస్‌కు 100-110

4. CSDS-ABP - బీజేపీ 83, కాంగ్రెస్‌ 101.

5. యాక్సిస్ మై ఇండియా-ఇండియా టుడే - బీజేపీ 55-72, కాంగ్రెస్‌ 119-141

6. రిపబ్లిక్-జన్ కీ బాత్ - బీజేపీ 93, కాంగ్రెస్‌ 91 సీట్లు.

వాస్తవ ఫలితాలు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సరిగ్గా 100 స్థానాలు గెల్చుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ 73 సీట్లు గెల్చుకుంది.

Madhya Pradesh: మధ్య ప్రదేశ్

మొత్తం స్థానాలు: 230; మెజారిటీ మార్క్ 116

ఎగ్జిట్ పోల్స్

  1. సీఎన్‌ఎక్స్-టైమ్స్ నౌ: బీజేపీ 126 సీట్లు, కాంగ్రెస్‌ 89.

2. న్యూస్24-పేస్ మీడియా: బీజేపీ 103, కాంగ్రెస్‌ 115.

3. CSDS-ABP న్యూస్: బీజేపీ 94, కాంగ్రెస్‌ 126

4. యాక్సిస్ మై ఇండియా-ఇండియా టుడే: బీజేపీ 111 సీట్లు, కాంగ్రెస్‌ 113.

5. India News- NETA : బీజేపీ 106, కాంగ్రెస్‌ 112.

వాస్తవ ఫలితాలు

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిల్చింది. బీజేపీ 109 సీట్లు గెల్చుకుంది. ఓట్ షేర్ మాత్రం బీజేపీకే ఎక్కువగా ఉండడం విశేషం.

Chhattisgarh: చత్తీస్ గఢ్

మొత్తం స్థానాలు: 90; మెజారిటీ మార్క్ 46

1. CSDS-ABP న్యూస్: బీజేపీ 52, కాంగ్రెస్‌ 35.

2. సి ఓటర్-రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్‌ 45, బీజేపీ 39.

3. న్యూస్ 24-పేస్ మీడియా: బీజేపీ 39, కాంగ్రెస్‌ 48.

4. యాక్సిస్ మై ఇండియా–ఇండియా టుడే: కాంగ్రెస్‌ 60, బీజేపీ 26.

5. News X-NETA: బీజేపీ 42, కాంగ్రెస్‌ 41

6. టుడేస్ చాణక్య: బీజేపీ 36, కాంగ్రెస్‌ 50

వాస్తవ ఫలితాలు

ఈ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ పార్టీ 68 సీట్లు గెల్చుకుని ఘనవిజయం సాధించింది.

Mizoram: మిజోరం

మొత్తం స్థానాలు: 40; మెజారిటీ మార్క్ 21

  1. సీవోటర్-రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్‌ 16-20, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) 14-18.

2. సీఎన్‌ఎక్స్ టైమ్స్: కాంగ్రెస్‌ 18, బీజేపీ 16.

వాస్తవ ఫలితాలు

మిజోరంలో 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ 5, జడ్ పీఎం 8 సీట్లు గెల్చుకున్నాయి.